ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న ఆచార్యలో అనుష్క ఉందనే వార్త సోషల్ మీడియాతో పాటు ఫిలిం నగర్ సర్కిల్స్ లో గట్టిగానే తిరుగుతోంది. బాహుబలి, భాగమతి తర్వాత బొత్తిగా నల్లపూసైన స్వీటీకి నిశ్శబ్దం ఫలితం గట్టి షాకే ఇచ్చింది. ఆ కారణమో మరొకటో తెలియదు కానీ ఎందరు దర్శకులు కలిసేందుకు ప్రయత్నించినా అంతగా ఆసక్తి చూపించలేదు.
ఫైనల్ గా నవీన్ పోలిశెట్టి ప్రాజెక్టు ఓకే అయ్యింది కానీ దాని తాలూకు అఫీషియల్ డీటెయిల్స్ ఇంకా బయటికి రాలేదు. అదిగో ఇదిగో అంటున్నారు. ఇక అసలు మ్యాటర్ కు వస్తే అనుష్క నిజంగానే ఆచార్యలో ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. సెకండ్ హాఫ్ లో కీలకమైన నక్సలైట్ ఎపిసోడ్ లో రామ్ చరణ్, చిరంజీవిలతో పాటు స్క్రీన్ షేర్ చేసుకుందట.
ఇది నిజమో కాదో సినిమా చూశాకే తెలుస్తుంది కానీ ఇంత పర్టికులర్ గా పేరుతో సహా లీక్ అయ్యిందంటే వాస్తవమయ్యే ఛాన్సే ఎక్కువ. సైరాలో ఇలాగే తళుక్కున మెరిసిన స్వీటీ అందులో కాంబినేషన్ సీన్లు చేయలేదు. కేవలం నరసింహారెడ్డి పాత్రకు ఎలివేషన్ ఇచ్చేందుకు పరిమితమయ్యింది.
అంతకు ముందు చాలా ఏళ్ళ క్రితం స్టాలిన్ లో ఒక ప్రత్యేక గీతంలో మెగాస్టార్ తో ఆడిపాడింది. మళ్ళీ ఇప్పుడు ఇలా మెగా మూవీలో మూడో సారి కనిపించనుంది. పైకి బజ్ ఎక్కువ తక్కువ ఎంత ఉన్నా కొణిదెల మ్యాట్నీ టీమ్స్ మాత్రం రిజల్ట్ పట్ల చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాయి. ష్యుర్ షాట్ బ్లాక్ బస్టర్ ఖాయమనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాయి. కెజిఎఫ్ 2 సందడి తగ్గిపోయింది కాబట్టి ఆచార్యకు రెవిన్యూ పరంగా ఇప్పుడిది మంచి టైం. బాగానే ఉందన్న మాట వచ్చినా చాలు మినిమమ్ వంద కోట్లు ఖాయం
మొన్నటిదాకా తమిళ సినీ పరిశ్రమలోనే కాక దేశంలోని ఇతర భాషాల్లోనూ ఓ స్టార్ హీరోగా ఎదిగిన జోసెఫ్ విజయ్… ఉన్నట్టుండి…
ఏపీలో విగ్రహాల ధ్వంసం వ్యవహారం విపక్ష వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోందని చెప్పాలి. నంద్యాలలో ఆదివారం ఉదయం వైఎస్ విగ్రహం ధ్వంసం ఘటనలో…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు భారీ షాక్ తగిలింది. తెలంగాణలో జనసేన బలోపేతం దిశగా…
తెలుగు మూవీ లవర్స్ చిరకాల వాంఛ ఐమాక్స్ గురించి గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఎడతెగని చర్చ…
దక్షిణాదిన క్యారెక్టర్, విలన్ పాత్రలకు మాంచి డిమాండ్ ఉన్న నటుల్లో విజయ్ సేతుపతి ఒకడు. సుకుమార్ అంతటి పెద్ద దర్శకుడు…
అదేంటి పెద్ది వస్తుంటే ఇంకెవరు పోటీకి దిగుతారనే డౌట్ వస్తోందా. టాలీవుడ్ ప్రొడ్యూసర్లు అంత సాహసం చేయరు కానీ ఇతర…