ట్రయల్ షూట్ చేసుకుని ఆర్.ఆర్.ఆర్. షూటింగ్ మళ్ళీ మొదలు పెట్టాలని రాజమౌళి గట్టిగా కృషి చేస్తున్నాడు. ట్రయల్ షూట్ అనుకున్న సమయానికి జరగకపోయినా రాజమౌళి పట్టు వీడలేదు. ఈ నెల 25న ట్రయల్ షూట్ గండిపేటలో పెట్టుకున్నాడు. రెండు రోజుల పాటు ఈ ట్రయల్ షూట్ జరుగుతుంది. పీపీఈ కిట్లు, పరిమిత సిబ్బంది వగైరా జాగ్రత్తలతో ఈ షూట్ చేయబోతున్నారు.
దీనికి హీరోలు తారక్, చరణ్ హాజరు కావడంలేదు. వారికీ బదులు డూప్స్ ని పెట్టి షూట్ చేస్తారు. రాజమౌళికి షూటింగ్ మళ్ళీ ట్రాక్ ఎక్కించాలనే బలమైన సంకల్పం ఉన్నా కానీ చరణ్, తారక్ ఇద్దరూ అందుకు అనుకూలంగా లేరని వినిపిస్తోంది. ఆ మాటకు వస్తే ప్రస్తుతం రిస్క్ తీసుకోవడానికి తొంభై శాతం నటీనటులు సిద్ధంగా లేరు.
పరిస్థితులు నార్మల్ అయ్యే వరకు వేచి చూడాలనే అందరూ డిసైడ్ అయ్యారు. అవసరం అనుకుంటే పారితోషికాలు తగ్గించుకుని నష్టాలు భర్తీ చేసుకోవచ్చు కానీ రిస్క్ దేనికని భావిస్తున్నారు. అయితే తారక్, చరణ్ వచ్చినా, రాకపోయినా కరోనా టైంలో షూటింగ్స్ ఎలా చేస్తే ఉత్తమం అనేదానికి ఉదాహరణగా అయినా ఇది నిలుస్తుందని రాజమౌళి తన ప్రయత్నంలో ముందుకు సాగుతున్నాడు.
This post was last modified on June 22, 2020 1:50 pm
టిడిపిలోనే కొందరు నాయకులకు మెజారిటీ సమస్య ఇప్పుడు కొంత గడబిడగా మారింది. గత ఎన్నికల సమయంలో భారీ స్థాయి మెజారిటీతో…
ఇటీవలే శ్వాసనాళానికి సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకున్న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్రమంగా కోలుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్…
ఎవరు ఔనన్నా కాదన్నా టాలీవుడ్ రెండు వర్గాలుగా విడిపోయింది. ఎగ్జిబిటర్లు ప్లస్ వాళ్లలోనే ఉన్న నిర్మాతలు, ప్రొడ్యూసర్లు ప్లస్ వాళ్లలోనే…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)కు నిజంగానే ఉచ్చు బిగుస్తోందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.…
జైలు.. ఈ మాట వినగానే సామాన్యులకు వామ్మో అనిపిస్తుంది. అక్కడి పరిస్థితుల గురించి అనుభవం ఉన్న వాళ్లు చెబుతుంటే.. సినిమాల్లో…
ఏపీలో ప్రదాన ప్రతిపక్ష హోదానూ దక్కించుకోలేకపోయిన వైసీపీ… తన పునరాగమనానికి భారీ కసరత్తే చేస్తోంది. అందులో భాగంగా ఏ చిన్న…