అమెరికాలో మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించడం కాస్త పెద్ద స్థాయి సినిమాలకు ఒకప్పుడు కేక్ వాక్ అన్నట్లే ఉండేది కానీ.. కరోనా తర్వాత పరిస్థితులు మారాయి. అక్కడ మార్కెట్ పుంజుకోవడానికి టైం పట్టింది. ఇప్పుడు మళ్లీ అక్కడ మంచి వసూళ్లే వస్తున్నాయి. అలా అని ప్రతి సినిమాకూ వసూళ్ల వర్షం కురియట్లేదు. రాధేశ్యామ్ లాంటి భారీ చిత్రం అక్కడ 2 మిలియన్ డాలర్లు కూడా రాబట్టలేకపోయింది.
అలాంటిది కేజీఎఫ్-2 అనే కన్నడ సినిమా తెలుగు వెర్షన్ యుఎస్లో 2 మిలియన్ డాలర్ల మైలురాయిని అందుకుని ట్రేడ్ పండితుల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. తెలుగులో ఇప్పటికే చాలా సినిమాలు యుఎస్లో 2 మిలియన్ మార్కును దాటాయి కానీ.. ఓ అనువాద చిత్రం కేవలం తెలుగు వరకు 2 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టడం తొలిసారి. ఇప్పటిదాకా తెలుగులోకి అనువాదమైన పరభాషా చిత్రాల్లో ఒక్క రజినీకాంత్ సినిమా 2.0 మాత్రమే యుఎస్లో మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టింది.
ఇంకే చిత్రం కూడా 2 మిలియన్ మార్కుకు చేరువగా కూడా వెళ్లలేదు. కేజీఎఫ్-2 తెలుగు వెర్షన్కు యుఎస్లో మంచి వసూళ్లే వస్తాయని అంచనా వేశారు కానీ.. మరీ 2 మిలియన్ మార్క్ దాటేయడం అసాధారణమే. కేజీఎఫ్-2 కన్నడ వెర్షన్కు కూడా అక్కడ ఈ స్థాయిలో కలెక్షన్లు రాలేదు. ఇక కేజీఎఫ్-2 ఓవరాల్ వసూళ్లు రూ.1000 కోట్ల గ్రాస్ మార్కుకు చేరువగా ఉండడం విశేషం.
ఒక్క హిందీ వెర్షన్ మాత్రమే ఇండియాలో రూ.300 కోట్ల వసూళ్లు సాధించి ఔరా అనిపించింది. ఇప్పటిదాకా ఇండియాలో హిందీ వరకు ఈ మైలురాయిని అందుకుంది బాహుబలి-2, దంగల్ చిత్రాలు మాత్రమే. ఆ సినిమా జోరు చూస్తుంటే హిందీ వరకే రూ.400 కోట్ల మేర వసూళ్లు రాబట్టేలా కనిపిస్తోంది. దాదాపుగా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయిపోయిన ఈ చిత్రం.. ఫుల్ రన్లో బయ్యర్లకు అన్ని భాషల్లో మంచి లాభాలు అందించడం ఖాయంగా కనిపిస్తోంది.
This post was last modified on April 24, 2022 7:27 pm
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…