ఆర్ఆర్ఆర్ తెలుగు రాష్ట్రాల వరకు ప్రభంజనమే సృష్టించింది. ముందు నుంచి ఏపీ, తెలంగాణల్లో ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. ప్రి రిలీజ్ హైప్ చూస్తే బాహుబలికి దీటుగా కనిపించింది. కానీ తెలుగు రాష్ట్రాల అవతల మాత్రం ఈ సినిమాపై హైప్ అంతగా కనిపించలేదు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అంతంతమాత్రంగా కనిపించాయి. నార్త్ ఇండియాలో అయితే ఈ సినిమా పట్ల ఆసక్తి లేనట్లే కనిపించారు. కానీ రిలీజ్ తర్వాత పరిస్థితి మారింది.
తొలి రోజు ఓ మోస్తరు వసూళ్లతో మొదలైన ఆర్ఆర్ఆర్ ఆ తర్వాత బలంగా పుంజుకుంది. దక్షిణాదిన మిగతా రాష్ట్రాల్లోనూ మంచి వసూళ్లే రాబట్టింది. అన్ని చోట్లా సినిమా లాభాల బాటలో సాగుతోంది. విడుదల ముంగిట డల్ బుకింగ్స్, తొలి రోజు డివైడ్ టాక్ చూసి కంగారు పడ్డా.. తర్వాత అంతా సానుకూలంగానే జరిగింది. తెలుగు రాష్ట్రాల అవతల రికార్డులేమీ బద్దలు కాలేదు కానీ.. బయ్యర్లంతా సేఫ్ అయిపోయారు.
ఐతే వచ్చే వారం విడుదల కానున్న కేజీఎఫ్-2 సినిమాకు దేశవ్యాప్తంగా హైప్ మామూలుగా లేదు. ఆర్ఆర్ఆర్ కర్ణాటకలో వసూలు చేసినదానికంటే.. కేజీఎఫ్-2 తెలుగు రాష్ట్రాల్లో కలెక్ట్ చేయబోయే మొత్తం ఎక్కువగా, భారీగా ఉండబోతోంది. ఇక నార్త్ ఇండియాలో ఈ సినిమాకు క్రేజ్ మామూలుగా లేదన్నది ట్రేడ్ వర్గాల మాట. ఇప్పటికే అక్కడ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు కాక.. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.
ఇక సొంత రాష్ట్రం కర్ణాటకలో ఎలాగూ కేజీఎఫ్-2 వసూళ్ల మోత మోగించడం ఖాయం. ఇక దక్షిణాదిన మిగతా రాష్ట్రాలైన తమిళనాడు, కేరళల్లోనూ ఈ చిత్రానికి మంచి హైపే ఉంది. బాలీవుడ్ ట్రేడ్ పండిట్ల అంచనాల ప్రకారం కరోనా తర్వాత హిందీ మార్కెట్లో అత్యధిక తొలి రోజు వసూళ్లు సాధించబోయే సినిమాగా కేజీఎఫ్-2 నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. తొలి రోజు నార్త్ మార్కెట్లో ఈ సినిమా రూ.35-40 కోట్ల నెట్ వసూళ్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ హిందీలో తొలి రోజు రూ.19 కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే.
This post was last modified on April 8, 2022 5:25 pm
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…