పూజా హెగ్డే.. ఇప్పుడు సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఈమెదే అగ్రస్థానం అతిశయోక్తి కాదు. తెలుగులో ఆమె కొన్నేళ్ల నుంచి నంబర్ వన్ హీరోయిన్గా ఉంటోంది. ఇటీవలే బీస్ట్ లాంటి భారీ చిత్రంతో తమిళంలోకి రీఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ సంపాదించుకుంది. గతంలోనే తమిళంలోనే మాస్క్ అనే సినిమా చేసినప్పటికీ.. అప్పటికి ఆమెకు పెద్దగా గుర్తింపు లేదు. ఇప్పుడు ఏకంగా విజయ్ సినిమాతో కోలీవుడ్లోకి రీఎంట్రీ ఇచ్చింది.
తెలుగుతో పాటు హిందీలోనూ పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ తీరిక లేకుండా ఉన్న పూజా.. విజయ్ హీరోగా ఇటీవలే మొదలైన కొత్త సినిమాలోనూ కథానాయికగా చేయాల్సిందట. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముందు అనుకున్న కథానాయిక పూజానేనట.
కానీ డేట్ల సమస్య కారణంగా పూజా ఈ సినిమా చేయలేననడంతో రష్మిక మందన్నను ఎంచుకోవాల్సి వచ్చిందట. పూజాతో కలిసి బీస్ట్ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దిల్ రాజే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. బీస్ట్ చిత్రాన్ని తెలుగులో దిల్ రాజే రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
కాగా విజయ్-వంశీ కలయికలో తెరకెక్కనున్న సినిమాకు కథానాయిక ఎవరు అన్న చర్చ వచ్చినపుడు పూజాను తీసుకుందామని తానే సూచించానని, విజయ్ కూడా అందుకు సానుకూలంగా స్పందించాడని, పూజా గురించి బాగా మాట్లాడాడని, కానీ డేట్లు సర్దుబాటు చేయలేకపోవడంతో ఈ సినిమాలో ఆమె భాగం కాలేకపోయిందని రాజు తెలిపాడు. రాజు నిర్మించిన దువ్వాడ జగన్నాథంతోనే సౌత్లో పూజా దశ తిరిగింది. ఆ తర్వాత ఆయన నిర్మాణంలో వచ్చిన మహర్షి ఆమె కెరీర్లో అప్పటికి బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది.
This post was last modified on April 10, 2022 6:05 pm
ఇటీవలే విడుదలైన కేసరి చాఫ్టర్ 2కి యునానిమస్ గా పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. మూడుకు తక్కువ రేటింగ్స్ దాదాపుగా ఎవరూ…
ఐపీఎల్ 2025లో ఓ మ్యాచ్ ఫలితం చుట్టూ బిగుసుకున్న వివాదం ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతోంది. లక్నో సూపర్ జెయింట్స్తో…
టాలీవుడ్లో బాక్సాఫీస్ స్లంప్ వచ్చినపుడల్లా.. నిర్మాతల దృష్టి రివ్యూల మీద పడుతోంది. సినిమాలు దెబ్బ తినడానికి రివ్యూలే కారణమంటూ వాటి…
ఇంకో శుక్రవారం వచ్చేస్తోంది. లాస్ట్ వీక్ భారీ అంచనాల మధ్య వచ్చిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి, ఓదెల 2 ఆశించిన…
ఇంకో ఎనిమిది రోజుల్లో విడుదల కాబోతున్న హిట్ 3 ది థర్డ్ కేస్ కోసం నాని చేస్తున్న ప్రమోషన్లు జాతీయ…
సీనియర్ ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ మాజీ చీప్ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టుపై విపక్ష వైసీపీ ఘాటుగా స్పందించింది. ఈ మేరకు వైసీపీ కీలక…