ట్రయల్ షూట్ చేసుకుని ఆర్.ఆర్.ఆర్. షూటింగ్ మళ్ళీ మొదలు పెట్టాలని రాజమౌళి గట్టిగా కృషి చేస్తున్నాడు. ట్రయల్ షూట్ అనుకున్న సమయానికి జరగకపోయినా రాజమౌళి పట్టు వీడలేదు. ఈ నెల 25న ట్రయల్ షూట్ గండిపేటలో పెట్టుకున్నాడు. రెండు రోజుల పాటు ఈ ట్రయల్ షూట్ జరుగుతుంది. పీపీఈ కిట్లు, పరిమిత సిబ్బంది వగైరా జాగ్రత్తలతో ఈ షూట్ చేయబోతున్నారు.
దీనికి హీరోలు తారక్, చరణ్ హాజరు కావడంలేదు. వారికీ బదులు డూప్స్ ని పెట్టి షూట్ చేస్తారు. రాజమౌళికి షూటింగ్ మళ్ళీ ట్రాక్ ఎక్కించాలనే బలమైన సంకల్పం ఉన్నా కానీ చరణ్, తారక్ ఇద్దరూ అందుకు అనుకూలంగా లేరని వినిపిస్తోంది. ఆ మాటకు వస్తే ప్రస్తుతం రిస్క్ తీసుకోవడానికి తొంభై శాతం నటీనటులు సిద్ధంగా లేరు.
పరిస్థితులు నార్మల్ అయ్యే వరకు వేచి చూడాలనే అందరూ డిసైడ్ అయ్యారు. అవసరం అనుకుంటే పారితోషికాలు తగ్గించుకుని నష్టాలు భర్తీ చేసుకోవచ్చు కానీ రిస్క్ దేనికని భావిస్తున్నారు. అయితే తారక్, చరణ్ వచ్చినా, రాకపోయినా కరోనా టైంలో షూటింగ్స్ ఎలా చేస్తే ఉత్తమం అనేదానికి ఉదాహరణగా అయినా ఇది నిలుస్తుందని రాజమౌళి తన ప్రయత్నంలో ముందుకు సాగుతున్నాడు.
This post was last modified on June 22, 2020 1:50 pm
కేంద్ర మంత్రి బండి సంజయ్ కు సన్ స్ట్రోక్ తప్పేలా లేదు. బండిని మంత్రి పదవి నుంచి తొలగించడం ఖాయమని…
మంత్రులు మౌనంగా ఉంటే సహించేది లేదని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. ముఖ్యంగా టీడీపీ మంత్రులకు ఆయన ఈ విషయంలో…
ఇంకో నాలుగు రోజుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు రానుంది. గుంటూరు కారం తర్వాత తన దర్శనం స్క్రీన్…
యువ కథానాయకుడు సందీప్ కిషన్ కెరీర్లో సక్సెస్ రేట్ తక్కువే అయినా.. అవకాశాలకేమీ లోటుండదు. ఎప్పుడూ చేతిలో రెండు మూడు…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ చాలా రోజుల తరువాత ఒక సాధారణ ఉద్యోగిలా దర్శనమిచ్చాడు. శ్రీలంక…
ఒక హీరో వరుసగా డిజాస్టర్లు ఇచ్చినపుడు.. తన చివరి హిట్ ఎప్పుడో తన అభిమానులు కూడా మరిచిపోయినపుడు.. అతను కొత్తగా…