మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ల క్రేజీ కాంబినేషన్లో.. ఇప్పటిదాకా తీసిన నాలుగు చిత్రాలతోనూ బ్లాక్బస్టర్ అందుకున్న కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఆచార్య’. ఐతే ఈ కాంబినేషన్కు ఉన్న క్రేజ్ స్థాయిలో రిలీజ్ ముంగిట ఈ సినిమాకు హైప్ రాలేదని, అందుక్కారణం చాన్నాళ్ల పాటు సినిమా వార్తల్లో లేకపోవడమే అని, ప్రమోషన్ల పరంగా చిత్ర బృందం బాగా వెనుకబడిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
స్వయంగా మెగా అభిమానులే ఈ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐతే ఇది మూడు రోజుల ముందు వరకు ఉన్న మాట. రిలీజ్ వారంలోకి అడుగుపెట్టాక ‘ఆచార్య’ టీం రూట్ మార్చింది. ప్రమోషన్లతో ఒక్కసారిగా హోరెత్తించేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ప్రింట్ మీడియా ఇంటర్వ్యూలతో హడావుడి మొదలు కాగా.. ఆ తర్వాత ప్రి రిలీజ్ ఈవెంట్తో జోష్ మరో స్థాయికి చేరింది.
అది ముగియగానే టీంలో ముఖ్యులు ఒక్కొక్కరుగా మీడియా ఇంటర్వ్యూలతో హోరెత్తించేస్తున్నారు. ఓవైపు కొరటాల టీవీ ఛానెళ్లు, వెబ్ సైట్ల ఇంటర్వ్యూలతో సినిమాపై అంచనాలు పెంచుతున్నాడు. మరోవైపు రామ్ చరణ్ మీడియాను కలిశాడు. తర్వాత హీరోయిన్ పూజా హెగ్డేతో కలిసి టీవీ ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నాడు. ఇంకోవైపేమో చిరుతో స్పెషల్ ఇంటర్వ్యూలు రెడీ అవుతున్నాయి. దర్శకుడు హరీష్ శంకర్ ‘ఆచార్య’ సినిమా మెజారిటీ షూటింగ్ జరిగిన ధర్మస్థలిలోనే చిరు అండ్ కోతో స్పెషల్ ఇంటర్వ్యూ చేశాడు. అలాగే కొందరు టాలీవుడ్ యువ దర్శకులతో చిరు స్పెషల్గా మరో ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.
చిరు వీరాభిమానులై ఉండి, ఆయన స్ఫూర్తితోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన యువ దర్శకులంతా ఆయన్ని ఇంటర్వ్యూ చేసే స్పెషల్ ప్రోగ్రాం ఇది. ఇలా మొత్తానికి టీంలోని కీలక సభ్యులంతా ఒకేసారి రంగంలోకి దిగి రిలీజ్ ముంగిట ‘ఆచార్య’కు హైప్ పెంచడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియా ప్రమోషన్ కూడా గట్టిగానే జరుగుతోంది. ఈ నేపథ్యంలో రిలీజ్ టైంకి హైప్ మరో స్థాయికి చేరుతుందని భావిస్తున్నారు.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…