నాని ప్రధాన పాత్రలో యువ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి రూపొందించిన జెర్సీ మూవీని తెలుగులో వచ్చిన బెస్ట్ స్పోర్ట్స్ డ్రామాగా చెప్పొచ్చు. కథాకథనాల పరంగా చూసినా.. ఆర్టిస్టుల పెర్ఫామెన్స్ పరంగా చూసినా ఇదొక క్లాసిక్ అనడంలో సందేహం లేదు. ఏ భాషకు చెందిన ప్రేక్షకులనైనా ఆకట్టుకునే సార్వజనీనమైన కథతో తెరకెక్కిన సినిమా ఇది. ఈ చిత్రం చూసి తెగ నచ్చేసి బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ రీమేక్కు రెడీ అయ్యాడు.
తెలుగు వెర్షన్ దర్శకుడు గౌతమ్నే రీమేక్కూ ఎంచుకున్నాడు. ఒరిజినల్ ప్రొడ్యూసర్ నాగవంశీతో కలిసి దిల్ రాజు, బాలీవుడ్ ప్రొడ్యూసర్ అమన్ గిల్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు హిందీలో ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వస్తోంది. సాధారణ ప్రేక్షకులు గొప్పగా చెబుతున్నారీ సినిమా గురించి. కానీ కేజీఎఫ్-2 జోరు వల్ల దీని వసూళ్లపై ప్రభావం కనిపిస్తోంది.
సమీక్షకుల్లో కూడా జెన్యూన్ రివ్యూలు ఇచ్చిన వాళ్లు సినిమా గురించి పాజిటివ్గానే మాట్లాడారు. మంచి రేటింగ్స్ ఇచ్చారు.
కానీ తరణ్ ఆదర్శ్ సహా కొందరు పేరున్న క్రిటిక్స్ ఉద్దేశపూర్వకంగా ఈ చిత్రాన్ని డీగ్రేడ్ చేస్తున్నట్లుగా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తరణ్కు పెయిడ్ క్రిటిక్ అనే ముద్ర ఉంది. ఆయన కొన్ని సినిమాలకు ఊహించని రేటింగ్స్ ఇస్తుంటారు. ఉదాహరణకు జాన్ అబ్రహాం సినిమా సత్యమేవ జయతే-2కు ఆయన 3.5 రేటింగ్ ఇచ్చి సినిమా సూపర్ అన్నారు. అదొక పెద్ద డిజాస్టర్ అయింది. సినిమా చూసిన సామాన్య ప్రేక్షకులు తిట్టిపోశారు.
అలాంటి సినిమాను మోసిన తరణ్.. జెర్సీ లాంటి మంచి చిత్రాన్ని డల్గా ఉందని, సెకండాఫ్లో క్రికెట్ ఎక్కువైందని కామెంట్లు చేయడం విడ్డూరం. దీనిపై ఆయనకు హిందీ ప్రేక్షకుల నుంచే కౌంటర్లు తప్పట్లేదు. క్రెడిబిలిటీ లేని రివ్యూయర్ అంటూ ఆయన్ని తిట్టిపోస్తున్నారు. నార్త్ మార్కెట్లో తెలుగు కథలు, తెలుగు హీరోలు, తెలుగు దర్శకుల డామినేషన్ చూసి ఓర్వలేకే ఉద్దేశపూర్వకంగా తరణ్ లాంటి క్రిటిక్స్ జెర్సీని డీగ్రేడ్ చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on April 23, 2022 6:37 pm
ఏపీలో ఎన్నికల పోలింగ్ అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలను నిలువరించలేక పోయిన.. ఉన్నతాధికారులపై(ఒక జిల్లా కలెక్టరు, ముగ్గురు ఎస్పీలు) వేటు…
ఇంకా షూటింగ్ కాదు కదా కనీసం పూజా కార్యక్రమాలు కూడా జరగని మహేష్ బాబు - రాజమౌళి సినిమా తాలూకు…
ఏపీ సీఎం జగన్ కుటుంబ సమేతంగా విహార యాత్రకు వెళ్లిన విషయం తెలిసిందే. సతీమణి వైఎస్ భారతి, కుమార్తెలు హర్ష,…
మన కల్కి 2898 ఏడిలాగే తమిళంలోనూ విపరీతమైన జాప్యానికి గురవుతున్న ప్యాన్ ఇండియా మూవీ కంగువ. సిరుతై శివ దర్శకత్వంలో…
నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…
గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…