తమిళనాట విచిత్రమైన పరిస్థితి నెలకొంది ఈ వీకెండ్. అక్కడ బిగ్గెస్ట్ స్టార్ అయిన విజయ్ బీస్ట్ అనే కొత్త సినిమాతో ఈ బుధవారం ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. ఐతే విజయ్ గత సినిమాల మాదిరి ఇదేమీ మ్యాజిక్ చేయలేదు. డివైడ్ టాక్ను తట్టుకోలేకపోతోంది. తొలి రోజు వరకు వసూళ్ల మోత మోగించినా.. రెండో రోజు నుంచి సినిమాకు అనుకున్నంత స్థాయిలో ఆదరణ లేదు.
అక్కడి ప్రేక్షకులు కేజీఎఫ్-2 చూడటానికి తహతహలాడుతున్నారు. విజయ్ సినిమా ముందు ఈ చిత్రం నిలవలేదని అనుకున్నారు కానీ.. అక్కడ కేజీఎఫ్-2 కోసం డిమాండ్ మామూలుగా లేదు. కానీ ఆల్రెడీ బీస్ట్ కోసం మెజారిటీ థియేటర్లు రాసిచ్చేశారు. కేజీఎఫ్-2కు పరిమిత సంఖ్యలోనే స్క్రీన్లు, షోలు ఇచ్చారు. కానీ ఆ సినిమా టికెట్లకు డిమాండ్ విపరీతంగా ఉండగా.. అందుకు తగ్గట్లుగా థియేటర్లు, షోల సప్లై లేదు.
విజయ్ సినిమాకు ఆక్యుపెన్సీ పడిపోయినా.. కేజీఎఫ్-2కు స్క్రీన్లు, షోలు పెంచట్లేదు. విజయ్ సినిమాను తీసేస్తే అభిమానులు ఊరుకోరనో.. ముందే జరిగిన అగ్రిమెంట్లను మీరలేమనో.. ఇలా కారణాలేవైనా సరే.. ఇప్పుడు కేజీఎఫ్-2 చూడాలనుకుంటున్న తమిళ ప్రేక్షకులందరి ఆశా తీరట్లేదు.
దీంతో కేజీఎఫ్-2 ఆడుతున్న థియేటర్లలో రాత్రి 12 తర్వాత ఉదయం 6 మధ్య కూడా ఒకట్రెండు షోలు నడిపించేస్తుండటం విశేషం. మామూలుగా కొత్త సినిమాలకు తొలి రోజు మాత్రమే తెల్లవారుజామున షోలు ఉంటాయి. కానీ కేజీఎఫ్-2కు చిత్రంగా విడుదలైన మూడో రోజు తెల్లవారుజామున 2.30-3.30 మధ్య షోలు కేటాయించడం విశేషం.
తమిళనాడులో 24 గంటల పాటు ఆరు షోలు నడిపించుకోవడానికి అనుమతులుండటంతో కేజీఎఫ్-2 డిమాండ్ను తట్టుకోవడానికి అక్కడి ఎగ్జిబిటర్లు ఇలా ప్లాన్ చేస్తున్నారు. ఏ టైంలో అయినా సరే.. కేజీఎఫ్-2 టికెట్లు ఇలా పెడితే అలా అమ్ముడైపోతున్నాయి. షోలకు షోలు సోల్డ్ ఔట్ అయిపోతున్నాయి. అదే సమయంలో బీస్ట్కు అంతగా డిమాండ్ కనిపించడం లేదని సోషల్ మీడియాలో ట్రెండ్స్ చూస్తే అర్థమవుతోంది.
This post was last modified on April 16, 2022 8:02 am
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…