ఎప్పట్నుంచో చర్చల్లో ఉన్న ఒక కలల కాంబినేషన్ ఎట్టకేలకు కార్యరూపం దాల్చింది. బాలీవుడ్ ఆల్ టైం సూపర్ స్టార్లలో ఒకడైన షారుఖ్ ఖాన్.. చాలా తక్కువ సినిమాలతో గొప్ప స్థాయిని అందుకున్న రాజ్ కుమార్ హిరానితో జట్టు కడుతున్నాడు. మున్నాబాయ్-1, 2.. 3 ఇడియట్స్, పీకే, సంజు.. ఇలా ఇప్పటిదాకా తీసిన అయిదు చిత్రాలతోనూ ఘనవిజయాలందుకోవడంతో పాటు గొప్ప పేరూ సంపాదించిన హిరానితో షారుఖ్ సినిమా అనేసరికి హిందీ ఆడియన్సే కాదు.. మిగతా భాషల ప్రేక్షకులు కూడా అమితాసక్తితో చూస్తున్నారీ సినిమా కోసం.
సినిమా అనౌన్స్మెంట్తోనే రిలీజ్ డేట్ ఇచ్చి ఆశ్చర్యపరిచిందీ చిత్ర బృందం. డంకి పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమా 2023 క్రిస్మస్ కానుకగా డిసెంబరు 22న విడుదల కాబోతోంది. హిరాని-షారుఖ్ కలయికలో సినిమా ఉంటుందని రెండేళ్ల ముందే వార్తలొచ్చాయి. ఎట్టకేలకు అధికారిక ప్రకటన వచ్చింది.
ఐతే ఈ సినిమాకు సంబంధించి తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించే విషయం ఒకటుంది. డంకి చిత్రానికి స్క్రిప్టు రాసింది కనిక థిల్లాన్ కావడం విశేషం. ఆమె రాఘవేంద్రరావు మాజీ కోడలన్న సంగతి గుర్తుండే ఉంటుంది.
కోవెలమూడి ప్రకాష్ను పెళ్లి చేసుకుని కొన్నేళ్ల పాటు హైదరాబాద్లోనే అతడితో కలిసుందామె. కనిక ముందు నుంచే బాలీవుడ్లో పేరున్న స్క్రీన్ రైటర్. తెలుగులో ప్రకాష్ తీసిన సైజ్ జీరో చిత్రానికి ఆమే కథకురాలు. ఆ సినిమా పెద్ద డిజాస్టర్ అయింది. తర్వాత ఇద్దరికీ పొసగక విడాకులు తీసుకున్నారు.
తర్వాత కనిక తిరిగి ముంబయికి మకాం మార్చింది. ఆమె రచనలో గత ఏడాది తాప్సి ప్రధాన పాత్రలో హసీన్ దిల్ రుబా అనే సినిమా వచ్చింది. అంతకుముందు షారుఖ్ కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్గా నిలిచిన జీరోకు కూడా కనిక రైటర్. ట్రాక్ రికార్డు మరీ గొప్పగా ఏమీ లేకున్నా.. ఆమె అందించిన స్క్రిప్టుతో హిరాని సినిమా తీస్తుండటం విశేషమే. ఐతే దర్శకుడిగా ఆయన టచ్ ఎలాంటిదో తెలిసిందే కాబట్టి కనిక స్క్రిప్టు విషయంలో మరీ కంగారు పడాల్సిన పని లేదేమో.
This post was last modified on April 19, 2022 9:10 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…