పెద్ద సినిమాలకు తెలంగాణలో వారం పది రోజుల పాటు టికెట్ల రేట్లు పెంచడం మామూలైపోయింది. సాధారణంగానే తెలంగాణలో టికెట్ల ధరలు పెరిగాయి. అవే భారం అనుకుంటుంటే.. పెద్ద సినిమాలకు ఈ అదనపు పెంపుతో టికెట్ల రేట్లు తడిసి మోపెడవుతున్నాయి. మధ్యలో ఆంధ్రప్రదేశ్లో టికెట్ల ధరలు తగ్గగా.. ఇటీవల అవి పెరిగి మునుపటి స్థాయికి చేరుకున్నాయి. అక్కడ కూడా పెద్ద సినిమాలకు రేట్లు పెంచుకునే సౌలభ్యం కల్పిస్తున్నారు. ఇందుకు కొన్ని నిబంధనలు కూడా పెట్టారు.
ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాకు రేట్ల పెంపు మరీ ఎక్కువగా ఉండి ప్రేక్షకుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. అయినా ఆ సినిమాకున్న క్రేజ్ దృష్ట్యా ఆ రేట్లు చెల్లిపోయాయి. ఈ వారం రిలీజవతున్న గనికి రేట్లు పెంచుకుంటే అసలుకే మోసం వస్తుందని సాధారణ ధరలతోనే ముందుకెళ్తున్నారు.
కాగా వచ్చే వారం రిలీజయ్యే ఓ డబ్బింగ్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రేట్ల పెంపు దిశగా గట్టి ప్రయత్నాలే జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఆ చిత్రం.. కేజీఎఫ్-2 అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మూడేళ్ల కిందట సంచలన విజయం సాధించిన కేజీఎఫ్-చాప్టర్ 1కు కొనసాగింపుగా వస్తున్న చాప్టర్-2పై అంచనాలు మామూలుగా లేవు. ఈ క్రేజ్ను క్యాష్ చేసుకోవడానికి తెలుగు నిర్మాత సాయి కొర్రపాటి, డిస్ట్రిబ్యూటర్లు ప్రభుత్వ పెద్దల్ని కలుస్తున్నట్లు తెలిసింది.
ఈ చిత్రంపై బయ్యర్లు భారీ పెట్టుబడులే పెట్టారు. ఆ మొత్తాలు రికవర్ చేసుకోవాలంటే రేట్లు పెంచాల్సిందే. కానీ మన నిర్మాతలు తీసే సినిమాలకు రేట్లు పెంచితే ఓకే కానీ.. వేరే భాషలో తెరకెక్కిన చిత్రాన్ని ఆ నిర్మాత భారీ రేట్లకు అమ్మడం, మన వాళ్లు కొనడం, ఇప్పుడు టికెట్ల రేట్లు పెంచి ప్రేక్షకుల జేబులకు చిల్లు పెట్టాలని చూడటం ఎంత వరకు సమంజసం అన్నది ప్రశ్న?
This post was last modified on April 8, 2022 2:41 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…