అర్జున్ రెడ్డి.. తెలుగు సినిమా చరిత్రలో ఈ సినిమాకో ప్రత్యేక అధ్యాయం కేటాయించాల్సిందే. ఇదొక మోడర్న్ క్లాసిక్, ట్రెండ్ సెట్టర్ అనడంలో సందేహం లేదు. ఇందులోని బోల్డ్నెస్ను ఓ వర్గం ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోవచ్చు కానీ.. కథాకథనాలు, నరేషన్ విషయంలో ఈ చిత్రంతో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాడు కొత్త దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. అది ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసి సెన్సేషనల్ హిట్టయిపోయింది అర్జున్ రెడ్డి.
ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ పెద్ద స్టార్ అయిపోయాడు. ఈ చిత్రంలో విజయ్ పెర్ఫామెన్స్, సందీప్ దర్శకత్వ ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమాను అనుకరిస్తూ తర్వాత ఎన్నో చిత్రాలు వచ్చాయి కానీ.. ఏదీ దాని స్థాయిని అందుకోలేకపోయింది. అర్జున్ రెడ్డిని హిందీలో కబీర్ సింగ్గా రీమేక్ చేస్తే అక్కడా సెన్సేషనల్ హిట్టయింది.
ఈ ఏడాది ఆగస్టు 25కు అర్జున్ రెడ్డి రిలీజై ఐదేళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా అర్జున్ రెడ్డి రా వెర్షన్ను రిలీజ్ చేయబోతున్నట్లు దర్శకుడు సందీప్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఈ సినిమాను ముందు 4 గంటల 20 నిమిషాల నిడివితో తీశాడు సందీప్. తర్వాత దాన్ని 3 గంటల 45 నిమిషాలకు కుదించాడు. కానీ ఈ లెంగ్త్ కూడా చాలా ఎక్కువ అవుతుందని భావించి చివరికి 3 గంటల రన్ టైంతో రిలీజ్ చేశారు. మామూలుగా ఇప్పుడు సినిమాల నిడివి రెండున్నర గంటలకు అటు ఇటు ఉంటోంది. 3 గంటలకే లెంగ్త్ ఎక్కువ అంటారు. అలాంటిది 3 గంటల 45 నిమిషాల రన్ టైం అంటే కష్టమే. అందుకే దాన్ని కుదించాల్సి వచ్చింది.
ఐతే సినిమాను 3.45 గంటల నిడివితో రిలీజ్ చేసి ఉంటే ఇంకా పెద్ద హిట్టయ్యేదని, అర్జున్ రెడ్డి పాత్ర ఇంకా ఇంపాక్ట్ చూపించేదని, అందుకే ఇప్పుడు ఈ సినిమా రా వెర్షన్ను ఐదో వార్షికోత్సవ సందర్భాన రిలీజ్ చేయబోతున్నానని సందీప్ ప్రకటించాడు. అర్జున్ రెడ్డి కాలేజీలో అడుగు పెట్టడానికి ముందు జీవితాన్ని, ఇంకా కొన్ని అదనపు సన్నివేశాలను చూడొచ్చట ఇందులో. మరి ఏ ఫ్లాట్ ఫాం ద్వారా రా వెర్షన్ రిలీజవుతుందో సందీప్ ఇంకా చెప్పలేదు.
This post was last modified on April 11, 2022 8:32 pm
జపాన్ లో సోమవారం భారీ భూకంపం సంభవించింది. జపాన్ లోని ఉత్తర ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో కూడిన…
మొన్న ఏడాది వచ్చిన వరుణ్ తేజ్ 'మట్కా'ని సామాన్య ప్రేక్షకులు మర్చిపోయి ఉండొచ్చు కానీ అభిమానులకు మాత్రం పీడకలలా నిలిచిపోయింది.…
నిన్న కీలకమైన వీకెండ్ పూర్తయ్యింది. శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీ, పాపం ప్రతాప్ ఆశలన్నీ సండే మీద పెట్టుకుని ప్రమోషన్లు…
సమ్మర్ సీజన్ లో ఏప్రిల్ చివరి వారం సినిమాలకు చాలా మంచి టైం. వేసవి పీక్స్ లో ఉండటంతో పాటు…
గంధపు చెక్కల స్మగ్లర్గా.. దేశవ్యాప్తంగా ఒకప్పుడు సంచలనం రేపిన వీరప్పన్ గురించి అందరికీ తెలిసిందే. కర్ణాటక నుంచి తమిళనాడు వరకు…
ఎన్నికల రాజకీయాల్లో ఆరితేరిన ప్రధాని నరేంద్ర మోడీ.. సమయం.. సందర్భంతోపాటు సెంటిమెంటుకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. సాధారణ ప్రజలకు అత్యంతచేరువ…