మిర్చితో టాలీవుడ్లోకి దర్శకుడిగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు కొరటాల శివ. తొలి చిత్రంతోనే బ్లాక్బస్టర్ డెలివర్ చేయడంతో అతను మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడైపోయాడు. ఆ క్రమంలోనే రామ్ చరణ్ లాంటి పెద్ద స్టార్తో సినిమా చేసే అవకాశం వచ్చింది. వీరి కలయికలో బండ్ల గణేష్ నిర్మాతగా ఓ సినిమాకు హడావుడిగా ప్రారంభోత్సవం జరపడం గుర్తుండే ఉంటుంది.
కానీ ఏం జరిగిందో ఏమో.. ఈ సినిమా పట్టాలెక్కలేదు. తర్వాత కొరటాల.. మహేష్ బాబుతో శ్రీమంతుడు చేశాడు. అది తొలి సినిమాను మంచి ఇంకా పెద్ద బ్లాక్బస్టర్ అయింది. ఆపై జనతా గ్యారేజ్, భరత్ అనే నేను కూడా మంచి విజయం సాధించాయి. అయితే రెండో సినిమాకు మిస్ అయిన హీరోతో చిరంజీవి సినిమా ఆచార్యలో ఒక ప్రత్యేక పాత్ర చేయించి.. చరణ్తో సినిమా చేయించడంతో వీరి కాంబినేషన్ కార్యరూపం దాల్చింది.
ఐతే ఇక్కడ ట్విస్టు ఏంటంటే.. కొరటాల చిరుతో సినిమా చేయడానికి రెడీ అయితే అందులోకి అనుకోకుండా చరణ్ రావడం కాదు.. చరణ్తో సినిమా చేయడానికి సిద్ధమైతే ఊహించని విధంగా చిరు ఎంట్రీ ఇచ్చాడు. ఆచార్య ప్రి రిలీజ్ ఈవెంట్లో ఈ ట్విస్టును స్వయంగా చిరునే రివీల్ చేశాడు. కొరటాల.. చరణ్తో సినిమా చేయాలని ఓ కథ సిద్ధం చేసుకుని తన దగ్గరికి వచ్చాడని, కానీ చరణ్ ఆర్ఆర్ఆర్కు కమిటై ఉండడంతో తనతో సినిమా చేయొచ్చు కదా అని అన్నానని చెప్పాడు.
అంతకంటే భాగ్యమా అని వెళ్లి మళ్లీ ఒక కథ సిద్ధం చేసుకుని తనను కలిశాడని.. అదే ఆచార్య అని, ఆ తర్వాత ఇందులో ఓ కీలక పాత్రకు చరణ్ను ఎంచుకున్నామని చిరు వెల్లడించాడు. మరి ఇదే నిజమైతే చరణ్ కోసం కొరటాల రెడీ చేసి ఇంకో కథ ఇప్పుడు హోల్డ్లో ఉందన్నమాట. మళ్లీ ఇద్దరికీ కుదిరినపుడు ఆ కథతో సినిమా చేసే అవకాశాలు లేకపోలేదని భావించాలి.
This post was last modified on April 25, 2022 9:03 am
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…