‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ ‘ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్’ అనే హోదాను అనుభవిస్తున్నాడు కానీ.. అంతకుముందు మాత్రం ఆమిర్ ఖాన్దే ఈ స్థానం. ప్రభాస్ అయినా రాజమౌళి అండతో అనుకోకుండా పెద్ద స్టార్ అయిపోయాడు కానీ.. ఆమిర్ ఖాన్ అలా కాదు. నిలకడగా విజయాలు సాధిస్తూ, డైరెక్టర్ ఎవరన్నది సంబంధం లేకుండా రికార్డులు బద్దలు కొడుతూ.. తన సినిమాలతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ స్థాయిని పెంచుతూ తన పేరు చూసి కోట్లాది మంది థియేటర్లకు వచ్చేలా ఇమేజ్ పెంచుకుంటూ ఆ స్థాయిని అందుకున్నాడు.
ఆయనతో సినిమా చేయాలని ఇండియాలో ప్రతి దర్శకుడూ ఆశిస్తాడంటే అతిశయోక్తి కాదు. అలాంటి దర్శకుడు ఒక సౌత్ డైరెక్టర్ని తనతో సినిమా చేయమని అడిగితే.. అతను కాదంటాడని ఎవరైనా అనుకుంటారా? కానీ మన దర్శక ధీరుడు రాజమౌళి.. ఆమిర్ అంతటి వాడికి ‘నో’ చెప్పాడట. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి స్థాయి అమాంతం పెరిగిపోయిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆమిర్.. రాజమౌళితో పని చేయాలనుకున్నాడట. ఆయనతో మహాభారత గాథను తెరకెక్కించాలన్నది ఆమిర్ ఆలోచన. ఇందుకోసం ముందుగా విజయేంద్ర ప్రసాద్నే సంప్రదించాడట ఆమిర్. మహాభారతం మీద సినిమాకు స్క్రిప్టు రాయమని అడిగితే..ఈ కథను సినిమాగా తీయాలంటే ఆరేడు భాగాలుగా తీయాల్సి ఉంటుందని, ఐతే మొత్తం స్క్రిప్టును తాను రాయలేనని.. వేరే కమిట్మెంట్ల వల్ల తనకు అంత సమయం లేదని.. ఐతే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీస్తే బాగుంటుందో ఒక ఔట్ లైన్ గీసి.. ఓవరాల్ కథ వరకు రాసి పెడతానని.. పూర్తి స్థాయి స్క్రిప్టును వేరే వాళ్లతో రాయించుకోవాలని తాను ఆమిర్కు చెప్పానని విజయేంద్ర వెల్లడించారు.
ఇక ఈ సినిమాను డైరెక్ట్ చేయాలని ఆమిర్.. రాజమౌళిని అడగ్గా, తాను స్వయంగా మహాభారత గాథను తెరకెక్కించాలని అనుకుంటున్నానని, అందుకు ఇంకా సమయం పడుతుందని, మధ్యలో తనకు వేరే కమిట్మంట్లు ఉన్నాయని చెప్పి ఆమిర్ ఆఫర్ను రాజమౌళి సున్నితంగా తిరస్కరించినట్లు విజయేంద్ర తెలిపారు.
This post was last modified on April 3, 2022 6:33 pm
https://www.youtube.com/watch?v=hFNCZ_oVOZ4 ఏడాదిన్నరగా కళ్యాణ్ రామ్ కు గ్యాప్ వచ్చేసింది. డెవిల్ తర్వాత ఆచితూచి అడుగులు వేస్తున్న ఈ నందమూరి హీరో…
ఒకపక్క కామెడీ వేషాలు ఇంకోవైపు విలన్ పాత్రలు వేసుకుంటూ సెకండ్ ఇన్నింగ్స్ బ్రహ్మాండంగా నడిపిస్తున్న సునీల్ కు కోలీవుడ్ లో…
అంతా అనుకున్నట్టే అయ్యింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండానే జనసేన ఓ మునిసిపాలిటీని తన ఖాతాలో వేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా…
తమిళ జనాలకు మహేంద్రసింగ్ ధోని అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐపీఎల్ ఆరంభం నుంచి ఆ జట్టుకు…
తమిళంలో ఆ మధ్య పెరుసు అనే సినిమా రిలీజయ్యింది. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడింది. తెలుగు డబ్బింగ్ తో పాటు…
గత ఏడాది టీజర్ కొచ్చిన నెగటివ్ రెస్పాన్స్ దెబ్బకు వీడియో ప్రమోషన్లకు దూరంగా ఉన్న విశ్వంభర ఎట్టకేలకు ఇవాళ హనుమాన్…