మిర్చితో టాలీవుడ్లోకి దర్శకుడిగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు కొరటాల శివ. తొలి చిత్రంతోనే బ్లాక్బస్టర్ డెలివర్ చేయడంతో అతను మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడైపోయాడు. ఆ క్రమంలోనే రామ్ చరణ్ లాంటి పెద్ద స్టార్తో సినిమా చేసే అవకాశం వచ్చింది. వీరి కలయికలో బండ్ల గణేష్ నిర్మాతగా ఓ సినిమాకు హడావుడిగా ప్రారంభోత్సవం జరపడం గుర్తుండే ఉంటుంది.
కానీ ఏం జరిగిందో ఏమో.. ఈ సినిమా పట్టాలెక్కలేదు. తర్వాత కొరటాల.. మహేష్ బాబుతో శ్రీమంతుడు చేశాడు. అది తొలి సినిమాను మంచి ఇంకా పెద్ద బ్లాక్బస్టర్ అయింది. ఆపై జనతా గ్యారేజ్, భరత్ అనే నేను కూడా మంచి విజయం సాధించాయి. అయితే రెండో సినిమాకు మిస్ అయిన హీరోతో చిరంజీవి సినిమా ఆచార్యలో ఒక ప్రత్యేక పాత్ర చేయించి.. చరణ్తో సినిమా చేయించడంతో వీరి కాంబినేషన్ కార్యరూపం దాల్చింది.
ఐతే ఇక్కడ ట్విస్టు ఏంటంటే.. కొరటాల చిరుతో సినిమా చేయడానికి రెడీ అయితే అందులోకి అనుకోకుండా చరణ్ రావడం కాదు.. చరణ్తో సినిమా చేయడానికి సిద్ధమైతే ఊహించని విధంగా చిరు ఎంట్రీ ఇచ్చాడు. ఆచార్య ప్రి రిలీజ్ ఈవెంట్లో ఈ ట్విస్టును స్వయంగా చిరునే రివీల్ చేశాడు. కొరటాల.. చరణ్తో సినిమా చేయాలని ఓ కథ సిద్ధం చేసుకుని తన దగ్గరికి వచ్చాడని, కానీ చరణ్ ఆర్ఆర్ఆర్కు కమిటై ఉండడంతో తనతో సినిమా చేయొచ్చు కదా అని అన్నానని చెప్పాడు.
అంతకంటే భాగ్యమా అని వెళ్లి మళ్లీ ఒక కథ సిద్ధం చేసుకుని తనను కలిశాడని.. అదే ఆచార్య అని, ఆ తర్వాత ఇందులో ఓ కీలక పాత్రకు చరణ్ను ఎంచుకున్నామని చిరు వెల్లడించాడు. మరి ఇదే నిజమైతే చరణ్ కోసం కొరటాల రెడీ చేసి ఇంకో కథ ఇప్పుడు హోల్డ్లో ఉందన్నమాట. మళ్లీ ఇద్దరికీ కుదిరినపుడు ఆ కథతో సినిమా చేసే అవకాశాలు లేకపోలేదని భావించాలి.
This post was last modified on April 25, 2022 9:03 am
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…