ఓ భారీ చిత్రం బరిలో ఉండగా.. అదే వీకెండ్లో ఓ చిన్న సినిమాను రిలీజ్ చేయడం అంటే సాహసమే. అందులోనూ కరోనా తర్వాత చిన్న సినిమాలకు థియేటర్లలో గడ్డు పరిస్థితులు ఎదురవుతున్న నేపథ్యంలో ఇలా చేయడం మరీ రిస్క్ అవుతుంది. అయినా సరే.. ధైర్యంగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే అనుమానించాల్సిందే. ఈ నెలాఖర్లో ‘ఆచార్య’ రిలీజవుతుండగా.. దాని పోటీగా ముందు విశ్వక్సేన్ సినిమా ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ను దించాలని చూశారు. ఆచార్య డేట్ 29 కాగా.. తర్వాతి రోజు ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
కానీ కొన్ని రోజులు హడావుడి చేశాక డేట్ మార్చేశారు. వారం ఆలస్యంగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించారు. దీంతో ముందు ఇచ్చిన డేట్ పబ్లిసిటీ కోసమేనా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. ‘ఆచార్య’ లాంటి భారీ చిత్రానికి పోటీగా చిన్న సినిమా అంటే సోషల్ మీడియాలో పబ్లిసిటీ వస్తుంది కదా. అందుకే ఇలా చేశారేమో అన్న డౌట్లు కొట్టాయి. విశ్వక్సేన్ సినిమా వ్యవహారం ముగిశాక ఇప్పుడు ఇంకో చిన్న సినిమా విషయంలో ఇదే జరిగింది.
మరో యువ కథానాయకుడు శ్రీ విష్ణు కొత్త చిత్రం ‘భళా తందనాన’ను ఈ నెల 30న రిలీజ్ చేయబోతున్నట్లు నిన్ననే ప్రకటించడం తెలిసిందే. అంత భారీ చిత్రం రేసులో ఉండగా.. ఈ చిన్న సినిమా రిలీజ్ ఏంటి అని అంతా ఆశ్చర్యపోయారు. అందులో శ్రీ విష్ణు, దర్శకుడు చైతన్య దంతులూరిల కెరీర్లకు ఈ సినిమా చాలా కీలకం కావడంతో ఇంత రిస్క్ చేస్తున్నారేంటి అన్న సందేహాలు కలిగాయి.
కానీ ఈ హడావుడి అంతా ఒక్క రోజుకే పరిమితం అయింది. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మరుసటి రోజే టీం యు టర్న్ తీసుకుంది. దర్శకుడు చైతన్య దంతులూరి తన ట్విట్టర్లో అకౌంట్లో… తమ చిత్రం 30న రావట్లేదని ప్రకటించారు. మరి అతడికి తెలియకుండానే నిర్మాతలు డేట్ ప్రకటించారా.. లేక పబ్లిసిటీ కోసమే ఇలా డేట్ ఇచ్చి ఇప్పుడు యుటర్న్ తీసుకున్నారా అన్నది తెలియడం లేదు. త్వరలోనే కొత్త డేట్ ప్రకటించబోతోందట ‘భళా తందనాన’ టీం.
This post was last modified on April 23, 2022 6:07 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…