టాలీవుడ్లో మీడియాకు చాలా దూరంగా ఉండే హీరోల్లో ప్రభాస్ ఒకడు. తన సినిమాలు రిలీజైనపుడు తప్పిస్తే మీడియా ముందుకే రాడు. సోషల్ మీడియాలో తన గురించి, తన సినిమాల గురించి అతను అప్ డేట్లు ఇవ్వడం కూడా అరుదు. ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్లో అకౌంట్లు అయితే ఉన్నాయి కానీ.. అవి నామమాత్రమే.
సినిమాల ముచ్చట్లు చెప్పడమే తక్కువ అంటే.. వ్యక్తిగత విషయాల గురించి అసలే మాట్లాడడు. అలాంటివాడు ఈ రోజు యోగా దినోత్సవం సందర్భంగా కొన్ని ఫొటోలు, ఒక వీడియో రిలీజ్ చేయడంతో అభిమానులు మురిసిపోతున్నారు.
తాను యోగా స్టూడెంట్ అని వెల్లడిస్తూ.. యోగాతో తన అనుభవాలను ఈ వీడియోలో పంచుకున్నాడు ప్రభాస్. రాజమౌళి ఆస్థాన సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ భార్య రుహి ప్రభాస్కు యోగా టీచర్ అట. ఆమె తనకెంతగా సాయం చేసిందో అతను వెల్లడించాడు.
‘బాహుబలి: ది బిగినింగ్’ టైంలో తాను విపరీతంగా అలసిపోయానని.. ఒళ్లు హూనమైందని.. ఆ సమయంలో తాను కోలుకుని.. మళ్లీ షూటింగ్ చేయడానికి రుహినే సహకరించిందని ప్రభాస్ వెల్లడించాడు. ‘బాహుబలి’ రెండో భాగానికి ముందు కూడా విరామంలో తన బాడీని మళ్లీ రెడీ చేసింది ఆమే అన్నాడు.
యోగాతో ఎంతో రిలీఫ్ ఉంటుందని.. ఫిట్గా ఉంటామని.. దాని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ప్రభాస్ చెప్పుకొచ్చాడు. మరోవైపు రుహి సైతం ప్రభాస్ తన బెస్ట్ స్టూడెంట్ అంటూ అతడికి కితాబిచ్చింది.
మోడీ సర్కారు ఎప్పుడూ యోగాను బాగా ప్రమోట్ చేస్తుంటుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుతుంది. ఈసారి కరోనా వల్ల బయట యాక్టివిటీ తక్కువే ఉంది కానీ.. సోషల్ మీడియాలో మాత్రం యోగా ప్రచారం గట్టిగానే జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ తన యోగా అనుభవాల వీడియోను పంచుకున్నాడు.
This post was last modified on June 21, 2020 6:15 pm
అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అయితే.. ఇప్పటి వరకు చూసింది ఒక లెక్క.. ఇక నుంచి మరో…
ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా మారిన 'డీజే సౌండ్' వ్యవహారం.. కీలక మలుపు తిరిగింది. తాజాగా అనంతపురంలో నిర్వహించిన వినాయక నిమజ్జన…
ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమ అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సినిమా.. ది ప్యారడైజ్. క్వాలిటీ సినిమాలతో పెద్ద స్టార్గా…
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తమ్ముడు అనే బ్రాండ్ నుంచి బయట పడి స్వంతంగా ఇమేజ్ సృష్టించుకునేందుకు కష్టపడుతున్న ఆనంద్…
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హుడేనంటూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ విషయాన్ని అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్…