హైదరాబాద్లో సంచలనం రేపిన రేవ్ పార్టీ వ్యవహారంలో తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ తనయుడు, మహేష్ బాబు మేనల్లుడు అయిన గల్లా అశోక్ పేరు కూడా వినిపించడం తెలిసిందే. బంజారాహిల్స్లోని పబ్పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి అదుపులోకి తీసుకున్న వారిలో అశోక్ కూడా ఉన్నట్లు వార్తలొచ్చాయి. ఐతే ఈ ప్రచారాన్ని కొన్ని గంటల్లోనే గల్లా కుటుంబం ఖండించింది.
అశోక్కు ఈ వ్యవహారంతో సంబంధమే లేదని వివరణ ఇచ్చింది. అయినా సరే ఈ ప్రచారం ఆగలేదు. ఈ నేపథ్యంలో గల్లా అశోక్ స్వయంగా మీడియాకు వివరణ ఇచ్చాడు. ఏప్రిల్ 5న తన పుట్టిన రోజు నేపథ్యంలో మీడియాను కలిసిన అతను.. ఈ రేవ్ పార్టీ గొడవపైనా మాట్లాడాడు. పబ్ ఇష్యూలో మీ పేరు కూడా వినిపించింది. అప్పుడెలా అనిపించింది అని మీడియా వాళ్లు ప్రశ్నించగా.. ‘‘ఆరోజు రాత్రి నేను ఫిజియో థెరపీ చేయించుకుంటున్నాను. సడన్గా వార్తల్లో నా పేరు ఎలా వచ్చిందో తెలీదు. అప్పుడు నిజంగా నాకు హీరో అనే ఫీలింగ్ కలిగింది. సెలబ్రిటీ లైఫ్లో ఉంటే ఇలానే రూమర్లు వస్తుంటాయనిపించింది అని అశోక్ తెలిపాడు.
ఇక తన కెరీర్ గురించి అశోక్ మాట్లాడుతూ.. తొలి చిత్రం హీరో పూర్తి సంతృప్తినివ్వలేదన్నట్లు మాట్లాడాడు. కరోనా కారణంగా సంక్రాంతి టైంలో థియేటర్లకు రావాల్సిన స్థాయిలో క్రౌడ్ రాలేదని, దాని వల్ల సినిమాకు కొంత నష్టం జరిగిందని చెప్పాడు.
ఐతే ఈ సినిమా నటుడిగా తనకు మంచి అనుభవం అని, హీరో చూసిన మహేష్ బాబు తనను చూసి గర్విస్తున్నట్లు చెప్పాడని.. తర్వాత ఇంకేవో మాటలు అన్నా కూడా ఆ ఒక్క మాట దగ్గర తాను ఆగిపోయానని అశోక్ చెప్పాడు. మహేష్ సినిమాల్లో రీమేక్ చేయాల్సి వస్తే మురారి మూవీ చేయాలనుకుంటున్నట్లు అశోక్ తెలిపాడు.
This post was last modified on April 5, 2022 9:59 am
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ కీలక కేసు విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యక్తి చనిపోయిన తర్వాత.. కేసును…
టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…