యశ్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగిపోతున్న పేరిది. కేజీఎఫ్-2 సినిమాతో అతను రేపుతున్న సంచలనం అంతా ఇంతా కాదు. కేజీఎఫ్-చాప్టర్1తోనే దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందిన ఈ కన్నడ హీరో.. చాప్టర్-2తో పాన్ ఇండియా లెవెల్లో సూపర్ స్టార్ అయిపోయాడనే చెప్పాలి. కేజీఎఫ్కు ముందు సినిమాతో పోలిస్తే అతడి మార్కెట్ పది రెట్ల కన్నా ఎక్కువైందంటే అతిశయోక్తి కాదు.
మన ప్రభాస్ తరహాలోనే అతడి ఇమేజ్ అసాధారణంగా పెరిగిపోయింది. ఇప్పుడీ స్థాయిలో ఉన్న యశ్.. అసలు ఏ ఫిలిం బ్యాగ్రౌండ్ లేకుండా కన్నడ ఇండస్ట్రీలోకి రావడం విశేషం. అలాగని అతనేమీ బాగా డబ్బున్న కుటుంబం నుంచి రాలేదు. ఒక సాధారణ బస్ డ్రైవర్ కొడుకు యశ్. మధ్య తరగతి కుటుంబంలో పుట్టి చాలామంది కుర్రాళ్ల లాగే సినిమా కలలు కన్న అతణ్ని చూసి చాలామంది నవ్వుకున్నారట. హీరో అవుతానంటే ఎగతాళి చేశారట.
అయినా సరే.. తన కలను చంపుకోలేదు. సినీ రంగంలోకి వచ్చాడు. అవకాశాల కోసం కాళ్లరిగేలా తిరిగాడు. ముందు చిన్న సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేశాడు. తర్వాత రాకీ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అది సరిగా ఆడకపోయినా నిరాశ చెందలేదు. ప్రయత్నం మానలేదు. తర్వాతి సినిమాలు అతడికి ఓ మోస్తరుగా గుర్తింపు తెచ్చాయి. మిస్టర్ అండ్ మిసెస్ రామాచారితో కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు యశ్. ఆ తర్వాత గజకేసరి అనే సినిమా కూడా బాగానే ఆడింది. అప్పుడే అతను ఉగ్రం సినిమాతో వెలుగులోకి వచ్చిన ప్రశాంత్ నీల్తో జట్టు కట్టాడు.
ఐదేళ్ల కిందట వీళ్లిద్దరూ కలిసి హోంబలె ఫిలిమ్స్ అండతో మొదలుపెట్టిన ప్రయత్నం ఇప్పుడు దేశంలోనే బిగ్గెస్ట్ ఫిలిమ్స్లో ఒకటిగా మారిన కేజీఎఫ్-2గా రూపాంతంరం చెందింది. ఇకపై యశ్ నటించే ప్రతి సినిమా పాన్ ఇండియా లెవెల్లోనే ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఈ స్థాయికి చేరుకోవడం అసాధారణ విషయమే.
This post was last modified on April 16, 2022 7:56 am
మొన్న ఏడాది వచ్చిన వరుణ్ తేజ్ 'మట్కా'ని సామాన్య ప్రేక్షకులు మర్చిపోయి ఉండొచ్చు కానీ అభిమానులకు మాత్రం పీడకలలా నిలిచిపోయింది.…
నిన్న కీలకమైన వీకెండ్ పూర్తయ్యింది. శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీ, పాపం ప్రతాప్ ఆశలన్నీ సండే మీద పెట్టుకుని ప్రమోషన్లు…
సమ్మర్ సీజన్ లో ఏప్రిల్ చివరి వారం సినిమాలకు చాలా మంచి టైం. వేసవి పీక్స్ లో ఉండటంతో పాటు…
గంధపు చెక్కల స్మగ్లర్గా.. దేశవ్యాప్తంగా ఒకప్పుడు సంచలనం రేపిన వీరప్పన్ గురించి అందరికీ తెలిసిందే. కర్ణాటక నుంచి తమిళనాడు వరకు…
ఎన్నికల రాజకీయాల్లో ఆరితేరిన ప్రధాని నరేంద్ర మోడీ.. సమయం.. సందర్భంతోపాటు సెంటిమెంటుకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. సాధారణ ప్రజలకు అత్యంతచేరువ…
రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సూపర్ 6 పేరిట ఇచ్చిన హామీలు బాగా…