మూడేళ్ళ క్రితం కేవలం కన్నడ సీమకే పరిమితమైన నిర్మాణ సంస్థ హోంబాలే ఫిలిమ్స్ ఇప్పుడు ప్యాన్ ఇండియా బ్యానర్ గా మారిపోయింది. కెజిఎఫ్ రెండు భాగాలూ బ్లాక్ బస్టర్ సక్సెస్ కావడంతో వీళ్ళ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది.
శాండల్ వుడ్ స్టాండర్డ్ ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన సంస్థగా దీనికి ప్రత్యేక గౌరవం దక్కుతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనే ప్రభాస్ హీరోగా రూపొందిస్తున్న సలార్ కూడా సక్సెస్ అయితే హోంబాలే రేంజ్ ఎక్కడికి వెళ్తుందో ఊహించడం కష్టమే.
అలా అని అప్పటిదాకా వీళ్ళు ఆగడం లేదు. ఒక క్రేజీ కాంబినేషన్ తో కొత్త ప్రాజెక్టు ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.
2020 కొరోనా టైంలో సూర్య హీరోగా రూపొందిన ఆకాశం నీ హద్దురా (తమిళం సూరారై పోట్రు)తో లెక్కలేనన్ని ప్రశంసలు, అవార్డులు దక్కించుకున్న సుధా కొంగర దర్శకత్వంలో మరో భారీ చిత్రానికి హోంబలీ ఫిలింస్ శ్రీకారం చుట్టనుంది. హీరో ఎవరనేది ఇంకా చెప్పలేదు కానీ సూర్యనే లాక్ అయ్యారని చెన్నై మీడియాలో లీకులు వచ్చాయి. ఇది కూడా గ్రాండ్ గా టైం చూసి అనౌన్స్ చేస్తారు.
ఆకాశం నీ హద్దురా దాదాపు ఆస్కార్ తెచ్చుకున్నంత పని చేశాక తర్వాత సినిమా కోసం సుధా కొంగర ముందు విజయ్ తో చేయాలని ట్రై చేశారు. కానీ కుదరలేదు. ఇప్పుడు హీరో కాంబో రిపీట్ అవుతున్నా బడ్జెట్ పరంగా రాజీ లేని నిర్మాతలు దొరకడంతో స్కేల్ ని ఊహించడం కష్టమే. రెగ్యులర్ ఎంటర్ టైనర్స్ కాకుండా గురు లాంటి ఎమోషనల్ డ్రామాలకే ప్రాధాన్యం ఇచ్చే సుధా కొంగర ఇప్పుడే జానర్ తీసుకున్నారో. ట్విట్టర్ హ్యాండిల్ లో ట్రూ స్టోరీ అనే హింట్ ఇచ్చారు కాబట్టి ఏదో నిజ జీవిత కథనో సంఘటనో అయ్యుంటుంది.
This post was last modified on April 21, 2022 12:17 pm
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…