వందలు వేల కోట్ల పెట్టుబడి ఉంటే తప్ప ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పెట్టడం సాధ్యం కాదనుకుంటున్న సమయంలో.. కేవలం తెలుగు వరకు ప్రత్యేకంగా తక్కువ పెట్టుబడితో ఓటీటీ పెట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు అల్లు అరవింద్.
ఐతే గీతా ఆర్ట్స్ నిర్మాణంలో తెరకెక్కిన చిత్రాలు, ఇంకేవో కొన్ని చిన్న సినిమాలు పెట్టుకుని ఓటీటీని నడిపి సక్సెస్ కావడం సాధ్యమా అని సందేహించిన వారికి ఆయన దీటైన సమాధానమే ఇచ్చారు. కరోనా టైంలో నెమ్మదిగా కంటెంట్ పెంచుతూ, తెలివిగా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లను దించుతూ ఆహాను భలేగా జనాల్లోకి తీసుకెళ్లారు.
ఇప్పుడు పెద్ద పెద్ద స్ట్రీమింగ్ జెయింట్స్కు దీటుగా నిలబడే స్థితికి చేరుకుంది ఆహా. తెలుగు వరకు ఇప్పుడు టాప్ ఓటీటీల్లో ఆహా ఒకటి. ఈ ఊపులో ఇక తమిళం మీద కన్నేశారు అల్లు వారు. ఆహాను తమిళంలో కూడా లాంచ్ చేయడానికి కొంత కాలంగా సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
లాంచింగ్కు ముందే ఆహాను ప్రమోట్ చేసిన తీరు తమిళులను ఆకట్టుకుంది. ఇక ఆరంభోత్సవ వేడుక మామూలుగా చేయలేదు అల్లు వారు. ఏకంగా తమిళనాడు సీఎం స్టాలిన్నే ముఖ్య అతిథిగా తీసుకురాగలిగారు. అలాగే భారతీరాజా లాంటి దిగ్గజాన్ని కూడా రప్పించారు. మరోవైపు స్టార్ హీరో శింబు, మ్యూజికల్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్లను బ్రాండ్ అంబాసిడర్లుగా పెట్టుకున్నారు. ఆరంభ వేడుకలో ఆ ఇద్దరూ కూడా పాల్గొన్నారు.
మొత్తంగా లాంచింగ్ పార్టీని చాలా గ్రాండ్గా నిర్వహించి ఆహా ఓటీటీని తమిళంలో హాట్ టాపిక్గా మార్చారు అరవింద్. ఇక కంటెంట్ పరంగా కూడా ఆహా తక్కువగా ఏమీ కనిపించడం లేదు. పేరున్న సినిమాలను కొన్నారు. కొన్ని ఒరిజినల్స్ రెడీ చేశారు. తెలుగు ఆహాతో పోలిస్తే కాస్త ఎక్కువ కంటెంట్తోనే రంగంలోకి దిగుతున్నారు. తెలుగులో మాదిరే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తే తమిళంలోనూ ఆహా అదరగొట్టడం ఖాయం.
తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మొన్నటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాాలే ఇందుకు కారణమని చెప్పాలి. ఈ…
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. బీజేపీకి జనసేనతో…
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…