మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మామూలుగా స్టేజ్ మీద మాట్లాడేటపుడు తడబడుతుంటాడు. స్వేచ్ఛగా మాట్లాడలేకపోతుంటాడు. మొక్కుబడిగా, షార్ట్గా స్పీచ్లు లాగించేస్తుంటాడు. ‘ఆర్ఆర్ఆర్’ సహా చాలా సినిమాల ఈవెంట్లలో చరణ్ ప్రసంగాలు అభిమానులను నిరాశకు గురి చేశాయి. కానీ ‘ఆచార్య’ ప్రి రిలీజ్ ఈవెంట్లో మాత్రం అతను పది నిమిషాలకు పైగా సుదీర్ఘ ప్రసంగం చేశాడు.
స్పీచ్ చాలా ఆసక్తికరంగా సాగింది కూడా. చరణ్ ఇంత బాగా మాట్లాడగలడా.. అతడిలో ఇంత ఫ్లో ఉందా అనిపించేలా ప్రసంగం సాగడం విశేషం. తన తండ్రి చిరంజీవి గురించి మాట్లాడుతూ ఎన్నడూ లేని స్థాయిలో ఎమోషనల్ అవడం ఈ స్పీచ్లో ఒక హైలైట్ కాగా.. మధ్యలో వేదిక మీదికి దూసుకొచ్చిన అభిమానితో చరణ్ వ్యవహరించిన తీరు మరో హైలైట్.
కొన్నేళ్ల నుంచి తెలుగు సినిమాల ప్రి రిలీజ్ ఈవెంట్లు గమనిస్తే.. ఉన్నట్లుండి అభిమానులు వేదికల మీదికి దూసుకొచ్చేయడం.. హీరోలకు పాదాభివందనాలు చేసేయడం.. సెక్యూరిటీ సిబ్బంది వచ్చి వారిని లాక్కెళ్లడం.. హీరో వారించడం.. ఇలాంటి దృశ్యాలు సర్వ సాధారణం అయిపోయాయి. మొదట్లో ఇలాంటి దృశ్యాలు ఆశ్చర్యపరిచేవి కానీ.. తర్వాత అదో ప్రహసనంలా తయారైంది. పీఆర్ టీం కావాలనే కొందరు కుర్రాళ్లను ఇలా సెట్ చేస్తుంటారని, హీరో క్రేజ్ గురించి అందరూ మాట్లాడుకోవడానికి ఇలాంటివి ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం కూడా మొదలైంది.
ఈ నేపథ్యంలో ‘ఆచార్య’ ఈవెంట్లో తాను మాట్లాడుతుండగా.. వేదిక పైకి వచ్చి పాదాభివందనం చేయబోయిన అభిమానితో చరణ్ అన్న మాటలు ఆసక్తి రేకెత్తించారు. ఇదంతా ఎవరు డిజైన్ చేశారు, ప్లాన్ చేశారు అని చరణ్ పంచ్ విసరడం విశేషం. సెక్యూరిటీ సిబ్బంది ఆ కుర్రాడిని లాగేయబోతుంటే.. వాళ్లను ఆపి సెల్ఫీ తీసుకున్నాడు చరణ్. తర్వాత యధావిధిగా ప్రసంగం కొనసాగింది. ఐతే ఇలా సెట్ చేసి క్రేజ్ చూపించుకునే హీరోలకు చరణ్ పంచ్ ఇచ్చినట్లు.. అలాగే తన కోసం ఇలా ప్లాన్ చేసి ఉన్నా కూడా ఈ అతి అవసరం లేదని చెప్పకనే చెప్పినట్లు అనిపించింది తన వాలకం చూస్తే.
తమిళ సినిమాలో దశాబ్దాల పాటు ఆధిపత్యం చలాయించిన సూపర్ స్టార్లు రజినీకాంత్. కమల్ హాసన్ వ్యక్తిగతంగా మంచి మిత్రులన్న సంగతి…
ఏపీలో ఇప్పుడు కాపు సామాజిక వర్గం కేంద్రంగా రసవత్తర రాజకీయం నడుస్తోంది. నిన్నటికి నిన్న వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు…
మా ఇంటి బంగారం కథ ముందుగా సాయిపల్లవి దగ్గరికి వెళ్లిన సంగతి సమంత స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పాక బయటికి వచ్చింది.…
స్టార్ అన్న గుర్తింపు తెచ్చుకోలేకపోయి ఉండొచ్చు కానీ.. తమిళ, తెలుగు భాషల్లో సీనియర్ నటుడు ఆనంద్కు మంచి గుర్తింపే ఉంది.…
ముంబైలో ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ యోగా డే వేడుకల్లో హీరోయిన్ శ్రీలీలకు అవమానం జరిగిందని సోషల్ మీడియాలో ఒక వీడియో…
తప్పు చేసింది కేంద్ర ప్రభుత్వం. తన తప్పును ఏమాత్రం పట్టించుకోని కేంద్రం… విద్యార్థులు చేసిన చిన్నపాటి తప్పులకూ పెద్ద శిక్షలేసింది.…