కరోనా టైంలో సినిమాల వాయిదా అన్నది చాలా మామూలు విషయం అయిపోయింది. ఒక డేట్కు కట్టుబడి సినిమాను రిలీజ్ చేస్తే అది చాలా గొప్ప విషయంగానే ఉంటోంది. గత రెండేళ్లలో వాయిదా పడని సినిమా అంటూ ఏదీ లేదు. ఒకసారి కాదు.. రెండుసార్లు కాదు.. మూణ్నాలుగుసార్లు వాయిదా పడుతున్నాయి సినిమాలు. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్ఆర్ఆర్కు నాలుగుసార్లు డేట్ మారింది.
ఈ వేసవిలో వచ్చిన, రాబోతున్న సినిమాలన్నింటి పరిస్థితీ ఇంతే. ఈ వరుసలో ఇంకో సినిమా మళ్లీ డేట్ మార్చుకుంది. గోపీచంద్-మారుతిల కలయికలో తెరకెక్కిన పక్కా కమర్షియల్కు ముందు అనుకున్న డేట్ మార్చి 18. కానీ 25కు ఆర్ఆర్ఆర్ ఫిక్స్ కావడంతో మే 20కి వాయిదా వేశారు. ఆ డేట్తో పోస్టర్ రిలీజ్ చేసి.. కింద కరోనా కరుణిస్తే అనే రైడర్ కూడా పెట్టారు.
అప్పుడే అనుకున్నారు జనాలు.. ఈ డేట్ కూడా ఖాయం కాదని. ఇప్పుడు అదే జరిగింది. ఈ సినిమాను మళ్లీ వాయిదా వేసి కొత్త డేట్ ఇచ్చారు. జులై 1న పక్కా కమర్షియల్ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఈసారి ఇచ్చిన డేట్ మాత్రం పక్కా అనే అంటున్నారు. మే 13న మహేష్ బాబు సినిమా సర్కారు వారి పాట రిలీజవుతున్న నేపథ్యంలో ఇంకో వారానికి గోపీచంద్ సినిమాను విడుదల చేసే సాహసం చేయకపోవచ్చనే అనుమానాలు ముందు నుంచే ఉన్నాయి.
ఇప్పుడు ఆ అనుమానాలే నిజం అయ్యాయి. జులై 1న మాధవన్ బహు భాషా చిత్రం రాకెట్రీ-ది నంబి ఎఫెక్ట్ కూడా రిలీజవుతున్న సంగతి తెలిసిందే. పక్కా కమర్షియల్ మూవీలో గోపీ లాయర్ పాత్రలో నటించాడు. అతడికి జోడీగా రాశి ఖన్నా కనిపించనుంది. యువి క్రియేషన్స్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది.
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…