Movie News

పూజా కుద‌ర‌ద‌న్నాకే ర‌ష్మిక‌

పూజా హెగ్డే.. ఇప్పుడు సౌత్ ఇండియన్ ఫిలిం ఇండ‌స్ట్రీలో ఈమెదే అగ్ర‌స్థానం అతిశ‌యోక్తి కాదు. తెలుగులో ఆమె కొన్నేళ్ల నుంచి నంబ‌ర్ వ‌న్ హీరోయిన్‌గా ఉంటోంది. ఇటీవ‌లే బీస్ట్ లాంటి భారీ చిత్రంతో త‌మిళంలోకి రీఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ సంపాదించుకుంది. గ‌తంలోనే త‌మిళంలోనే మాస్క్ అనే సినిమా చేసిన‌ప్ప‌టికీ.. అప్ప‌టికి ఆమెకు పెద్ద‌గా గుర్తింపు లేదు. ఇప్పుడు ఏకంగా విజ‌య్ సినిమాతో కోలీవుడ్లోకి రీఎంట్రీ ఇచ్చింది.

తెలుగుతో పాటు  హిందీలోనూ పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ తీరిక లేకుండా ఉన్న పూజా.. విజ‌య్ హీరోగా ఇటీవ‌లే మొదలైన కొత్త సినిమాలోనూ క‌థానాయిక‌గా చేయాల్సింద‌ట‌. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముందు అనుకున్న క‌థానాయిక పూజానేన‌ట‌.

కానీ డేట్ల స‌మ‌స్య కార‌ణంగా పూజా ఈ సినిమా చేయ‌లేన‌న‌డంతో ర‌ష్మిక మంద‌న్నను ఎంచుకోవాల్సి వ‌చ్చింద‌ట‌. పూజాతో క‌లిసి బీస్ట్ ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో దిల్ రాజే స్వ‌యంగా ఈ విష‌యాన్ని వెల్ల‌డించాడు. బీస్ట్ చిత్రాన్ని తెలుగులో దిల్ రాజే రిలీజ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

కాగా విజ‌య్-వంశీ క‌ల‌యిక‌లో తెర‌కెక్క‌నున్న సినిమాకు క‌థానాయిక ఎవ‌రు అన్న చ‌ర్చ వ‌చ్చిన‌పుడు పూజాను తీసుకుందామ‌ని తానే సూచించానని, విజ‌య్ కూడా అందుకు సానుకూలంగా స్పందించాడ‌ని, పూజా గురించి బాగా మాట్లాడాడ‌ని, కానీ డేట్లు స‌ర్దుబాటు చేయ‌లేక‌పోవ‌డంతో ఈ సినిమాలో ఆమె భాగం కాలేక‌పోయింద‌ని రాజు తెలిపాడు. రాజు నిర్మించిన దువ్వాడ జ‌గ‌న్నాథంతోనే సౌత్‌లో పూజా ద‌శ తిరిగింది. ఆ త‌ర్వాత ఆయ‌న నిర్మాణంలో వ‌చ్చిన మ‌హ‌ర్షి ఆమె కెరీర్లో అప్ప‌టికి బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.

This post was last modified on April 10, 2022 6:05 pm

Share

Recent Posts

ప్రభాస్ సినిమాల లెక్కలన్నీ తారుమారు

కొన్ని రోజులుగా ఉన్న అనుమానాలు ఈ రోజు మరింత బలపడిపోయాయి. ప్రభాస్ కొత్త సినిమా ‘ఫౌజి’ మరోసారి వాయిదా పడబోతోందని…

44 minutes ago

అమరావతి సౌండ్ లడఖ్ వరకు వెళ్లిందా?

అమరావతి సౌండ్ లడఖ్ వరకు వినిపిస్తోందా..? ఇక్కడి విపక్షానికి మాత్రం అది వినిపించడం లేదా..? అమరావతి రాజధాని అంశానికి సంబంధించిన…

1 hour ago

జనసేనకు 50 నుంచి 60.. బొలిశెట్టి వారి లెక్క‌లు!

జ‌న‌సేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎంత చెబుతున్నా.. కొంద‌రు నాయ‌కులు త‌మ పంథాను మార్చుకోవ‌డం లేదు.…

3 hours ago

ఢిల్లీ అష్ట‌దిగ్భంధం… ఏంటీ `బ్రిక్స్ స‌ద‌స్సు`?

దేశ రాజ‌ధాని ఢిల్లీ.. ఈ నెల 11 నుంచి 14వ తేదీ వ‌ర‌కు పోలీసుల ప‌హారాలో ఉండ‌నుంది. దాదాపు న‌గ‌రం…

7 hours ago

చిన్న శ్రీను శాంపిల్ మాత్ర‌మే.. మ‌రింత మంది సైకిల్ ఎక్కేస్తారా?

వైసీపీకి డేంజ‌ర్ బెల్స్ మోగుతున్నాయా.. ఉత్త‌రాంధ్రలో తాజాగా చోటు చేసుకున్న చిన్న శ్రీను వ్య‌వ‌హారంతో పాటు.. పార్టీలో మ‌రింత మంది…

11 hours ago

ఏఐ వాడకం… ముంచుకొస్తున్న ప్రమాదం

జాంబీ సినిమాలో వైరస్ లాగా ఏఐ వాడకం క్రమంగా టెకీస్ నుంచి సామాన్యుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. ఒకరేమో వారణాసిలో మహేష్…

11 hours ago