Movie News

చిరుయే సాక్షి.. నాడు అవమానం, నేడు గర్వం

ఇప్పుడు దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఉత్తరాదిన సౌత్ సినిమాలు సాగిస్తున్న వసూళ్ల ప్రభంజనం చూసి బాలీవుడ్ వాళ్లు లోలోన కుళ్లి కుళ్లి ఏడుస్తుంటే ఆశ్చర్యమేమీ లేదు. ఒకప్పుడు సౌత్ సినిమాలను వాళ్లెంత తక్కువగా చూసే వారో అందరికీ తెలిసిందే. ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్డే అన్నట్లు వాళ్ల బిల్డప్ ఉండేది. బయటి ప్రపంచం కూడా అలాగే చూసేది. ఇండియన్ సినిమాలో ఓవరాల్ రికార్డులేవైనా హిందీ చిత్రాల పేరిటే ఉండేవి.

దీనికి తోడు అవార్డుల్లోనూ వారిదే ఆధిపత్యం. అక్కడ తెరకెక్కే మామూలు సినిమాలకు కూడా అవార్డులు వెల్లువెత్తేవి. సౌత్‌లో ఎంత గొప్ప సినిమాలు తీసినా అంతగా గుర్తింపు ఉండేది కాదు. ఇదంతా బాక్సాఫీస్ డైనమిక్స్‌ను బట్టే ఉండేదన్నది స్పష్టం. కానీ గత కొన్నేళ్లలో కథ మారిపోయింది. బాలీవుడ్ సినిమాల హవాకు తెరపడింది. ‘బాహుబలి’ దగ్గర్నుంచి దక్షిణాది చిత్రాల ఆధిపత్యం మొదలైంది. పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2.. ఇలా గత కొన్ని నెలల్లో నార్త్ బాక్సాఫీస్‌ను సౌత్ సినిమాలు దున్నేశాయి.

వీటి దెబ్బకు హిందీ చిత్రాలు కుదేలయ్యాయి. ఇప్పుడు మన సినిమాలను చూసి బాలీవుడ్ వాళ్లు భయపడే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ‘ఆచార్య’ ప్రి రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి చేసిన ప్రసంగం చర్చనీయాంశంగా మారింది. 80 దశకం చివర్లో తాను ‘రుద్రవీణ’ సినిమాకు నర్గీస్ దత్ అవార్డు తీసుకోవడానికి ఢిల్లీకి వెళ్లినపుడు అక్కడ ఆడిటోరియంలో మొత్తం బాలీవుడ్ సినిమాలకే పెద్ద పీట వేసి.. సౌత్ సినిమాలకు అసలు ప్రయారిటీనే ఇవ్వకపోవడం, తెలుగు సినిమాలకు అసలే గుర్తింపూ లేకపోవడం చూసి అవమానంగా భావించానని.. ఇదే విషయాన్ని చెన్నైకి వచ్చాక మీడియా ముందు కూడా చెప్పానని.. హిందూ పత్రిక ఆ విషయానికి మంచి ప్రయారిటీ ఇచ్చినా సరే.. దీనికి ప్రభుత్వం నుంచి సమాధానం లేదని చిరు వెల్లడించాడు.

ఐతే ఇప్పుడు బాహుబలితో రాజమౌళి మొత్తం కథ మార్చేశాడని.. ఇప్పుడు పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 లాంటి చిత్రాల జోరుతో ప్రాంతీయ సినిమాపై వివక్ష తొలగిపోయిందని.. మన సినిమాలను ఇండియన్ సినిమాలుగా అందరూ గుర్తిస్తున్నారని.. నాడు సౌత్ సినిమాను తక్కువగా చూశారని అవమానంగా భావించిన తనే.. ఇప్పుడు మన సినిమాలను చూసి గర్వంతో రొమ్ము విరుచుకుంటున్నానని చిరు చాలా ఉద్వేగంగా అన్నారు. ఇటు సౌత్ సినీ జనాలు, అటు ప్రేక్షకులు అందరి మనోభావాలను ప్రతిబింబించేలా చిరు చేసిన స్పీచ్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Satya

Recent Posts

శ్రీలీలని టార్గెట్ చేయడం సబబేనా

లెనిన్ విడుదలై మంచి స్పందన దక్కించుకున్నాక సోషల్ మీడియాలో శ్రీలీల డిస్కషన్ జరుగుతోంది. ఎందుకంటే లెనిన్ షూటింగ్ మొదలుపెట్టినప్పుడు హీరోయిన్…

1 hour ago

కొత్త ‘ఈవిల్ డెడ్’ అంత భయపెట్టిందా

హాలీవుడ్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా హారర్ జానర్ పరిచయం చేసిన కల్ట్ సిరీస్ గా 'ఈవిల్ డెడ్' సినిమాకున్న ఆదరణ…

2 hours ago

తండ్రి కొడుకులకు కలిసొచ్చిన పల్లెటూరు

కొన్ని కాకతాళీయంగా జరిగినట్టు అనిపించినా దాని వెనుక తెలుసుకోవాల్సిన బాక్సాఫీస్ సత్యాలు చాలా ఉంటాయి. అలాంటిదే ఇది. ఇండస్ట్రీకి వచ్చి…

3 hours ago

ఎన్టీఆర్ అభిమానులకు ఆందోళన అక్కర్లేదు

నిన్న ధనుష్ తమిళ్ మురుగన్ టీజర్ వచ్చాక మొదట ఆందోళన చెందింది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. ఎందుకంటే త్రివిక్రమ్ సినిమాలోనూ…

3 hours ago

పల్లి పల్లి మంత్రి లోకేష్

పల్లి పల్లి లోకేశ్... ఇదేం పేరండి బాబూ అని జుట్టు పీక్కుంటున్నారా? అంత అవసరం ఏమీ లేదు. ఇదేమీ రాజకీయ ప్రత్యర్థులో,…

3 hours ago

ఫోక్సో కేసు పెట్టారని ఆరుగురిని చంపి.. ఆపై ఏం చేశాడంటే..

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో ఆదివారం తెల్లవారుజామున దారుణ ఘటన చోటుచేసుకుంది. తనపై నమోదైన పోక్సో కేసుకు ప్రతీకారంగా…

4 hours ago