టాలీవుడ్లో మీడియాకు చాలా దూరంగా ఉండే హీరోల్లో ప్రభాస్ ఒకడు. తన సినిమాలు రిలీజైనపుడు తప్పిస్తే మీడియా ముందుకే రాడు. సోషల్ మీడియాలో తన గురించి, తన సినిమాల గురించి అతను అప్ డేట్లు ఇవ్వడం కూడా అరుదు. ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్లో అకౌంట్లు అయితే ఉన్నాయి కానీ.. అవి నామమాత్రమే.
సినిమాల ముచ్చట్లు చెప్పడమే తక్కువ అంటే.. వ్యక్తిగత విషయాల గురించి అసలే మాట్లాడడు. అలాంటివాడు ఈ రోజు యోగా దినోత్సవం సందర్భంగా కొన్ని ఫొటోలు, ఒక వీడియో రిలీజ్ చేయడంతో అభిమానులు మురిసిపోతున్నారు.
తాను యోగా స్టూడెంట్ అని వెల్లడిస్తూ.. యోగాతో తన అనుభవాలను ఈ వీడియోలో పంచుకున్నాడు ప్రభాస్. రాజమౌళి ఆస్థాన సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ భార్య రుహి ప్రభాస్కు యోగా టీచర్ అట. ఆమె తనకెంతగా సాయం చేసిందో అతను వెల్లడించాడు.
‘బాహుబలి: ది బిగినింగ్’ టైంలో తాను విపరీతంగా అలసిపోయానని.. ఒళ్లు హూనమైందని.. ఆ సమయంలో తాను కోలుకుని.. మళ్లీ షూటింగ్ చేయడానికి రుహినే సహకరించిందని ప్రభాస్ వెల్లడించాడు. ‘బాహుబలి’ రెండో భాగానికి ముందు కూడా విరామంలో తన బాడీని మళ్లీ రెడీ చేసింది ఆమే అన్నాడు.
యోగాతో ఎంతో రిలీఫ్ ఉంటుందని.. ఫిట్గా ఉంటామని.. దాని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ప్రభాస్ చెప్పుకొచ్చాడు. మరోవైపు రుహి సైతం ప్రభాస్ తన బెస్ట్ స్టూడెంట్ అంటూ అతడికి కితాబిచ్చింది.
మోడీ సర్కారు ఎప్పుడూ యోగాను బాగా ప్రమోట్ చేస్తుంటుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుతుంది. ఈసారి కరోనా వల్ల బయట యాక్టివిటీ తక్కువే ఉంది కానీ.. సోషల్ మీడియాలో మాత్రం యోగా ప్రచారం గట్టిగానే జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ తన యోగా అనుభవాల వీడియోను పంచుకున్నాడు.
This post was last modified on June 21, 2020 6:15 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…