బాహుబలి రిలీజైనపుడు బాలీవుడ్లో హంగామా మామూలుగా లేదు. తమ సొంత సినిమా స్థాయిలో బాలీవుడ్ ప్రముఖులు ఆ చిత్రాన్ని ప్రమోట్ చేశారు. ఆహా ఓహో అని అక్కడి ప్రముఖులందరూ సినిమాను కొనియాడారు. ముఖ్యంగా బాహుబలి: ది కంక్లూజర్ రిలీజైనపుడైతే హడావుడి మామూలుగా లేదు. ఇది తెలుగు సినిమా అన్న తలపే అక్కడి వాళ్లెవ్వరికీ కలగలేదు.
తామే ఆ సినిమా తీసిన స్థాయిలో దాన్ని బాలీవుడ్ జనాలు మోశారు. కానీ ఆర్ఆర్ఆర్ విషయానికి వచ్చేసరికి బాలీవుడ్ సైలెంటైపోయింది. బాహుబలి స్థాయిలో కాకపోయినా ఆర్ఆర్ఆర్ సైతం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. ఉత్తరాది ప్రేక్షకులను మెప్పించి ఇప్పటికే రూ.200 కోట్లకు పైగా నెట్ వసూళ్లు రాబట్టింది. కానీ ఈ సినిమా సక్సెస్ను గుర్తించడానికి బాలీవుడ్ వెనుకడుగు వేస్తోంది.
ఈ సినిమా గురించి ఏ బాలీవుడ్ సెలబ్రెటీ మాట్లాడట్లేదు. తాజాగా నిర్వహించిన సక్సెస్ పార్టీకి కొందరు ప్రముఖులను పిలిచినా రాలేదని తెలుస్తోంది. మరి బాహుబలికి, ఆర్ఆర్ఆర్కు తేడా ఏంటి అంటే.. కరణ్ జోహార్. బాహుబలిలో పార్ట్నర్గా మారి ఆ సినిమాను ఉత్తరాదిన ఓ రేంజిలో ప్రమోట్ చేశాడు. బాలీవుడ్ ప్రముఖులందరితోనూ ఈ సినిమా గురించి ట్వీట్లు వేయించాడు. ముంబయిలో ప్రమోషన్ల హంగామా మామూలుగా లేదు. సెలబ్రెటీలకు స్పెషల్ షోలు కూడా వేయించి సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాడు.
ఐతే కరణ్తో ఈసారి రాజమౌళి ఎందుకు జట్టు కట్టలేదో ఏమో తెలియదు మరి. ఆర్ఆర్ఆర్ను జయంతిలాల్ గద రిలీజ్ చేశారు. దీంతో ఈసారి ఆర్ఆర్ఆర్కు సెలబ్రెటీల సపోర్ట్ దక్కలేదు. ప్రమోషన్స్ పరంగా ఈ సినిమా పెద్ద ఇంపాక్ట్ వేయలేకపోయింది. ఈ సినిమాలో నటించిన అజయ్ దేవగణ్, ఆలియా భట్ కూడా అంటీ ముట్టనట్లే ఉండిపోయారు. పెద్దగా ప్రమోషన్లు చేసింది లేదు. ఒకవేళ కరణ్ కనుక ఈ సినిమాలోనూ భాగస్వామి అయి ఉంటే ప్రమోషన్ల మోత మోగేది. వసూళ్ల మీద కూడా ఆ ప్రభావం ఉండేది. సినిమా ఇంకా పెద్ద సక్సెస్ అయ్యేదేమో.
This post was last modified on April 8, 2022 9:30 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…