భారీ అంచనాలతో రిలీజైన ఒక పెద్ద హీరో సినిమా అభిమానుల్ని అలరించేలా ఉంటే.. ఆ హీరో పెర్ఫామెన్స్ గురించి కొనియాడుతూ.. set screens on fire అనే మాట వాడుతుంటారు నెటిజన్లు. ఐతే ఎలివేషన్ కోసం వాడే ఈ మాటను నిజం చేశారు తమిళ స్టార్ విజయ్ అభిమానులు. విజయ్ కొత్త చిత్రం బీస్ట్ రిలీజ్ సందర్భంగా తమిళనాట ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
ఏ ప్రాంతంలో, ఏ థియేటర్లో జరిగిందన్న వివరాలు వెల్లడి కాలేదు కానీ.. తమిళనాడులోనే జరిగినట్లుగా భావిస్తున్న ఈ ఉదంతం ఇంటర్నెట్లో చర్చనీయాంశంగా మారింది. బీస్ట్ మూవీ అంచనాలకు తగ్గట్లు లేకపోవడంతో అసంతృప్తికి లోనైన విజయ్ అభిమానులు స్క్రీన్కు నిప్పు పెట్టేశారు. ముందు అది సినిమాలోని మంటే అనుకున్నారు కానీ.. కొన్ని క్షణాల తర్వాత కానీ.. అది నిజం మంట అని జనాలకు అర్థం కాలేదు. సినిమా చివరి దశలో ఉండగా.. స్క్రీన్ను ఇలా తగలబెట్టేశారు. థియేటర్లో ఉన్న వాళ్లు దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
మంట పెరుగుతుండగా.. జనాలు ఆందోళనతో అరవడం, థియేటర్ నుంచి బయటికి పరుగులు పెట్టడం ఆ వీడియోలో కనిపిస్తోంది. ఐతే తర్వాత ఏం జరిగిందన్న వివరాలు తెలియరాలేదు. బీస్ట్ సినిమా ప్రేక్షకులను ఎంత నిరుత్సాహానికి గురి చేసిందనడానికి ఇది రుజువంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
విజయ్ అభిమానులకు తప్పితే ఎవరికీ ఓ మోస్తరుగా కూడా నచ్చేలా తీర్చిదిద్దలేదు దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్. విజయ్ ఫ్యాన్స్ సైతం సినిమా పట్ల అసంతృప్తితో మాట్లాడుతున్న వీడియోలు నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. డిజాస్టర్ బీస్ట్ అన్న హ్యాష్ ట్యాగ్ బుధవారం సాయంత్రం నుంచి ట్విట్టర్లో టాప్లో ట్రెండ్ అవుతుండటం గమనార్హం.
This post was last modified on April 14, 2022 7:56 am
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…
జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…
విద్యార్థి ఉద్యమాలకు తెరదీసిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నాయకులు, కార్యకర్తలకు తొలిసారి పరాభవం ఎదురైంది. ఇటీవల నీట్ ప్రశ్న పత్రం…
ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…
హైదరాబాద్ నగరంలోని రాయదుర్గం భూముల్లో కొంత భాగాన్ని ప్రభుత్వం వేలం వేసింది. అయితే.. మునుపెన్నడూ లేని విధంగా కళ్లు చెదిరే…