Movie News

మూడోసారి మెగా మూవీలో అనుష్క

ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న ఆచార్యలో అనుష్క ఉందనే వార్త సోషల్ మీడియాతో పాటు ఫిలిం నగర్ సర్కిల్స్ లో గట్టిగానే తిరుగుతోంది. బాహుబలి, భాగమతి తర్వాత బొత్తిగా నల్లపూసైన స్వీటీకి నిశ్శబ్దం ఫలితం గట్టి షాకే ఇచ్చింది. ఆ కారణమో మరొకటో తెలియదు కానీ ఎందరు దర్శకులు కలిసేందుకు ప్రయత్నించినా అంతగా ఆసక్తి చూపించలేదు.

ఫైనల్ గా నవీన్ పోలిశెట్టి ప్రాజెక్టు ఓకే అయ్యింది కానీ దాని తాలూకు అఫీషియల్ డీటెయిల్స్ ఇంకా బయటికి రాలేదు. అదిగో ఇదిగో అంటున్నారు. ఇక అసలు మ్యాటర్ కు వస్తే అనుష్క నిజంగానే ఆచార్యలో ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. సెకండ్ హాఫ్ లో కీలకమైన నక్సలైట్ ఎపిసోడ్ లో రామ్ చరణ్, చిరంజీవిలతో పాటు స్క్రీన్ షేర్ చేసుకుందట.

ఇది నిజమో కాదో సినిమా చూశాకే తెలుస్తుంది కానీ ఇంత పర్టికులర్ గా పేరుతో సహా లీక్ అయ్యిందంటే వాస్తవమయ్యే ఛాన్సే ఎక్కువ. సైరాలో ఇలాగే తళుక్కున మెరిసిన స్వీటీ అందులో కాంబినేషన్ సీన్లు చేయలేదు. కేవలం నరసింహారెడ్డి పాత్రకు ఎలివేషన్ ఇచ్చేందుకు పరిమితమయ్యింది.

అంతకు ముందు చాలా ఏళ్ళ క్రితం స్టాలిన్ లో ఒక ప్రత్యేక గీతంలో మెగాస్టార్ తో ఆడిపాడింది. మళ్ళీ ఇప్పుడు ఇలా మెగా మూవీలో మూడో సారి కనిపించనుంది. పైకి బజ్ ఎక్కువ తక్కువ ఎంత ఉన్నా కొణిదెల మ్యాట్నీ టీమ్స్ మాత్రం రిజల్ట్ పట్ల చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాయి. ష్యుర్ షాట్ బ్లాక్ బస్టర్ ఖాయమనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాయి. కెజిఎఫ్ 2 సందడి తగ్గిపోయింది కాబట్టి ఆచార్యకు రెవిన్యూ పరంగా ఇప్పుడిది మంచి టైం. బాగానే ఉందన్న మాట వచ్చినా చాలు మినిమమ్ వంద కోట్లు ఖాయం

Satya

Recent Posts

అంచనాల ఒత్తిడిని ‘రామాయణ’ తట్టుకుంటుందా

ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…

2 hours ago

లవ్ స్టోరీ భయపడాల్సిన పని లేదు

ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…

3 hours ago

అయ్యగారి జోరు అదిరింది

పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…

4 hours ago

మ్యూజిక్ చిచ్చు పెట్టిన ‘గాడ్ ఆఫ్ వార్’

తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…

5 hours ago

ఎట్టకేలకు బూత్ స్థాయిపై జనసేన కన్ను

బూత్ స్థాయిలో బ‌లోపేతం అయ్యే దిశ‌గా జ‌న‌సేన క‌స‌ర‌త్తు షురూ చేసింది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

6 hours ago

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

7 hours ago