సినిమా మొదలైంది ఇప్పుడే. అలాంటపుడు ట్రైలర్ ఎలా రిలీజవుతుంది.. అదెలా అదిరిపోతుంది అని డౌట్ వస్తోందా? ఇది పూరి జగన్నాథ్-విజయ్ దేవరకొండ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘జనగణమన’ కాదులెండి. మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్-సూరజ్ వెంజరమూడు కలయిలో ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైన సినిమా అది. డిజో జోస్ ఆంటోనీ ఈ చిత్రాన్ని రూపొందించాడు.
తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేశారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. రెగ్యులర్గా మనం చూసే సినిమా ట్రైలర్లలా లేదిది. సినిమాలోని కీలక సన్నివేశాలు, షాట్లు తీసుకుని పేర్చేయడం కాకుండా.. ఒక కాన్సెప్ట్ ప్రకారం సాగిందీ ట్రైలర్. న్యాయం కోసం ప్రశ్నించే క్రమంలో రాజకీయ నేతలపై ఎదురు తిరిగి సర్వం కోల్పోయి.. ఊతకర్ర సాయంతో నడవాల్సిన స్థితికి చేరుకున్న వ్యక్తిగా ఇందులో పృథ్వీరాజ్ కనిపించాడు.
అతను ఒక మంత్రి ఆఫీస్ ముందు కూర్చుని ఉంటాడు. లోపల్నుంచి తనకు పిలుపు రావడంతో వెళ్తాడు. అతణ్ని చూసి మంత్రి వేళాకోళంగా మాట్లాడతాడు. వ్యవస్థ మీద ఎదురు తిరిగితే, అన్యాయంపై ప్రశ్నిస్తే ఏం జరుగుతుందో చూశావ్ కదా అంటాడు. ఇంకెవరైనా నీలా నోరెత్తుతారా అని వెటకారమాడి.. నన్ను సాయం అడిగి వచ్చావ్ కదా అది నేను చూసుకుంటా అని చెప్పి పృథ్వీరాజ్ను సాగనంపుతాడు. హీరో ఆఫీస్ నుంచి బయటికి అడుగు పెడుతున్నపుడు ఉంటుంది అసలు ట్విస్ట్. అదేంటన్నది ట్రైలర్ చూసే తెలుసుకోవాలి.
ట్రైలర్లో ఆ ట్విస్టే మేజర్ హైలైట్. అది చూసి వావ్ అనుకోకుండా ఉండలేరు. ట్రైలర్లో పృథ్వీరాజ్ ఎపిసోడ్కు సమాంతరంగా సూరజ్ను పోలీసాఫీసర్గా కొన్ని షాట్లు చూపించారు. అవి కూడా ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి. ట్రైలర్ చూశాక సినిమా మీద అంచనాలు పెరిగిపోవడం ఖాయం. పృథ్వీరాజ-సూరజ్ కలయికలో ఇంతకుముందు వచ్చిన ‘డ్రైవింగ్ లైసెన్స్’ సూపర్ హిట్ అయింది. వీరి కాంబినేషన్ క్రేజ్కు తోడు.. ట్రైలర్ కూడా ఆసక్తికరంగా ఉండటంతో ‘జనగణమన’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
This post was last modified on March 31, 2022 5:17 pm
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…
ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…
సినీ రంగంలో మహిళలు నటనలోకి పెద్ద సంఖ్యలోనే వస్తారు కానీ.. టెక్నికల్ సైడ్ వెళ్లే వాళ్లు తక్కువ. అందులోనూ దర్శకత్వం వైపు అడుగులు…
పెద్ది వాయిదా గురించి కథనాలు వస్తూనే ఉన్నాయి. లేట్ లేదని రాకాస ప్రమోషన్ వీడియోలో రామ్ చరణ్ స్వయంగా చెప్పినా…