ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా సినీ ప్రియుల చర్చలన్నీ ఆర్ఆర్ఆర్ చుట్టూనే తిరుగుతున్నాయి. బాహుబలి తర్వాత మరోసారి రాజమౌళి తన బాక్సాఫీస్ మ్యాజిక్ను చూపిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల అవతల బాహుబలి స్థాయిలో హైప్ లేకపోయినా.. రిలీజ్ తర్వాత ఆర్ఆర్ఆర్ అద్భుతాలే చేస్తోంది. దేశవ్యాప్తంగా భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది.
ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఈ సినిమా వసూళ్లు అంతకంతకూ పెరుగుతున్నాయి. తొలి వీకెండ్ను మించి రెండో వీకెండ్లో వసూళ్లు వచ్చేలా ఉన్నాయి. ఈ ప్రభంజనం ఇలా సాగుతున్న సమయంలో ఆర్ఆర్ఆర్ను మెచ్చిన వాళ్లందరినీ మరింత సంతోషపెట్టే వార్త బయటికి వచ్చింది. ఈ సినిమాకు సీక్వెల్ వచ్చే అవకాశాలున్నాయట.
ఈ విషయాన్ని స్వయంగా చిత్ర రచయిత విజయేంద్ర ప్రసాదే ధ్రువీకరించారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన ఆర్ఆర్ఆర్ సీక్వెల్ గురించి మాట్లాడారు. అందుకు ఛాన్సుందా అని అడిగితే.. ఔనని సంకేతాలు ఇచ్చారు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ తమ ఇంటికి వచ్చాడని, ఆ సందర్భంగా సీక్వెల్ గురించి చర్చ జరిగిందని, అప్పుడు రాజమౌళి కూడా ఉన్నాడని.. సీక్వెల్ చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలించామని, తాను కొన్ని ఐడియాలు చెప్పగా అందరూ సానుకూలంగా స్పందించారని, కాబట్టి ఈ చిత్రానికి కొనసాగింపుగా మరో సినిమా చేసే అవకాశాలు లేకపోలేదని విజయేంద్ర ప్రసాద్ చెప్పారు.
ఆయన అంత ధీమాగా ఈ మాట చెప్పారంటే ఆర్ఆర్ఆర్ సీక్వెల్ కచ్చితంగా ఉంటుందనే అనుకోవచ్చు. మహేష్ బాబుతో రాజమౌళి సినిమా అయ్యాక ఆర్ఆర్ఆర్-2ను పట్టాలెక్కించడానికి ప్రయత్నిస్తారేమో. ఈ సినిమా చూసిన చాలామంది సీక్వెల్ చేయడానికి స్కోప్ ఉందనే అనుకున్నమాట నిజం.
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…
విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…
తెలంగాణ నాయకురాలు, తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున…
పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…
ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కల్లు రుచి చూశారు. వాస్తవానికి ఆయన ఇలాంటి వాటికి కడు దూరంగా ఉంటారు. అయితే..…