అర్జున్ రెడ్డి.. తెలుగు సినిమా చరిత్రలో ఈ సినిమాకో ప్రత్యేక అధ్యాయం కేటాయించాల్సిందే. ఇదొక మోడర్న్ క్లాసిక్, ట్రెండ్ సెట్టర్ అనడంలో సందేహం లేదు. ఇందులోని బోల్డ్నెస్ను ఓ వర్గం ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోవచ్చు కానీ.. కథాకథనాలు, నరేషన్ విషయంలో ఈ చిత్రంతో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాడు కొత్త దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. అది ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసి సెన్సేషనల్ హిట్టయిపోయింది అర్జున్ రెడ్డి.
ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ పెద్ద స్టార్ అయిపోయాడు. ఈ చిత్రంలో విజయ్ పెర్ఫామెన్స్, సందీప్ దర్శకత్వ ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమాను అనుకరిస్తూ తర్వాత ఎన్నో చిత్రాలు వచ్చాయి కానీ.. ఏదీ దాని స్థాయిని అందుకోలేకపోయింది. అర్జున్ రెడ్డిని హిందీలో కబీర్ సింగ్గా రీమేక్ చేస్తే అక్కడా సెన్సేషనల్ హిట్టయింది.
ఈ ఏడాది ఆగస్టు 25కు అర్జున్ రెడ్డి రిలీజై ఐదేళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా అర్జున్ రెడ్డి రా వెర్షన్ను రిలీజ్ చేయబోతున్నట్లు దర్శకుడు సందీప్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఈ సినిమాను ముందు 4 గంటల 20 నిమిషాల నిడివితో తీశాడు సందీప్. తర్వాత దాన్ని 3 గంటల 45 నిమిషాలకు కుదించాడు. కానీ ఈ లెంగ్త్ కూడా చాలా ఎక్కువ అవుతుందని భావించి చివరికి 3 గంటల రన్ టైంతో రిలీజ్ చేశారు. మామూలుగా ఇప్పుడు సినిమాల నిడివి రెండున్నర గంటలకు అటు ఇటు ఉంటోంది. 3 గంటలకే లెంగ్త్ ఎక్కువ అంటారు. అలాంటిది 3 గంటల 45 నిమిషాల రన్ టైం అంటే కష్టమే. అందుకే దాన్ని కుదించాల్సి వచ్చింది.
ఐతే సినిమాను 3.45 గంటల నిడివితో రిలీజ్ చేసి ఉంటే ఇంకా పెద్ద హిట్టయ్యేదని, అర్జున్ రెడ్డి పాత్ర ఇంకా ఇంపాక్ట్ చూపించేదని, అందుకే ఇప్పుడు ఈ సినిమా రా వెర్షన్ను ఐదో వార్షికోత్సవ సందర్భాన రిలీజ్ చేయబోతున్నానని సందీప్ ప్రకటించాడు. అర్జున్ రెడ్డి కాలేజీలో అడుగు పెట్టడానికి ముందు జీవితాన్ని, ఇంకా కొన్ని అదనపు సన్నివేశాలను చూడొచ్చట ఇందులో. మరి ఏ ఫ్లాట్ ఫాం ద్వారా రా వెర్షన్ రిలీజవుతుందో సందీప్ ఇంకా చెప్పలేదు.
This post was last modified on April 11, 2022 8:32 pm
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…