ఎప్పట్నుంచో చర్చల్లో ఉన్న ఒక కలల కాంబినేషన్ ఎట్టకేలకు కార్యరూపం దాల్చింది. బాలీవుడ్ ఆల్ టైం సూపర్ స్టార్లలో ఒకడైన షారుఖ్ ఖాన్.. చాలా తక్కువ సినిమాలతో గొప్ప స్థాయిని అందుకున్న రాజ్ కుమార్ హిరానితో జట్టు కడుతున్నాడు. మున్నాబాయ్-1, 2.. 3 ఇడియట్స్, పీకే, సంజు.. ఇలా ఇప్పటిదాకా తీసిన అయిదు చిత్రాలతోనూ ఘనవిజయాలందుకోవడంతో పాటు గొప్ప పేరూ సంపాదించిన హిరానితో షారుఖ్ సినిమా అనేసరికి హిందీ ఆడియన్సే కాదు.. మిగతా భాషల ప్రేక్షకులు కూడా అమితాసక్తితో చూస్తున్నారీ సినిమా కోసం.
సినిమా అనౌన్స్మెంట్తోనే రిలీజ్ డేట్ ఇచ్చి ఆశ్చర్యపరిచిందీ చిత్ర బృందం. డంకి పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమా 2023 క్రిస్మస్ కానుకగా డిసెంబరు 22న విడుదల కాబోతోంది. హిరాని-షారుఖ్ కలయికలో సినిమా ఉంటుందని రెండేళ్ల ముందే వార్తలొచ్చాయి. ఎట్టకేలకు అధికారిక ప్రకటన వచ్చింది.
ఐతే ఈ సినిమాకు సంబంధించి తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించే విషయం ఒకటుంది. డంకి చిత్రానికి స్క్రిప్టు రాసింది కనిక థిల్లాన్ కావడం విశేషం. ఆమె రాఘవేంద్రరావు మాజీ కోడలన్న సంగతి గుర్తుండే ఉంటుంది.
కోవెలమూడి ప్రకాష్ను పెళ్లి చేసుకుని కొన్నేళ్ల పాటు హైదరాబాద్లోనే అతడితో కలిసుందామె. కనిక ముందు నుంచే బాలీవుడ్లో పేరున్న స్క్రీన్ రైటర్. తెలుగులో ప్రకాష్ తీసిన సైజ్ జీరో చిత్రానికి ఆమే కథకురాలు. ఆ సినిమా పెద్ద డిజాస్టర్ అయింది. తర్వాత ఇద్దరికీ పొసగక విడాకులు తీసుకున్నారు.
తర్వాత కనిక తిరిగి ముంబయికి మకాం మార్చింది. ఆమె రచనలో గత ఏడాది తాప్సి ప్రధాన పాత్రలో హసీన్ దిల్ రుబా అనే సినిమా వచ్చింది. అంతకుముందు షారుఖ్ కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్గా నిలిచిన జీరోకు కూడా కనిక రైటర్. ట్రాక్ రికార్డు మరీ గొప్పగా ఏమీ లేకున్నా.. ఆమె అందించిన స్క్రిప్టుతో హిరాని సినిమా తీస్తుండటం విశేషమే. ఐతే దర్శకుడిగా ఆయన టచ్ ఎలాంటిదో తెలిసిందే కాబట్టి కనిక స్క్రిప్టు విషయంలో మరీ కంగారు పడాల్సిన పని లేదేమో.
2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…
ఈ రోజుల్లో చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకు రిలీజ్రోజు ఇచ్చిన థియేటర్లను జనంతో నింపడమే కష్టమైపోతోంది. జనం థియేటర్లకు రావడం…
ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్రభుత్వం ఏం చేయాలన్నా.. మరో…
ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…