Movie News

ఆచార్య… మహేష్ ఫ్యాన్స్ కు స్వీట్ సర్ప్రైజ్.

వచ్చే శుక్రవారం విడుదల కాబోతున్న మెగాస్టార్ చిరంజీవి ఆచార్య మీద అంచనాలు మెల్లగా పెరుగుతున్నాయి. ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2 రేంజ్ బజ్ అయితే లేదు కానీ టీమ్ మాత్రం ఫలితం పట్ల చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. నిన్నటి నుంచి రామ్ చరణ్ కొరటాల శివ ఇంటర్వ్యూతో ప్రమోషన్లు మొదలుపెట్టారు. ఈ నెల 23న హైదరాబాద్ యూసఫ్ గూడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నారు. అతిథిగా పవన్ కళ్యాణ్ వస్తారనే లీక్ వదిలారు కానీ అదెంత వరకు నిజమో అఫీషియల్ కన్ఫర్మేషన్ వస్తే కానీ చెప్పలేం.

ఇక అసలు విషయానికి వస్తే ఆచార్య కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నట్టు లేటెస్ట్ అప్ డేట్. టీమ్ అఫీషియల్ గా చెప్పలేదు కానీ దర్శకుడు కొరటాల శివ ప్రతిపాదనకు ప్రిన్స్ వెంటనే అంగీకరించినట్టు తెలిసింది. ఈ డబ్బింగ్ రెండు మూడు రోజుల్లో పూర్తి చేసేయొచ్చు. శ్రీమంతుడు, భరత్ అనే నేను దర్శకుడిగా కొరటాల మీద మహేష్ కు అపారమైన అభిమానం. ఒక స్టేజిలో ట్రిపులార్ వల్ల రామ్ చరణ్ కనక ఆచార్య క్యారెక్టర్ చేయలేకపోతే తనను అడగమని చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి.

సో ఆచార్యకు ప్రిన్స్ వాయిస్ ఖచ్చితంగా ప్లస్ అయ్యేదే. గతంలో తన గొంతు ఇచ్చిన సినిమాలు పవన్ కళ్యాణ్ జల్సా, జూనియర్ ఎన్టీఆర్ బాద్షా. రెండూ మంచి ఫలితాలు అందుకున్నాయి. కృష్ణ గారి శ్రీశ్రీ, మంజుల దర్శకత్వం వహించిన మనసుకు నచ్చిందిలో కూడా తన వాయిస్ ఉంటుంది. సర్కారు వారి పాట విడుదల కోసం ఎదురు చూస్తున్న మహేష్ ఫ్యాన్స్ కు ఇదో స్వీట్ సర్ప్రైజ్. చిరు అంటే గౌరవం, చరణ్ తో స్నేహం, కొరటాల మీద అభిమానం ఇన్ని ఉంటే ఆయన నో ఎందుకు చెప్తారు.

This post was last modified on April 21, 2022 10:44 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

వరుసగా ఏఐ మేధావుల మరణాలు.. ఏం జరుగుతోంది?

చాట్ GPT - డీప్ సీక్ - మెటా.. ఇలా ఏఐ టెక్నాలజీతో ప్రపంచం రోజుకో కొత్త తరహా అద్బుతానికి…

49 minutes ago

ఆ ఇద్దరు ఓకే అంటే సాయిరెడ్డి సేఫేనా?

ఏ పార్టీతో అయితే రాజకీయం మొదలుపెట్డారో… అదే పార్టీకి రాజీనామా చేసి, ఏకంగా రాజకీయ సన్యాసం ప్రకటించిన మాజీ ఎంపీ…

2 hours ago

బర్త్ డే కోసం ఫ్యామిలీతో ఫారిన్ కు చంద్రబాబు

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనకు వెళుతున్నారు. బుధవారం తన కుటుంబంతో కలిసి ఢిల్లీ వెళ్లనున్న…

3 hours ago

విశాఖ‌కు మ‌హ‌ర్ద‌శ‌.. ఏపీ కేబినెట్ కీల‌క నిర్ణ‌యాలు!

ప్ర‌స్తుతం ఐటీ రాజ‌ధానిగా భాసిల్లుతున్న విశాఖ‌ప‌ట్నానికి మ‌హ‌ర్ద‌శ ప‌ట్ట‌నుంది. తాజాగా విశాఖ‌ప‌ట్నానికి సంబంధించిన అనేక కీల‌క ప్రాజెక్టుల‌కు చంద్ర‌బాబు నేతృత్వంలోని…

7 hours ago

‘ఇది సరిపోదు.. వైసీపీని తిప్పికొట్టాల్సిందే’

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం మంగళవారం అమరావతిలోని సచివాలయంలో జరిగింది.…

10 hours ago

అతి చెత్త స్కోరుతో గెలిచి చూపించిన పంజాబ్

ఐపీఎల్‌లో సాధారణంగా ఎక్కువ స్కోర్లు మాత్రమే విజయం అందిస్తాయని అనుకునే వారికి, పంజాబ్ కింగ్స్ తన తాజా విజయంతో ఊహించని…

10 hours ago