తెలుగు సినిమా చరిత్రలోనే మెగాస్టార్ చిరంజీవితో మరే హీరోనూ పోల్చడానికి వీల్లేదు. ఆయనలా ఏ రసాన్నయినా అద్భుతంగా పండించగల ఆల్ రౌండర్ మరొకరు లేరు అంటే అతిశయోక్తి కాదు. ఐతే ఈ మధ్య అల్లు అర్జున్ అభిమానులు.. తమ హీరోను చిరుతో పోలుస్తున్నారు. కొత్త మెగాస్టార్ అని కొనియాడుతున్నారు. అల వైకుంఠపురములో, పుష్ప సినిమాలతో భారీ విజయాలందుకుని తిరుగులేని స్థాయిని అందుకున్న నేపథ్యంలో వాళ్లు బన్నీని ఆకాశానికెత్తేస్తున్నారు.
అత్యుత్సాహంతో బన్నీ పేరు ముందు ‘మెగాస్టార్’ అని కూడా జోడించేశారు కొందరు ఫ్యాన్స్. ఆ మధ్య ‘ఆహా’ ఓటీటీ వాళ్లు కూడా బన్నీ పేరు ముందు ‘మెగాస్టార్’ పెట్టడం వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బన్నీ అన్నయ్య అల్లు బాబీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరుతో బన్నీకి పోలిక పెట్టడం గురించి స్పందించారు.చిరుతో బన్నీకి పోలిక గురించి ప్రశ్నిస్తే.. ‘‘నేను ఎప్పటికీ చిరంజీవి గారిని, అల్లు అర్జున్ను పోల్చి చూడను. అలా పోల్చి చూడటం సరైన పద్ధతి కాదు. ఎందుకంటే చిరంజీవి గారు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా పరిశ్రమలోకి అడుగు పెట్టి.. ఎన్నో కష్టాలు ఎదుర్కొని మెగాస్టార్ అయ్యారు.
ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు. బన్నీ అలా కాదు. తన వెనుక మా నాన్న, తాతయ్య ఉన్నారు. మరో విషయం ఏంటంటే.. మా కుటుంబంలో ఎంతోమందికి చిరంజీవి గారుస్ఫూర్తి. బన్నీ కూడా తనకు చిరునే స్ఫూర్తి అని ఎన్నోసార్లు చెప్పాడు. మనలో స్ఫూర్తి నింపిన వ్యక్తితో మనం ఎప్పటికీ పోల్చుకోకూడదు’’ అని బాబీ అన్నాడు.
ఇక బన్నీ కెరీర్ గురించి అడిగితే.. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా తర్వాత బన్నీ ఎంతో పరిణతి చెందాడని.. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ సినిమా పరాజయం పాలయ్యాక రెండేళ్లు గ్యాప్ తీసుకుని, ప్రేక్షకులు తన నుంచి ఎలాంటి సినిమాలు కోరుకుంటున్నారు.. ఎలాంటి కథలు చేయాలని.. అని పున:పరిశీలన చేసుకున్నాడని.. దాని ఫలితమే ‘అల వైకుంఠపురములో’లో అంత పెద్ద విజయం దక్కిందని బాబీ విశ్లేషించాడు.
This post was last modified on April 3, 2022 10:20 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…