‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ ‘ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్’ అనే హోదాను అనుభవిస్తున్నాడు కానీ.. అంతకుముందు మాత్రం ఆమిర్ ఖాన్దే ఈ స్థానం. ప్రభాస్ అయినా రాజమౌళి అండతో అనుకోకుండా పెద్ద స్టార్ అయిపోయాడు కానీ.. ఆమిర్ ఖాన్ అలా కాదు. నిలకడగా విజయాలు సాధిస్తూ, డైరెక్టర్ ఎవరన్నది సంబంధం లేకుండా రికార్డులు బద్దలు కొడుతూ.. తన సినిమాలతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ స్థాయిని పెంచుతూ తన పేరు చూసి కోట్లాది మంది థియేటర్లకు వచ్చేలా ఇమేజ్ పెంచుకుంటూ ఆ స్థాయిని అందుకున్నాడు.
ఆయనతో సినిమా చేయాలని ఇండియాలో ప్రతి దర్శకుడూ ఆశిస్తాడంటే అతిశయోక్తి కాదు. అలాంటి దర్శకుడు ఒక సౌత్ డైరెక్టర్ని తనతో సినిమా చేయమని అడిగితే.. అతను కాదంటాడని ఎవరైనా అనుకుంటారా? కానీ మన దర్శక ధీరుడు రాజమౌళి.. ఆమిర్ అంతటి వాడికి ‘నో’ చెప్పాడట. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి స్థాయి అమాంతం పెరిగిపోయిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆమిర్.. రాజమౌళితో పని చేయాలనుకున్నాడట. ఆయనతో మహాభారత గాథను తెరకెక్కించాలన్నది ఆమిర్ ఆలోచన. ఇందుకోసం ముందుగా విజయేంద్ర ప్రసాద్నే సంప్రదించాడట ఆమిర్. మహాభారతం మీద సినిమాకు స్క్రిప్టు రాయమని అడిగితే..ఈ కథను సినిమాగా తీయాలంటే ఆరేడు భాగాలుగా తీయాల్సి ఉంటుందని, ఐతే మొత్తం స్క్రిప్టును తాను రాయలేనని.. వేరే కమిట్మెంట్ల వల్ల తనకు అంత సమయం లేదని.. ఐతే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీస్తే బాగుంటుందో ఒక ఔట్ లైన్ గీసి.. ఓవరాల్ కథ వరకు రాసి పెడతానని.. పూర్తి స్థాయి స్క్రిప్టును వేరే వాళ్లతో రాయించుకోవాలని తాను ఆమిర్కు చెప్పానని విజయేంద్ర వెల్లడించారు.
ఇక ఈ సినిమాను డైరెక్ట్ చేయాలని ఆమిర్.. రాజమౌళిని అడగ్గా, తాను స్వయంగా మహాభారత గాథను తెరకెక్కించాలని అనుకుంటున్నానని, అందుకు ఇంకా సమయం పడుతుందని, మధ్యలో తనకు వేరే కమిట్మంట్లు ఉన్నాయని చెప్పి ఆమిర్ ఆఫర్ను రాజమౌళి సున్నితంగా తిరస్కరించినట్లు విజయేంద్ర తెలిపారు.
This post was last modified on April 3, 2022 6:33 pm
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…