ఆర్ఆర్ఆర్ సీక్వెల్.. ఆర్ఆర్ఆర్ సీక్వెల్.. కొన్ని రోజుల నుంచి ఇదే చర్చ. ‘ఆర్ఆర్ఆర్’ రచయిత విజయేంద్ర ప్రసాద్.. ఈ చిత్రానికి సీక్వెల్ తీసే అవకాశాలున్నట్లు చిన్న సంకేతం ఇవ్వడంతో దీని గురించి తెగ మాట్లాడేసుకుంటున్నారు జనాలు. ఈ చిత్రానికి ఇంకో పార్ట్ తీస్తే కథ ఎలా ఉంటుందనే విషయంలోనూ ఊహాగానాలు నడిచిపోతున్నాయి. ఐతే నిజంగా ఈ సినిమాకు ఇంకో భాగం తీసే అవకాశం ఉందా అంటే ఔనని గట్టిగా చెప్పలేం.
ఇందుకు పరిస్థితులు సహకరించేలా లేవు. ‘బాహుబలి’ రెండో భాగం కోసం ఉత్కంఠగా ఎదురు చూసినట్లు ఆర్ఆర్ఆర్-2పై ఆసక్తి ప్రదర్శించడానికి కారణాలేవీ కనిపించవు. అసలు ‘ఆర్ఆర్ఆర్’ కథ, ఇందులోని లీడ్ క్యారెక్టర్స్ విషయంలోనే చాలామంది అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ ఎంత కలెక్షన్ల మోత మోగించినా.. ‘బాహుబలి’కి వచ్చినట్లు యూనివర్శల్ అప్లాజ్ అయితే ఈ సినిమాకు రాలేదు. పలు విషయాల్లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.కథ లాజికల్గా లేదని, మనసుకు హత్తుకోలేదని, ఎమోషన్లు అనుకున్న స్థాయిలో పండలేదని, అల్లూరి-కొమరం భీం పాత్రల్ని బలవంతంగా కలిపినట్లుందని.. ఇలా రకరకాల వ్యాఖ్యానాలు వినిపించాయి.
ఫస్ట్ పార్ట్ కథే పూర్తి సంతృప్తినివ్వనపుడు.. ఈ కథను పొడిగిస్తే జనామోదం లభిస్తుందా అన్నది సందేహమే. మరోవైపు రాజమౌళితో పాటు హీరోలకు ఉన్న కమిట్మెంట్ల ప్రకారం చూసినా.. మళ్లీ ‘ఆర్ఆర్ఆర్-2’ అని చెప్పి ఇంకో మూణ్నాలుగేళ్లు ఈ సినిమాపై ఖర్చు పెట్టే పరిస్థితి కనిపించడం లేదు. జక్కన్న ముందు మహేష్తో సినిమా చేయాలి. దీనికి రెండు మూడేళ్లు పడుతుంది. ఆ తర్వాత అల్లు అర్జున్తో ఓ సినిమా చేస్తాడని అంటున్నారు.
ఈలోపు ఎప్పట్నుంచో ఆయన కోసం ఎదురు చూస్తున్న ‘మహాభారతం’ ఉండనే ఉంది. మహేష్ సినిమా రిలీజయ్యే సమయానికే ఆ కలల ప్రాజెక్టుకు రాజమౌళి చెప్పిన పదేళ్ల అనుభవం వచ్చేసినట్లవుతుంది. ఇక మహాభారతానికి స్క్రిప్టు రాయాలంటే విజయేంద్ర ప్రసాదే రాయాలి. ‘ఆర్ఆర్ఆర్-2’ కోసం మధ్యలో ఇంకో మూడేళ్ల పాటు అందరూ సమయం పెట్టే పరిస్థితి ఎంతమాత్రం కనిపించడం లేదు. కేవలం ఊరికే ప్రస్తుతం సినిమా పబ్లిసిటీ కోసం ఈ ఎత్తుగడ వేసి ఉండొచ్చని భావించవచ్చు.
This post was last modified on April 6, 2022 5:34 pm
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ డిమాండ్…