‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ ‘ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్’ అనే హోదాను అనుభవిస్తున్నాడు కానీ.. అంతకుముందు మాత్రం ఆమిర్ ఖాన్దే ఈ స్థానం. ప్రభాస్ అయినా రాజమౌళి అండతో అనుకోకుండా పెద్ద స్టార్ అయిపోయాడు కానీ.. ఆమిర్ ఖాన్ అలా కాదు. నిలకడగా విజయాలు సాధిస్తూ, డైరెక్టర్ ఎవరన్నది సంబంధం లేకుండా రికార్డులు బద్దలు కొడుతూ.. తన సినిమాలతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ స్థాయిని పెంచుతూ తన పేరు చూసి కోట్లాది మంది థియేటర్లకు వచ్చేలా ఇమేజ్ పెంచుకుంటూ ఆ స్థాయిని అందుకున్నాడు.
ఆయనతో సినిమా చేయాలని ఇండియాలో ప్రతి దర్శకుడూ ఆశిస్తాడంటే అతిశయోక్తి కాదు. అలాంటి దర్శకుడు ఒక సౌత్ డైరెక్టర్ని తనతో సినిమా చేయమని అడిగితే.. అతను కాదంటాడని ఎవరైనా అనుకుంటారా? కానీ మన దర్శక ధీరుడు రాజమౌళి.. ఆమిర్ అంతటి వాడికి ‘నో’ చెప్పాడట. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి స్థాయి అమాంతం పెరిగిపోయిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆమిర్.. రాజమౌళితో పని చేయాలనుకున్నాడట. ఆయనతో మహాభారత గాథను తెరకెక్కించాలన్నది ఆమిర్ ఆలోచన. ఇందుకోసం ముందుగా విజయేంద్ర ప్రసాద్నే సంప్రదించాడట ఆమిర్. మహాభారతం మీద సినిమాకు స్క్రిప్టు రాయమని అడిగితే..ఈ కథను సినిమాగా తీయాలంటే ఆరేడు భాగాలుగా తీయాల్సి ఉంటుందని, ఐతే మొత్తం స్క్రిప్టును తాను రాయలేనని.. వేరే కమిట్మెంట్ల వల్ల తనకు అంత సమయం లేదని.. ఐతే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీస్తే బాగుంటుందో ఒక ఔట్ లైన్ గీసి.. ఓవరాల్ కథ వరకు రాసి పెడతానని.. పూర్తి స్థాయి స్క్రిప్టును వేరే వాళ్లతో రాయించుకోవాలని తాను ఆమిర్కు చెప్పానని విజయేంద్ర వెల్లడించారు.
ఇక ఈ సినిమాను డైరెక్ట్ చేయాలని ఆమిర్.. రాజమౌళిని అడగ్గా, తాను స్వయంగా మహాభారత గాథను తెరకెక్కించాలని అనుకుంటున్నానని, అందుకు ఇంకా సమయం పడుతుందని, మధ్యలో తనకు వేరే కమిట్మంట్లు ఉన్నాయని చెప్పి ఆమిర్ ఆఫర్ను రాజమౌళి సున్నితంగా తిరస్కరించినట్లు విజయేంద్ర తెలిపారు.
This post was last modified on April 3, 2022 6:33 pm
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…