ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా సినీ ప్రియుల చర్చలన్నీ ఆర్ఆర్ఆర్ చుట్టూనే తిరుగుతున్నాయి. బాహుబలి తర్వాత మరోసారి రాజమౌళి తన బాక్సాఫీస్ మ్యాజిక్ను చూపిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల అవతల బాహుబలి స్థాయిలో హైప్ లేకపోయినా.. రిలీజ్ తర్వాత ఆర్ఆర్ఆర్ అద్భుతాలే చేస్తోంది. దేశవ్యాప్తంగా భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది.
ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఈ సినిమా వసూళ్లు అంతకంతకూ పెరుగుతున్నాయి. తొలి వీకెండ్ను మించి రెండో వీకెండ్లో వసూళ్లు వచ్చేలా ఉన్నాయి. ఈ ప్రభంజనం ఇలా సాగుతున్న సమయంలో ఆర్ఆర్ఆర్ను మెచ్చిన వాళ్లందరినీ మరింత సంతోషపెట్టే వార్త బయటికి వచ్చింది. ఈ సినిమాకు సీక్వెల్ వచ్చే అవకాశాలున్నాయట.
ఈ విషయాన్ని స్వయంగా చిత్ర రచయిత విజయేంద్ర ప్రసాదే ధ్రువీకరించారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన ఆర్ఆర్ఆర్ సీక్వెల్ గురించి మాట్లాడారు. అందుకు ఛాన్సుందా అని అడిగితే.. ఔనని సంకేతాలు ఇచ్చారు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ తమ ఇంటికి వచ్చాడని, ఆ సందర్భంగా సీక్వెల్ గురించి చర్చ జరిగిందని, అప్పుడు రాజమౌళి కూడా ఉన్నాడని.. సీక్వెల్ చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలించామని, తాను కొన్ని ఐడియాలు చెప్పగా అందరూ సానుకూలంగా స్పందించారని, కాబట్టి ఈ చిత్రానికి కొనసాగింపుగా మరో సినిమా చేసే అవకాశాలు లేకపోలేదని విజయేంద్ర ప్రసాద్ చెప్పారు.
ఆయన అంత ధీమాగా ఈ మాట చెప్పారంటే ఆర్ఆర్ఆర్ సీక్వెల్ కచ్చితంగా ఉంటుందనే అనుకోవచ్చు. మహేష్ బాబుతో రాజమౌళి సినిమా అయ్యాక ఆర్ఆర్ఆర్-2ను పట్టాలెక్కించడానికి ప్రయత్నిస్తారేమో. ఈ సినిమా చూసిన చాలామంది సీక్వెల్ చేయడానికి స్కోప్ ఉందనే అనుకున్నమాట నిజం.
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…
భుజానికి అయిన గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తుతం ముంబై…
హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మరోసారి తనదైన శైలిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈసారి భారీ పొక్లెయిన్…
తెలుగులో ప్రస్తుతం నంబర్ వన్ హీరోయిన్ పొజిషన్కు గట్టి పోటీదారుగా మారిన అమ్మాయి.. భాగ్యశ్రీ బోర్సే. రెండు రోజుల ముందు…