Movie News

ఆచార్య టీం.. లైన్లో పడింది

మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్‌ల క్రేజీ కాంబినేషన్లో.. ఇప్పటిదాకా తీసిన నాలుగు చిత్రాలతోనూ బ్లాక్‌బస్టర్ అందుకున్న కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఆచార్య’. ఐతే ఈ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ స్థాయిలో రిలీజ్ ముంగిట ఈ సినిమాకు హైప్ రాలేదని, అందుక్కారణం చాన్నాళ్ల పాటు సినిమా వార్తల్లో లేకపోవడమే అని, ప్రమోషన్ల పరంగా చిత్ర బృందం బాగా వెనుకబడిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

స్వయంగా మెగా అభిమానులే ఈ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐతే ఇది మూడు రోజుల ముందు వరకు ఉన్న మాట. రిలీజ్ వారంలోకి అడుగుపెట్టాక ‘ఆచార్య’ టీం రూట్ మార్చింది. ప్రమోషన్లతో ఒక్కసారిగా హోరెత్తించేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ప్రింట్ మీడియా ఇంటర్వ్యూలతో హడావుడి మొదలు కాగా.. ఆ తర్వాత ప్రి రిలీజ్ ఈవెంట్‌తో జోష్ మరో స్థాయికి చేరింది.

అది ముగియగానే టీంలో ముఖ్యులు ఒక్కొక్కరుగా మీడియా ఇంటర్వ్యూలతో హోరెత్తించేస్తున్నారు. ఓవైపు కొరటాల టీవీ ఛానెళ్లు, వెబ్ సైట్ల ఇంటర్వ్యూలతో సినిమాపై అంచనాలు పెంచుతున్నాడు. మరోవైపు రామ్ చరణ్ మీడియాను కలిశాడు. తర్వాత హీరోయిన్ పూజా హెగ్డేతో కలిసి టీవీ ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నాడు. ఇంకోవైపేమో చిరుతో స్పెషల్ ఇంటర్వ్యూలు రెడీ అవుతున్నాయి. దర్శకుడు హరీష్ శంకర్ ‘ఆచార్య’ సినిమా మెజారిటీ షూటింగ్ జరిగిన ధర్మస్థలిలోనే చిరు అండ్ కోతో స్పెషల్ ఇంటర్వ్యూ చేశాడు. అలాగే కొందరు టాలీవుడ్ యువ దర్శకులతో చిరు స్పెషల్‌గా మరో ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.

చిరు వీరాభిమానులై ఉండి, ఆయన స్ఫూర్తితోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన యువ దర్శకులంతా ఆయన్ని ఇంటర్వ్యూ చేసే స్పెషల్ ప్రోగ్రాం ఇది. ఇలా మొత్తానికి టీంలోని కీలక సభ్యులంతా ఒకేసారి రంగంలోకి దిగి రిలీజ్ ముంగిట ‘ఆచార్య’కు హైప్ పెంచడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియా ప్రమోషన్ కూడా గట్టిగానే జరుగుతోంది. ఈ నేపథ్యంలో రిలీజ్ టైంకి హైప్ మరో స్థాయికి చేరుతుందని భావిస్తున్నారు.

This post was last modified on April 26, 2022 4:57 pm

Share

Recent Posts

బొత్స వారసురాలి రాజకీయ రంగ ప్రవేశం

మన దేశంలో రాజకీయ వారసత్వం సర్వ సాధారణం. సినిమాల్లో నెపోటిజం మాదిరిగానే పొలిటికల్ నెపోటిజం వల్ల వచ్చిన పొలిటిషియన్లు చాలామంది…

34 minutes ago

నాయకుడు లేకుండా యుద్ధం ఎలా జగన్?

స్థానిక ఎన్నికల్లో గెలుపోటములను ప్రత్యర్థులు ఎలా మేనేజ్‌ చేసినా.. యుద్ధం మాత్రం జరగాలట..! తన పార్టీ కార్యకర్తలకు జగన్‌ ఇస్తున్న…

53 minutes ago

సిద్దార్థ్ సిరీస్ బాగా ట్రెండ్ అవుతోంది

సినిమాల్లో సక్సెస్ కోసం కిందా మీద పడుతున్నాడు కానీ సిద్దార్థ్ కు డిజిటల్ స్పేస్ లో మంచి కంటెంట్ దొరుకుతోంది.…

1 hour ago

టాక్సిక్ కొంచెం జాగ్రత్త పడాల్సిందే

నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించనప్పటికీ టాక్సిక్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ కి టికెట్ రేట్ల పెంపు తీసుకుంటారనే టాక్ బయటికి…

2 hours ago

‘మల్లెపూల పల్లకి’ విమర్శలపై దర్శకుడేమన్నాడంటే?

అయ్యప్ప స్వామి భక్తులు పాడుకునే పాటల్ల ో ‘మల్లెపూల పల్లకి’కి ఉన్న ఆదరణే వేరు. అయ్యప్ప మాల సీజన్ మొదలైందంటే ఈ పాట ఊర్లలో మార్మోగిపోతుంటుంది.…

2 hours ago

పదో తరగతి విద్యార్థులే రూపారెడ్డి హంతకులు

నల్గొండ జిల్లా కొండమల్లెపల్లిలోని నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ కల్లు రూపారెడ్డి హత్య కేసులో చిక్కుముడి వీడింది. ఇద్దరు పదో…

3 hours ago