తమిళనాట విచిత్రమైన పరిస్థితి నెలకొంది ఈ వీకెండ్. అక్కడ బిగ్గెస్ట్ స్టార్ అయిన విజయ్ బీస్ట్ అనే కొత్త సినిమాతో ఈ బుధవారం ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. ఐతే విజయ్ గత సినిమాల మాదిరి ఇదేమీ మ్యాజిక్ చేయలేదు. డివైడ్ టాక్ను తట్టుకోలేకపోతోంది. తొలి రోజు వరకు వసూళ్ల మోత మోగించినా.. రెండో రోజు నుంచి సినిమాకు అనుకున్నంత స్థాయిలో ఆదరణ లేదు.
అక్కడి ప్రేక్షకులు కేజీఎఫ్-2 చూడటానికి తహతహలాడుతున్నారు. విజయ్ సినిమా ముందు ఈ చిత్రం నిలవలేదని అనుకున్నారు కానీ.. అక్కడ కేజీఎఫ్-2 కోసం డిమాండ్ మామూలుగా లేదు. కానీ ఆల్రెడీ బీస్ట్ కోసం మెజారిటీ థియేటర్లు రాసిచ్చేశారు. కేజీఎఫ్-2కు పరిమిత సంఖ్యలోనే స్క్రీన్లు, షోలు ఇచ్చారు. కానీ ఆ సినిమా టికెట్లకు డిమాండ్ విపరీతంగా ఉండగా.. అందుకు తగ్గట్లుగా థియేటర్లు, షోల సప్లై లేదు.
విజయ్ సినిమాకు ఆక్యుపెన్సీ పడిపోయినా.. కేజీఎఫ్-2కు స్క్రీన్లు, షోలు పెంచట్లేదు. విజయ్ సినిమాను తీసేస్తే అభిమానులు ఊరుకోరనో.. ముందే జరిగిన అగ్రిమెంట్లను మీరలేమనో.. ఇలా కారణాలేవైనా సరే.. ఇప్పుడు కేజీఎఫ్-2 చూడాలనుకుంటున్న తమిళ ప్రేక్షకులందరి ఆశా తీరట్లేదు.
దీంతో కేజీఎఫ్-2 ఆడుతున్న థియేటర్లలో రాత్రి 12 తర్వాత ఉదయం 6 మధ్య కూడా ఒకట్రెండు షోలు నడిపించేస్తుండటం విశేషం. మామూలుగా కొత్త సినిమాలకు తొలి రోజు మాత్రమే తెల్లవారుజామున షోలు ఉంటాయి. కానీ కేజీఎఫ్-2కు చిత్రంగా విడుదలైన మూడో రోజు తెల్లవారుజామున 2.30-3.30 మధ్య షోలు కేటాయించడం విశేషం.
తమిళనాడులో 24 గంటల పాటు ఆరు షోలు నడిపించుకోవడానికి అనుమతులుండటంతో కేజీఎఫ్-2 డిమాండ్ను తట్టుకోవడానికి అక్కడి ఎగ్జిబిటర్లు ఇలా ప్లాన్ చేస్తున్నారు. ఏ టైంలో అయినా సరే.. కేజీఎఫ్-2 టికెట్లు ఇలా పెడితే అలా అమ్ముడైపోతున్నాయి. షోలకు షోలు సోల్డ్ ఔట్ అయిపోతున్నాయి. అదే సమయంలో బీస్ట్కు అంతగా డిమాండ్ కనిపించడం లేదని సోషల్ మీడియాలో ట్రెండ్స్ చూస్తే అర్థమవుతోంది.
This post was last modified on April 16, 2022 8:02 am
ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడం, మంచి రిలీజ్ ఉండేలా చూసుకోవడం సవాలుగా మారింది. తెలుగులో…
సినిమా థియేటర్లలో జనం కనిపించడం లేదనేది ఇప్పుడు ఇండస్ట్రీని వేధిస్తున్న అతిపెద్ద సమస్య. సినిమా బాగుంటే వేరే సంగతి, కానీ…
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు ఒక పెద్ద సినిమా వస్తుందంటే చాలు, మిగతా భాషల సినిమాలన్నీ తమ డేట్స్ మార్చుకునే…
ఈ మధ్య కాలంలో చిన్ననాటి స్నేహితులను కలుసుకోవాలనే ఉత్సాహంతో 'గెట్ టు గెదర్' పార్టీలు చేసుకోవడం ఒక ట్రెండ్గా మారింది.…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. నిన్న ఒకే రోజు ఐదు రాష్ట్రాల ఫలితాలు వచ్చినప్పటికీ.. దేశమంతా ఎక్కువ…
పెద్ది కౌంట్ డౌన్ నెలల నుంచి రోజుల్లోకి వచ్చేసింది. ఇంకో ఇరవై తొమ్మిది రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టేందుకు రామ్…