నందమూరి బాలకృష్ణ ఇటీవలే 60వ పుట్టిన రోజు జరుపుకున్నారు. కరోనా-లాక్ డౌన్ వల్ల సంబరాల్లో కళ తగ్గింది కానీ.. లేదంటే హంగామా ఒక రేంజిలో ఉండేదే. సోషల్ మీడియాలో మాత్రం బాలయ్య పుట్టిన రోజు హడావుడిగా బాగానే కనిపించింది.
సమయానికి బోయపాటి సినిమా టీజర్ కూడా రావడంతో అభిమానులు సోషల్ మీడియాను బాలయ్య ట్వీట్లతో హోరెత్తించారు. ఐతే బాలయ్య బర్త్ డేకు సంబంధించిన ఇప్పుడు ఓ అరుదైన రికార్డు అభిమానుల్ని సంతోషంలో ముంచెత్తుతోంది.
ఆ రోజు ఒకే సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 21 వేల మంది బాలయ్య పుట్టిన రోజును పురస్కరించుకుని కేక్ కట్ చేశారట. జూన్ 10న ఉదయం 10 గంటల 10 నిమిషాలకు ఇది జరిగిందట. ఇది ప్రపంచ రికార్డు కావడం విశేషం. ఈ ఘనత గిన్నిస్ బుక్తో పాటు వండర్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకి కూడా ఎక్కిందట.
ఒక వ్యక్తి పుట్టిన రోజును పురస్కరించుకుని ఇంత ఎక్కువమంది ఒకేసారి ఆర్గనైజ్డ్గా ఒకే సమయానికి కేక్ కట్ చేయడం ప్రపంచంలో ఇంతకుముందు ఎన్నడూ జరగలేదు. గత రికార్డును తెలుసుకుని ముందే బాలయ్య అభిమానులు రికార్డు కోసం ప్రయత్నించారు.
ముందే గిన్నిస్ రికార్డు, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు వాళ్లకు సమాచారం ఇచ్చి ఈ రికార్డును డాక్యుమెంట్ చేయించారు. ఆ రెండు సంస్థల ప్రతినిధులు రికార్డును ధ్రువీకరించడమే కాక త్వరలోనే సర్టిఫికెట్లు కూడా జారీ చేయబోతున్నారు. దీనిపై బాలయ్య సైతం స్పందించాడు.
రికార్డు విషయమై అభిమానుల్ని అభినందించాడు. బాలయ్య వీరాభిమాని అనంతపురం జగన్ వరల్డ్ వైడ్ ఫ్యాన్స్తో కో ఆర్డినేట్ చేసుకుంటూ ఈ ఘనతను పూర్తి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. కరోనా-లాక్డౌన్ వల్ల బాలయ్య షష్టిపూర్తి వేడుకల కళ తగ్గిందని కొంచెం ఫీలైన అభిమానులకు ఈ రికార్డులు అమితానందాన్నిచ్చేవే.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…