సినిమా మొదలైంది ఇప్పుడే. అలాంటపుడు ట్రైలర్ ఎలా రిలీజవుతుంది.. అదెలా అదిరిపోతుంది అని డౌట్ వస్తోందా? ఇది పూరి జగన్నాథ్-విజయ్ దేవరకొండ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘జనగణమన’ కాదులెండి. మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్-సూరజ్ వెంజరమూడు కలయిలో ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైన సినిమా అది. డిజో జోస్ ఆంటోనీ ఈ చిత్రాన్ని రూపొందించాడు.
తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేశారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. రెగ్యులర్గా మనం చూసే సినిమా ట్రైలర్లలా లేదిది. సినిమాలోని కీలక సన్నివేశాలు, షాట్లు తీసుకుని పేర్చేయడం కాకుండా.. ఒక కాన్సెప్ట్ ప్రకారం సాగిందీ ట్రైలర్. న్యాయం కోసం ప్రశ్నించే క్రమంలో రాజకీయ నేతలపై ఎదురు తిరిగి సర్వం కోల్పోయి.. ఊతకర్ర సాయంతో నడవాల్సిన స్థితికి చేరుకున్న వ్యక్తిగా ఇందులో పృథ్వీరాజ్ కనిపించాడు.
అతను ఒక మంత్రి ఆఫీస్ ముందు కూర్చుని ఉంటాడు. లోపల్నుంచి తనకు పిలుపు రావడంతో వెళ్తాడు. అతణ్ని చూసి మంత్రి వేళాకోళంగా మాట్లాడతాడు. వ్యవస్థ మీద ఎదురు తిరిగితే, అన్యాయంపై ప్రశ్నిస్తే ఏం జరుగుతుందో చూశావ్ కదా అంటాడు. ఇంకెవరైనా నీలా నోరెత్తుతారా అని వెటకారమాడి.. నన్ను సాయం అడిగి వచ్చావ్ కదా అది నేను చూసుకుంటా అని చెప్పి పృథ్వీరాజ్ను సాగనంపుతాడు. హీరో ఆఫీస్ నుంచి బయటికి అడుగు పెడుతున్నపుడు ఉంటుంది అసలు ట్విస్ట్. అదేంటన్నది ట్రైలర్ చూసే తెలుసుకోవాలి.
ట్రైలర్లో ఆ ట్విస్టే మేజర్ హైలైట్. అది చూసి వావ్ అనుకోకుండా ఉండలేరు. ట్రైలర్లో పృథ్వీరాజ్ ఎపిసోడ్కు సమాంతరంగా సూరజ్ను పోలీసాఫీసర్గా కొన్ని షాట్లు చూపించారు. అవి కూడా ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి. ట్రైలర్ చూశాక సినిమా మీద అంచనాలు పెరిగిపోవడం ఖాయం. పృథ్వీరాజ-సూరజ్ కలయికలో ఇంతకుముందు వచ్చిన ‘డ్రైవింగ్ లైసెన్స్’ సూపర్ హిట్ అయింది. వీరి కాంబినేషన్ క్రేజ్కు తోడు.. ట్రైలర్ కూడా ఆసక్తికరంగా ఉండటంతో ‘జనగణమన’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
This post was last modified on March 31, 2022 5:17 pm
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…