వచ్చే శుక్రవారం విడుదల కాబోతున్న మెగాస్టార్ చిరంజీవి ఆచార్య మీద అంచనాలు మెల్లగా పెరుగుతున్నాయి. ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2 రేంజ్ బజ్ అయితే లేదు కానీ టీమ్ మాత్రం ఫలితం పట్ల చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. నిన్నటి నుంచి రామ్ చరణ్ కొరటాల శివ ఇంటర్వ్యూతో ప్రమోషన్లు మొదలుపెట్టారు. ఈ నెల 23న హైదరాబాద్ యూసఫ్ గూడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నారు. అతిథిగా పవన్ కళ్యాణ్ వస్తారనే లీక్ వదిలారు కానీ అదెంత వరకు నిజమో అఫీషియల్ కన్ఫర్మేషన్ వస్తే కానీ చెప్పలేం.
ఇక అసలు విషయానికి వస్తే ఆచార్య కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నట్టు లేటెస్ట్ అప్ డేట్. టీమ్ అఫీషియల్ గా చెప్పలేదు కానీ దర్శకుడు కొరటాల శివ ప్రతిపాదనకు ప్రిన్స్ వెంటనే అంగీకరించినట్టు తెలిసింది. ఈ డబ్బింగ్ రెండు మూడు రోజుల్లో పూర్తి చేసేయొచ్చు. శ్రీమంతుడు, భరత్ అనే నేను దర్శకుడిగా కొరటాల మీద మహేష్ కు అపారమైన అభిమానం. ఒక స్టేజిలో ట్రిపులార్ వల్ల రామ్ చరణ్ కనక ఆచార్య క్యారెక్టర్ చేయలేకపోతే తనను అడగమని చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి.
సో ఆచార్యకు ప్రిన్స్ వాయిస్ ఖచ్చితంగా ప్లస్ అయ్యేదే. గతంలో తన గొంతు ఇచ్చిన సినిమాలు పవన్ కళ్యాణ్ జల్సా, జూనియర్ ఎన్టీఆర్ బాద్షా. రెండూ మంచి ఫలితాలు అందుకున్నాయి. కృష్ణ గారి శ్రీశ్రీ, మంజుల దర్శకత్వం వహించిన మనసుకు నచ్చిందిలో కూడా తన వాయిస్ ఉంటుంది. సర్కారు వారి పాట విడుదల కోసం ఎదురు చూస్తున్న మహేష్ ఫ్యాన్స్ కు ఇదో స్వీట్ సర్ప్రైజ్. చిరు అంటే గౌరవం, చరణ్ తో స్నేహం, కొరటాల మీద అభిమానం ఇన్ని ఉంటే ఆయన నో ఎందుకు చెప్తారు.
ఒకప్పుడు సౌత్ సినిమాలను బాలీవుడ్ వాళ్లు ఎంత తక్కువగా చూశారో తెలిసిందే. కానీ ‘బాహుబలి’ సినిమా తర్వాత లెక్కలన్నీ మారిపోయాయి.…
ఏపీలో కూటమి అధికారం చేపట్టి అప్పుడే రెండేళ్లు దాటిపోయింది. 2024 ఎన్నికల్లో ఏ ఒక్కరి ఊహకు అందని రీతిలో టీడీపీ,…
ఏపీ సీఎం చంద్రబాబు.. పాలన, ఆయన తీసుకున్న నిర్ణయాలు.. వేస్తున్న అడుగులు, భవిష్యత్తు ఆంధ్ర ప్రదేశ్ నిర్మాణం.. వంటి పలు…
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడతారన్న పేరుంది. పైగా మాటల విషయంలో ఆమె…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై…