సినిమా వేడుకలు, ప్రెస్ మీట్లు చాలా వరకు అనుకున్న సమయానికి మొదలు కావు. చెప్పిన టైంకి అతిథులు వచ్చేస్తే వాళ్ల విలువ తగ్గిపోతుందని అనుకుంటారో.. లేక ప్లానింగ్ లోపమో.. లేక ఇంకేవైనా ఇబ్బందులు తలెత్తుతాయో కానీ.. ఆలస్యం షరా మామూలే అన్నట్లు ఉంటుంది. ఐతే ప్రెస్ మీట్లలో మన మీడియాను మన హీరోలు కలిసేటపుడు ఆలస్యం జరిగితే అంతా సర్దుకుంటారు కానీ.. ఒక పరభాషా కథానాయకుడు ప్రెస్ మీట్కు ఒక టైం చెప్పి గంటా రెండు గంటలు ఆలస్యంగా వస్తే మీడియా వాళ్లకు ఆగ్రహం రాక ఎలా ఉంటుంది. ఇప్పుడు విశాఖపట్నంలో ఇదే జరిగింది.
‘కేజీఎఫ్-చాప్టర్ 2’ ప్రమోషన్ల కోసం నిన్నట్నుంచి రెండు తెలుగు గడ్డపై తిరుగుతున్నాడు యశ్. నిన్న ఆల్రెడీ తిరుమల దర్శనం, ఆ తర్వాత ప్రెస్ మీట్ జరిగాయి. సోమవారం విశాఖపట్నం, హైదరాబాద్లలో ప్రెస్ మీట్లు ఏర్పాటు చేశారు. ఐతే వైజాగ్లో ఉదయం 11 గంటలకు ప్రెస్ మీట్ అని చెప్పి.. 12.30కి మొదలుపెట్టారు. గంటన్నర పాటు యశ్ అండ్ టీం కోసం ఎదురు చూడటంతో మీడియా వాళ్లకు కోపం కట్టలు తెంచుకుంది. దీనిపై ఒక విలేకరి యశ్ను నేరుగా ప్రెస్ మీట్లో నిలదీశాడు. గంటన్నర ఆలస్యంగా వస్తే ఎలా అని ప్రశ్నించాడు. దీనికి యశ్ వినమ్రంగా బదులిచ్చాడు.
ప్రెస్ మీట్ ఎన్ని గంటలకు అని తనకు సమాచారం లేదని.. తనను పీఆర్ టీం ఎక్కడికి ఏ సమయానికి తీసుకెళ్తే ఆ టైంకి వస్తున్నానని.. తాము ప్రైవేట్ జెట్స్లో తిరుగుతున్నామని.. వాటికి పర్మిషన్లు రావడం, ఇతర విషయాల్లో ఆలస్యం జరగడం వల్ల ఇలా ప్రెస్ మీట్ టైంకి మొదలు కాకపోయి ఉండొచ్చని.. దీని గురించి తనకు తెలియదని.. ఐతే పది నిమిషాలు ఆలస్యం జరిగి ఉన్నా అది తమ తప్పే అవుతుందని.. అందుకు అందరినీ మనస్ఫూర్తిగా మన్నించాలని కోరుతున్నానని యశ్ వివరణ ఇచ్చాడు.
విశేషం ఏంటంటే.. ‘పుష్ప’ బెంగళూరు ప్రెస్ మీట్లో సరిగ్గా ఇదే జరిగింది. ఆ కార్యక్రమానికి బన్నీ 2-3 గంటలు ఆలస్యంగా వెళ్లడంతో అక్కడి మీడియా వాళ్లు అతణ్ని నిలదీశారు. అందుకు బన్నీ వాళ్లకు క్షమాపణలు చెప్పాడు. ఇప్పుడు ఓ కన్నడ హీరోకు తెలుగు నాట ఈ పరిస్థితి ఎదురవడంతో చెల్లుకు చెల్లు అన్నట్లయింది.
This post was last modified on April 11, 2022 7:03 pm
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…