ఏ సినిమాకు ఎప్పుడు ఎలా క్రేజ్ వస్తుందో చెప్పలేం. కొన్నిసార్లు హైప్ అసాధారణ స్థాయికి చేరుకుని బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు జరిగిపోతుంటాయి. మూడున్నరేళ్ల కిందట ‘కేజీఎఫ్’ అనే కన్నడ అనువాద చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో అసాధారణ విజయాన్నందుకుంది. కన్నడలో మీడియం రేంజ్ హీరోను పెట్టి, ఒక సినిమా అనుభవం ఉన్న దర్శకుడు తీసిన చిత్రం పాన్ ఇండియా లెవెల్లో ఆ స్థాయిలో ఆడేస్తుందని ఎవ్వరూ ఊహించలేదు.
దీనికి కొనసాగింపుగా తెరకెక్కిన ‘కేజీఎఫ్-చాప్టర్ 2’కు ముందు నుంచి హైప్ ఉంది కానీ.. అది రిలీజ్ సమయానికి మరో స్థాయికి చేరుకుంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సాధించిన ఓపెనింగ్స్ చూసి ట్రేడ్ పండిట్లు విస్తుబోయారు. ముఖ్యంగా హిందీ మార్కెట్లో ఈ చిత్రం సంచలనాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నాలుగు రోజుల తొలి వీకెండ్లోనే రూ.190 కోట్లకు పైగా కొల్లగొట్టి ఔరా అనిపించింది. ఆ తర్వాత కూడా ‘కేజీఎఫ్-2’ జోరు తగ్గలేదు.
సోమ, మంగళవారాల్లో కలిపి దాదాపు రూ.45 కోట్లకు పైగానే వసూళ్లు రావడం విశేషం. బుధవారం మ్యాట్నీలు అయ్యేసరికే ‘కేజీఎఫ్-2’ హిందీ వెర్షన్ రూ.250 కోట్ల క్లబ్బులోకి అడుగు పెడుతోంది. ఇదే సమయంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కూడా రూ.250 కోట్ల మార్కును అందుకోవడం విశేషం. నిజానికి ‘ఆర్ఆర్ఆర్’కు రిలీజ్ ముంగిట హిందీలో పెద్దగా హైప్ కనిపించలేదు. దీంతో వంద కోట్లు వసూలు చేస్తే ఎక్కువ అన్నారు. కానీ రిలీజ్ తర్వాత కథ మారిపోయింది. వసూళ్లు రోజు రోజుకూ పుంజుకున్నాయి.
100 కోట్లు, 200 కోట్లు.. ఇలా ఒక్కో మైలురాయిని దాటుతూ వచ్చింది. మంగళవారం నాటికి ఈ సినిమా రూ.250 కోట్ల మార్కును అందుకుంది. ఐతే ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి రూపొందించిన ఈ చిత్రం ఇంత కష్టపడి, రిలీజైన నాలుగో వారంలో ఈ మార్కును అందుకుంటే.. ‘కేజీఎఫ్-2’ వారం తిరక్కముందే ఈ ఘనతను అందుకోవడం విశేషం. వీటి కంటే ముందు ‘కశ్మీర్ ఫైల్స్’ కరోనా తర్వాత హిందీలో రూ.250 కోట్ల మార్కును అందుకున్న తొలి చిత్రంగా నిలిచింది. ‘కేజీఎఫ్-2’ ఊపు చూస్తే ఫుల్ రన్లో హిందీ వరకే రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టేలా కనిపిస్తోంది.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…