టాలీవుడ్లో మీడియాకు చాలా దూరంగా ఉండే హీరోల్లో ప్రభాస్ ఒకడు. తన సినిమాలు రిలీజైనపుడు తప్పిస్తే మీడియా ముందుకే రాడు. సోషల్ మీడియాలో తన గురించి, తన సినిమాల గురించి అతను అప్ డేట్లు ఇవ్వడం కూడా అరుదు. ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్లో అకౌంట్లు అయితే ఉన్నాయి కానీ.. అవి నామమాత్రమే.
సినిమాల ముచ్చట్లు చెప్పడమే తక్కువ అంటే.. వ్యక్తిగత విషయాల గురించి అసలే మాట్లాడడు. అలాంటివాడు ఈ రోజు యోగా దినోత్సవం సందర్భంగా కొన్ని ఫొటోలు, ఒక వీడియో రిలీజ్ చేయడంతో అభిమానులు మురిసిపోతున్నారు.
తాను యోగా స్టూడెంట్ అని వెల్లడిస్తూ.. యోగాతో తన అనుభవాలను ఈ వీడియోలో పంచుకున్నాడు ప్రభాస్. రాజమౌళి ఆస్థాన సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ భార్య రుహి ప్రభాస్కు యోగా టీచర్ అట. ఆమె తనకెంతగా సాయం చేసిందో అతను వెల్లడించాడు.
‘బాహుబలి: ది బిగినింగ్’ టైంలో తాను విపరీతంగా అలసిపోయానని.. ఒళ్లు హూనమైందని.. ఆ సమయంలో తాను కోలుకుని.. మళ్లీ షూటింగ్ చేయడానికి రుహినే సహకరించిందని ప్రభాస్ వెల్లడించాడు. ‘బాహుబలి’ రెండో భాగానికి ముందు కూడా విరామంలో తన బాడీని మళ్లీ రెడీ చేసింది ఆమే అన్నాడు.
యోగాతో ఎంతో రిలీఫ్ ఉంటుందని.. ఫిట్గా ఉంటామని.. దాని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ప్రభాస్ చెప్పుకొచ్చాడు. మరోవైపు రుహి సైతం ప్రభాస్ తన బెస్ట్ స్టూడెంట్ అంటూ అతడికి కితాబిచ్చింది.
మోడీ సర్కారు ఎప్పుడూ యోగాను బాగా ప్రమోట్ చేస్తుంటుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుతుంది. ఈసారి కరోనా వల్ల బయట యాక్టివిటీ తక్కువే ఉంది కానీ.. సోషల్ మీడియాలో మాత్రం యోగా ప్రచారం గట్టిగానే జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ తన యోగా అనుభవాల వీడియోను పంచుకున్నాడు.
This post was last modified on June 21, 2020 6:15 pm
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…