అర్జున్ రెడ్డి.. తెలుగు సినిమా చరిత్రలో ఈ సినిమాకో ప్రత్యేక అధ్యాయం కేటాయించాల్సిందే. ఇదొక మోడర్న్ క్లాసిక్, ట్రెండ్ సెట్టర్ అనడంలో సందేహం లేదు. ఇందులోని బోల్డ్నెస్ను ఓ వర్గం ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోవచ్చు కానీ.. కథాకథనాలు, నరేషన్ విషయంలో ఈ చిత్రంతో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాడు కొత్త దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. అది ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసి సెన్సేషనల్ హిట్టయిపోయింది అర్జున్ రెడ్డి.
ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ పెద్ద స్టార్ అయిపోయాడు. ఈ చిత్రంలో విజయ్ పెర్ఫామెన్స్, సందీప్ దర్శకత్వ ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమాను అనుకరిస్తూ తర్వాత ఎన్నో చిత్రాలు వచ్చాయి కానీ.. ఏదీ దాని స్థాయిని అందుకోలేకపోయింది. అర్జున్ రెడ్డిని హిందీలో కబీర్ సింగ్గా రీమేక్ చేస్తే అక్కడా సెన్సేషనల్ హిట్టయింది.
ఈ ఏడాది ఆగస్టు 25కు అర్జున్ రెడ్డి రిలీజై ఐదేళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా అర్జున్ రెడ్డి రా వెర్షన్ను రిలీజ్ చేయబోతున్నట్లు దర్శకుడు సందీప్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఈ సినిమాను ముందు 4 గంటల 20 నిమిషాల నిడివితో తీశాడు సందీప్. తర్వాత దాన్ని 3 గంటల 45 నిమిషాలకు కుదించాడు. కానీ ఈ లెంగ్త్ కూడా చాలా ఎక్కువ అవుతుందని భావించి చివరికి 3 గంటల రన్ టైంతో రిలీజ్ చేశారు. మామూలుగా ఇప్పుడు సినిమాల నిడివి రెండున్నర గంటలకు అటు ఇటు ఉంటోంది. 3 గంటలకే లెంగ్త్ ఎక్కువ అంటారు. అలాంటిది 3 గంటల 45 నిమిషాల రన్ టైం అంటే కష్టమే. అందుకే దాన్ని కుదించాల్సి వచ్చింది.
ఐతే సినిమాను 3.45 గంటల నిడివితో రిలీజ్ చేసి ఉంటే ఇంకా పెద్ద హిట్టయ్యేదని, అర్జున్ రెడ్డి పాత్ర ఇంకా ఇంపాక్ట్ చూపించేదని, అందుకే ఇప్పుడు ఈ సినిమా రా వెర్షన్ను ఐదో వార్షికోత్సవ సందర్భాన రిలీజ్ చేయబోతున్నానని సందీప్ ప్రకటించాడు. అర్జున్ రెడ్డి కాలేజీలో అడుగు పెట్టడానికి ముందు జీవితాన్ని, ఇంకా కొన్ని అదనపు సన్నివేశాలను చూడొచ్చట ఇందులో. మరి ఏ ఫ్లాట్ ఫాం ద్వారా రా వెర్షన్ రిలీజవుతుందో సందీప్ ఇంకా చెప్పలేదు.
సనాతన ధర్మం అంటే అదేదో పెద్ద బూతు అన్నట్లుగా కొందరు నాయకులు చేసే కామెంట్లు హిందువులకు తీవ్ర ఆగ్రహమే తెప్పిస్తుంటాయి.…
వైసీపీ అధికారంలో ఉండగా.. ఆపార్టీకి చెందిన నాయకులు అనేక అక్రమాలకు పాల్పడ్డారన్న విమర్శలు ఉన్నాయి. మద్యం నుంచి ఇసుక దాకా,…
పెద్ది ప్రమోషన్లు చివరి స్టేజికి వచ్చేశాయి. ఇంకో వారం కన్నా తక్కువ టైం ఉండటంతో ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ పెరుగుతోంది.…
దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో అధికారం దక్కించుకున్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్.. మరో రాష్ట్రంలో అధికార కూటమిలో భాగస్వామిగా…
రాష్ట్రవ్యాప్తంగా మహానాడు మహా వైభవంగా జరిగింది. ఆన్లైన్ వేదికగా నిర్వహించినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున…
కోలీవుడ్ లో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకోనుంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చివరి సినిమాగా చెప్పబడుతున్న జన నాయగన్…