యశ్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగిపోతున్న పేరిది. కేజీఎఫ్-2 సినిమాతో అతను రేపుతున్న సంచలనం అంతా ఇంతా కాదు. కేజీఎఫ్-చాప్టర్1తోనే దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందిన ఈ కన్నడ హీరో.. చాప్టర్-2తో పాన్ ఇండియా లెవెల్లో సూపర్ స్టార్ అయిపోయాడనే చెప్పాలి. కేజీఎఫ్కు ముందు సినిమాతో పోలిస్తే అతడి మార్కెట్ పది రెట్ల కన్నా ఎక్కువైందంటే అతిశయోక్తి కాదు.
మన ప్రభాస్ తరహాలోనే అతడి ఇమేజ్ అసాధారణంగా పెరిగిపోయింది. ఇప్పుడీ స్థాయిలో ఉన్న యశ్.. అసలు ఏ ఫిలిం బ్యాగ్రౌండ్ లేకుండా కన్నడ ఇండస్ట్రీలోకి రావడం విశేషం. అలాగని అతనేమీ బాగా డబ్బున్న కుటుంబం నుంచి రాలేదు. ఒక సాధారణ బస్ డ్రైవర్ కొడుకు యశ్. మధ్య తరగతి కుటుంబంలో పుట్టి చాలామంది కుర్రాళ్ల లాగే సినిమా కలలు కన్న అతణ్ని చూసి చాలామంది నవ్వుకున్నారట. హీరో అవుతానంటే ఎగతాళి చేశారట.
అయినా సరే.. తన కలను చంపుకోలేదు. సినీ రంగంలోకి వచ్చాడు. అవకాశాల కోసం కాళ్లరిగేలా తిరిగాడు. ముందు చిన్న సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేశాడు. తర్వాత రాకీ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అది సరిగా ఆడకపోయినా నిరాశ చెందలేదు. ప్రయత్నం మానలేదు. తర్వాతి సినిమాలు అతడికి ఓ మోస్తరుగా గుర్తింపు తెచ్చాయి. మిస్టర్ అండ్ మిసెస్ రామాచారితో కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు యశ్. ఆ తర్వాత గజకేసరి అనే సినిమా కూడా బాగానే ఆడింది. అప్పుడే అతను ఉగ్రం సినిమాతో వెలుగులోకి వచ్చిన ప్రశాంత్ నీల్తో జట్టు కట్టాడు.
ఐదేళ్ల కిందట వీళ్లిద్దరూ కలిసి హోంబలె ఫిలిమ్స్ అండతో మొదలుపెట్టిన ప్రయత్నం ఇప్పుడు దేశంలోనే బిగ్గెస్ట్ ఫిలిమ్స్లో ఒకటిగా మారిన కేజీఎఫ్-2గా రూపాంతంరం చెందింది. ఇకపై యశ్ నటించే ప్రతి సినిమా పాన్ ఇండియా లెవెల్లోనే ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఈ స్థాయికి చేరుకోవడం అసాధారణ విషయమే.
This post was last modified on April 16, 2022 7:56 am
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…