కరోనా టైంలో సినిమాల వాయిదా అన్నది చాలా మామూలు విషయం అయిపోయింది. ఒక డేట్కు కట్టుబడి సినిమాను రిలీజ్ చేస్తే అది చాలా గొప్ప విషయంగానే ఉంటోంది. గత రెండేళ్లలో వాయిదా పడని సినిమా అంటూ ఏదీ లేదు. ఒకసారి కాదు.. రెండుసార్లు కాదు.. మూణ్నాలుగుసార్లు వాయిదా పడుతున్నాయి సినిమాలు. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్ఆర్ఆర్కు నాలుగుసార్లు డేట్ మారింది.
ఈ వేసవిలో వచ్చిన, రాబోతున్న సినిమాలన్నింటి పరిస్థితీ ఇంతే. ఈ వరుసలో ఇంకో సినిమా మళ్లీ డేట్ మార్చుకుంది. గోపీచంద్-మారుతిల కలయికలో తెరకెక్కిన పక్కా కమర్షియల్కు ముందు అనుకున్న డేట్ మార్చి 18. కానీ 25కు ఆర్ఆర్ఆర్ ఫిక్స్ కావడంతో మే 20కి వాయిదా వేశారు. ఆ డేట్తో పోస్టర్ రిలీజ్ చేసి.. కింద కరోనా కరుణిస్తే అనే రైడర్ కూడా పెట్టారు.
అప్పుడే అనుకున్నారు జనాలు.. ఈ డేట్ కూడా ఖాయం కాదని. ఇప్పుడు అదే జరిగింది. ఈ సినిమాను మళ్లీ వాయిదా వేసి కొత్త డేట్ ఇచ్చారు. జులై 1న పక్కా కమర్షియల్ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఈసారి ఇచ్చిన డేట్ మాత్రం పక్కా అనే అంటున్నారు. మే 13న మహేష్ బాబు సినిమా సర్కారు వారి పాట రిలీజవుతున్న నేపథ్యంలో ఇంకో వారానికి గోపీచంద్ సినిమాను విడుదల చేసే సాహసం చేయకపోవచ్చనే అనుమానాలు ముందు నుంచే ఉన్నాయి.
ఇప్పుడు ఆ అనుమానాలే నిజం అయ్యాయి. జులై 1న మాధవన్ బహు భాషా చిత్రం రాకెట్రీ-ది నంబి ఎఫెక్ట్ కూడా రిలీజవుతున్న సంగతి తెలిసిందే. పక్కా కమర్షియల్ మూవీలో గోపీ లాయర్ పాత్రలో నటించాడు. అతడికి జోడీగా రాశి ఖన్నా కనిపించనుంది. యువి క్రియేషన్స్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది.
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు భారీ షాక్ తగిలింది. తెలంగాణలో జనసేన బలోపేతం దిశగా…
తెలుగు మూవీ లవర్స్ చిరకాల వాంఛ ఐమాక్స్ గురించి గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఎడతెగని చర్చ…
దక్షిణాదిన క్యారెక్టర్, విలన్ పాత్రలకు మాంచి డిమాండ్ ఉన్న నటుల్లో విజయ్ సేతుపతి ఒకడు. సుకుమార్ అంతటి పెద్ద దర్శకుడు…
అదేంటి పెద్ది వస్తుంటే ఇంకెవరు పోటీకి దిగుతారనే డౌట్ వస్తోందా. టాలీవుడ్ ప్రొడ్యూసర్లు అంత సాహసం చేయరు కానీ ఇతర…
తెలుగులో రిలీజయ్యే ఏ సినిమాకైనా అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఒకేసారి షోలు మొదలుపెట్టాల్సి ఉంటుంది. ఒకట్రెండు గంటల తేడా…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్ పై ఓ రేంజి తరహా వ్యాఖ్యలు చేసిన…