ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న ఆచార్యలో అనుష్క ఉందనే వార్త సోషల్ మీడియాతో పాటు ఫిలిం నగర్ సర్కిల్స్ లో గట్టిగానే తిరుగుతోంది. బాహుబలి, భాగమతి తర్వాత బొత్తిగా నల్లపూసైన స్వీటీకి నిశ్శబ్దం ఫలితం గట్టి షాకే ఇచ్చింది. ఆ కారణమో మరొకటో తెలియదు కానీ ఎందరు దర్శకులు కలిసేందుకు ప్రయత్నించినా అంతగా ఆసక్తి చూపించలేదు.
ఫైనల్ గా నవీన్ పోలిశెట్టి ప్రాజెక్టు ఓకే అయ్యింది కానీ దాని తాలూకు అఫీషియల్ డీటెయిల్స్ ఇంకా బయటికి రాలేదు. అదిగో ఇదిగో అంటున్నారు. ఇక అసలు మ్యాటర్ కు వస్తే అనుష్క నిజంగానే ఆచార్యలో ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. సెకండ్ హాఫ్ లో కీలకమైన నక్సలైట్ ఎపిసోడ్ లో రామ్ చరణ్, చిరంజీవిలతో పాటు స్క్రీన్ షేర్ చేసుకుందట.
ఇది నిజమో కాదో సినిమా చూశాకే తెలుస్తుంది కానీ ఇంత పర్టికులర్ గా పేరుతో సహా లీక్ అయ్యిందంటే వాస్తవమయ్యే ఛాన్సే ఎక్కువ. సైరాలో ఇలాగే తళుక్కున మెరిసిన స్వీటీ అందులో కాంబినేషన్ సీన్లు చేయలేదు. కేవలం నరసింహారెడ్డి పాత్రకు ఎలివేషన్ ఇచ్చేందుకు పరిమితమయ్యింది.
అంతకు ముందు చాలా ఏళ్ళ క్రితం స్టాలిన్ లో ఒక ప్రత్యేక గీతంలో మెగాస్టార్ తో ఆడిపాడింది. మళ్ళీ ఇప్పుడు ఇలా మెగా మూవీలో మూడో సారి కనిపించనుంది. పైకి బజ్ ఎక్కువ తక్కువ ఎంత ఉన్నా కొణిదెల మ్యాట్నీ టీమ్స్ మాత్రం రిజల్ట్ పట్ల చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాయి. ష్యుర్ షాట్ బ్లాక్ బస్టర్ ఖాయమనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాయి. కెజిఎఫ్ 2 సందడి తగ్గిపోయింది కాబట్టి ఆచార్యకు రెవిన్యూ పరంగా ఇప్పుడిది మంచి టైం. బాగానే ఉందన్న మాట వచ్చినా చాలు మినిమమ్ వంద కోట్లు ఖాయం
This post was last modified on April 26, 2022 12:34 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…