రామ్ గోపాల్ వర్మ సినిమాలు మరీ నాసిరకంగా తయారయ్యాయని.. ఆయన సినిమాలను ఎవరూ పట్టించుకోవడం లేదని అందరికీ తెలుసు. ఇదే మాట వర్మ దగ్గర అంటే.. తాను తీసే ప్రతి సినిమా తనకు డబ్బులు తెచ్చి పెడుతోందని, వాటి విషయంలో తాను చాలా హ్యాపీ అని ఇటీవల స్టేట్మెంట్లు ఇచ్చాడు. కానీ వర్మ సినిమాలను ప్రదర్శిస్తే థియేటర్ల మెయింటైనెన్స్ కూడా కష్టమయ్యే పరిస్థితుల్లో ఆయన చిత్రాలకు స్క్రీన్లే ఇవ్వట్లేదు ఎగ్జిబిటర్లు.
వర్మ కొత్త చిత్రం ‘మా ఇష్టం’ పరిస్థితి ఇదే. ఈ చిత్రాన్ని ఈ నెల 8నే రిలీజ్ చేయాలని చూశాడు వర్మ. కానీ థియేటర్లు దొరక్క వెనక్కి తగ్గాడు. ఇది లెస్బియన్ మూవీ కావడం వల్ల మల్టీప్లెక్సులు స్క్రీన్లు ఇవ్వలేదని, అందుకే వాయిదా అని చెప్పుకున్నాడు వర్మ. కానీ వాస్తవం ఏంటంటే.. వర్మ సినిమాలకు డిమాండ్ లేకపోవడం వల్లే థియేటర్లు దొరకట్లేదు.
దీన్ని వర్మ మరో రకంగా కవర్ చేయాలని చూస్తున్నాడు.ఆ సంగతలా వదిలేస్తే ‘మా ఇష్టం’ చిత్రానికి కొత్త రిలీజ్ డేట్ ఇచ్చాడు వర్మ. మే 6న ఈ సినిమాను వివిధ భాషల్లో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించాడు. మళ్లీ ప్రమోషన్లతో హడావుడి చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ‘ఆచార్య’ థియేటర్లలో ఉండగా.. ‘సర్కారు వారి పాట’ రాబోతుండగా.. మే 6న అర్జున కళ్యాణం, జయమ్మ పంచాయితీ లాంటి ఆసక్తికర చిత్రాలు రాబోతుండగా.. అసలేమాత్రం బజ్ లేని వర్మ సినిమాకు థియేటర్లు దొరుకుతాయా అన్నది సందేహమే.
ఈ చిత్రంలో హీరోయిన్లతో వీర లెవెల్లో ఎక్స్పోజింగ్ చేయించి, ఇద్దరి మధ్య ఇంటిమేట్ సీన్లు పెట్టినా కూడా ప్రేక్షకులకు కనీస ఆసక్తి పుట్టట్లేదంటే వర్మ సినిమాలంటే ఎలాంటి వ్యతిరేక భావంతో ఉన్నారో అర్థమైపోతుంది. మరి ఈ సారి కూడా థియేటర్లు దొరకని పరిస్థితి ఉంటే.. ఓటీటీలో రిలీజ్ చేసుకోవడం తప్ప వర్మకు ఇంకో ఆప్షన్ లేదు.
This post was last modified on April 21, 2022 4:24 pm
ఫ్లాపుల పరంపరకు తెరదించుతూ.. ఈ ఏడాది కపుల్ ఫ్రెండ్లీ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు యువ కథానాయకుడు సంతోష్ శోభన్.…
ఒకప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండి, ఆ పార్టీ తరఫున ఎంపీగా కూడా గెలిచిన రఘురామ కృష్ణం రాజు తర్వాత…
వైసీపీ అధినేత జగన్.. రాష్ట్రంలోని ఓ వర్గం మీడియాపై తరచుగా విమర్శలు చేయడంతోపాటు.. వాటిని గేలి కూడా చేస్తుంటారు. ఆయన…
ఒకప్పుడు మంచి స్నేహితులుగా ఉన్న తమిళ స్టార్ హీరో ధనుష్, అగ్ర కథానాయిక నయనతార.. కొన్ని కారణాల వల్ల శత్రువులుగా…
ఎప్పుడు ఎవరి కెరీర్ ఎలా మలుపు తిరుగుతుందో చెప్పలేం. తమిళ కుర్రాడు ప్రదీప్ రంగనాథన్కు... నాలుగేళ్ల ముందు వరకు తమిళనాడులోనే…
బీఆర్ ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ సీఎం కేసీఆర్ తనయ, మాజీ ఎంపీ కవిత ఈ నెలలో…