సినిమా వేడుకల్లో చాలా సీరియస్గా కనిపిస్తాడు పవన్ కళ్యాణ్. తన సినిమా వేడుకల్లో కూడా ఆయన మాట్లాడ్డం చాలా తక్కువ. వేరే వాళ్ల సినిమా వేడుకలకు, ఇంకేవైనా ప్రమోషనల్ ఈవెంట్లకు అసలే రాడు. తన ఫ్యామిలీ హీరోలకు సంబంధించిన ఈవెంట్లలో కూడా ఎప్పుడో కానీ పాల్గొనడు.
అలాంటివాడు యాంకర్ సుమ ప్రధాన పాత్ర పోషించిన జయమ్మ పంచాయితీ సినిమాకు సంబంధించి ఒక ఈవెంట్లో పాల్గొని తన చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ చేయడం విశేషం. అంతే కాక ఈ వేడుకలో చాలా సరదాగా మాట్లాడాడు కూడా. సుమ గురించి ఆయన మాట్లాడిన మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. సుమకు తాను అభిమానినని పవన్ ఈ సందర్భంగా చెప్పడం విశేషం.
సుమకు చాలామంది అభిమానులున్నారని, వారిలో తానూ ఒకడినని పవన్ అన్నాడు. ఆమెలో మంచి నటి దాగి ఉందని, కేవలం యాంకరింగ్కే పరిమితం కాకుండా, అప్పుడప్పుడూ ఇలా సినిమాల్లో కూడా నటిస్తూ ఉండాలని పవన్ కోరాడు. సుమతో కలిసి నటించాలని కూడా కోరుకుంటున్నట్లు పవన్ చెప్పడం విశేషం.
సుమకు ఇష్టమైతే తాను తన సినిమాల నిర్మాతలతో మాట్లాడతానని.. ఆమె ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటోందో చెబితే అలా ఉండేలా తన కోసం క్యారెక్టర్లు సిద్ధం చేయిస్తామని పవన్ వ్యాఖ్యానించాడు. దీనికి సుమ ఒకింత సంబరపడుతూ.. వెంటనే నిర్మాతలు ఎక్కడ అని నవ్వుతూ అడిగింది.
దీంతో పవన్ సహా అందరూ గట్టిగా నవ్వేశారు. ఇక పవన్ చేతుల మీదుగా లాంచ్ అయిన జయమ్మ పంచాయితీ ట్రైలర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. సుమ కామెడీ టైమింగ్కు తగ్గ కథనే దర్శకుడు విజయ్ కుమార్ ఎంచుకున్నట్లున్నాడు. చాలా వరకు సరదాగా సాగుతూ.. కొంతమేర ఎమోషనల్గా కూడా కదిలించే సినిమాలా కనిపిస్తున్న జయమ్మ పంచాయితీ మే 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on April 17, 2022 11:29 am
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…