టాలీవుడ్లో మీడియాకు చాలా దూరంగా ఉండే హీరోల్లో ప్రభాస్ ఒకడు. తన సినిమాలు రిలీజైనపుడు తప్పిస్తే మీడియా ముందుకే రాడు. సోషల్ మీడియాలో తన గురించి, తన సినిమాల గురించి అతను అప్ డేట్లు ఇవ్వడం కూడా అరుదు. ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్లో అకౌంట్లు అయితే ఉన్నాయి కానీ.. అవి నామమాత్రమే.
సినిమాల ముచ్చట్లు చెప్పడమే తక్కువ అంటే.. వ్యక్తిగత విషయాల గురించి అసలే మాట్లాడడు. అలాంటివాడు ఈ రోజు యోగా దినోత్సవం సందర్భంగా కొన్ని ఫొటోలు, ఒక వీడియో రిలీజ్ చేయడంతో అభిమానులు మురిసిపోతున్నారు.
తాను యోగా స్టూడెంట్ అని వెల్లడిస్తూ.. యోగాతో తన అనుభవాలను ఈ వీడియోలో పంచుకున్నాడు ప్రభాస్. రాజమౌళి ఆస్థాన సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ భార్య రుహి ప్రభాస్కు యోగా టీచర్ అట. ఆమె తనకెంతగా సాయం చేసిందో అతను వెల్లడించాడు.
‘బాహుబలి: ది బిగినింగ్’ టైంలో తాను విపరీతంగా అలసిపోయానని.. ఒళ్లు హూనమైందని.. ఆ సమయంలో తాను కోలుకుని.. మళ్లీ షూటింగ్ చేయడానికి రుహినే సహకరించిందని ప్రభాస్ వెల్లడించాడు. ‘బాహుబలి’ రెండో భాగానికి ముందు కూడా విరామంలో తన బాడీని మళ్లీ రెడీ చేసింది ఆమే అన్నాడు.
యోగాతో ఎంతో రిలీఫ్ ఉంటుందని.. ఫిట్గా ఉంటామని.. దాని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ప్రభాస్ చెప్పుకొచ్చాడు. మరోవైపు రుహి సైతం ప్రభాస్ తన బెస్ట్ స్టూడెంట్ అంటూ అతడికి కితాబిచ్చింది.
మోడీ సర్కారు ఎప్పుడూ యోగాను బాగా ప్రమోట్ చేస్తుంటుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుతుంది. ఈసారి కరోనా వల్ల బయట యాక్టివిటీ తక్కువే ఉంది కానీ.. సోషల్ మీడియాలో మాత్రం యోగా ప్రచారం గట్టిగానే జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ తన యోగా అనుభవాల వీడియోను పంచుకున్నాడు.
సెలబ్రెటీల కుటుంబాల్లో కొందరిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అది ఎప్పుడో కానీ బయటికి రాదు. ఎప్పుడూ మామూలుగా కనిపించే వ్యక్తులు..…
రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…