ఆర్ఆర్ఆర్ సీక్వెల్.. ఆర్ఆర్ఆర్ సీక్వెల్.. కొన్ని రోజుల నుంచి ఇదే చర్చ. ‘ఆర్ఆర్ఆర్’ రచయిత విజయేంద్ర ప్రసాద్.. ఈ చిత్రానికి సీక్వెల్ తీసే అవకాశాలున్నట్లు చిన్న సంకేతం ఇవ్వడంతో దీని గురించి తెగ మాట్లాడేసుకుంటున్నారు జనాలు. ఈ చిత్రానికి ఇంకో పార్ట్ తీస్తే కథ ఎలా ఉంటుందనే విషయంలోనూ ఊహాగానాలు నడిచిపోతున్నాయి. ఐతే నిజంగా ఈ సినిమాకు ఇంకో భాగం తీసే అవకాశం ఉందా అంటే ఔనని గట్టిగా చెప్పలేం.
ఇందుకు పరిస్థితులు సహకరించేలా లేవు. ‘బాహుబలి’ రెండో భాగం కోసం ఉత్కంఠగా ఎదురు చూసినట్లు ఆర్ఆర్ఆర్-2పై ఆసక్తి ప్రదర్శించడానికి కారణాలేవీ కనిపించవు. అసలు ‘ఆర్ఆర్ఆర్’ కథ, ఇందులోని లీడ్ క్యారెక్టర్స్ విషయంలోనే చాలామంది అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ ఎంత కలెక్షన్ల మోత మోగించినా.. ‘బాహుబలి’కి వచ్చినట్లు యూనివర్శల్ అప్లాజ్ అయితే ఈ సినిమాకు రాలేదు. పలు విషయాల్లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.కథ లాజికల్గా లేదని, మనసుకు హత్తుకోలేదని, ఎమోషన్లు అనుకున్న స్థాయిలో పండలేదని, అల్లూరి-కొమరం భీం పాత్రల్ని బలవంతంగా కలిపినట్లుందని.. ఇలా రకరకాల వ్యాఖ్యానాలు వినిపించాయి.
ఫస్ట్ పార్ట్ కథే పూర్తి సంతృప్తినివ్వనపుడు.. ఈ కథను పొడిగిస్తే జనామోదం లభిస్తుందా అన్నది సందేహమే. మరోవైపు రాజమౌళితో పాటు హీరోలకు ఉన్న కమిట్మెంట్ల ప్రకారం చూసినా.. మళ్లీ ‘ఆర్ఆర్ఆర్-2’ అని చెప్పి ఇంకో మూణ్నాలుగేళ్లు ఈ సినిమాపై ఖర్చు పెట్టే పరిస్థితి కనిపించడం లేదు. జక్కన్న ముందు మహేష్తో సినిమా చేయాలి. దీనికి రెండు మూడేళ్లు పడుతుంది. ఆ తర్వాత అల్లు అర్జున్తో ఓ సినిమా చేస్తాడని అంటున్నారు.
ఈలోపు ఎప్పట్నుంచో ఆయన కోసం ఎదురు చూస్తున్న ‘మహాభారతం’ ఉండనే ఉంది. మహేష్ సినిమా రిలీజయ్యే సమయానికే ఆ కలల ప్రాజెక్టుకు రాజమౌళి చెప్పిన పదేళ్ల అనుభవం వచ్చేసినట్లవుతుంది. ఇక మహాభారతానికి స్క్రిప్టు రాయాలంటే విజయేంద్ర ప్రసాదే రాయాలి. ‘ఆర్ఆర్ఆర్-2’ కోసం మధ్యలో ఇంకో మూడేళ్ల పాటు అందరూ సమయం పెట్టే పరిస్థితి ఎంతమాత్రం కనిపించడం లేదు. కేవలం ఊరికే ప్రస్తుతం సినిమా పబ్లిసిటీ కోసం ఈ ఎత్తుగడ వేసి ఉండొచ్చని భావించవచ్చు.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…