కరోనా టైంలో సినిమాల వాయిదా అన్నది చాలా మామూలు విషయం అయిపోయింది. ఒక డేట్కు కట్టుబడి సినిమాను రిలీజ్ చేస్తే అది చాలా గొప్ప విషయంగానే ఉంటోంది. గత రెండేళ్లలో వాయిదా పడని సినిమా అంటూ ఏదీ లేదు. ఒకసారి కాదు.. రెండుసార్లు కాదు.. మూణ్నాలుగుసార్లు వాయిదా పడుతున్నాయి సినిమాలు. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్ఆర్ఆర్కు నాలుగుసార్లు డేట్ మారింది.
ఈ వేసవిలో వచ్చిన, రాబోతున్న సినిమాలన్నింటి పరిస్థితీ ఇంతే. ఈ వరుసలో ఇంకో సినిమా మళ్లీ డేట్ మార్చుకుంది. గోపీచంద్-మారుతిల కలయికలో తెరకెక్కిన పక్కా కమర్షియల్కు ముందు అనుకున్న డేట్ మార్చి 18. కానీ 25కు ఆర్ఆర్ఆర్ ఫిక్స్ కావడంతో మే 20కి వాయిదా వేశారు. ఆ డేట్తో పోస్టర్ రిలీజ్ చేసి.. కింద కరోనా కరుణిస్తే అనే రైడర్ కూడా పెట్టారు.
అప్పుడే అనుకున్నారు జనాలు.. ఈ డేట్ కూడా ఖాయం కాదని. ఇప్పుడు అదే జరిగింది. ఈ సినిమాను మళ్లీ వాయిదా వేసి కొత్త డేట్ ఇచ్చారు. జులై 1న పక్కా కమర్షియల్ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఈసారి ఇచ్చిన డేట్ మాత్రం పక్కా అనే అంటున్నారు. మే 13న మహేష్ బాబు సినిమా సర్కారు వారి పాట రిలీజవుతున్న నేపథ్యంలో ఇంకో వారానికి గోపీచంద్ సినిమాను విడుదల చేసే సాహసం చేయకపోవచ్చనే అనుమానాలు ముందు నుంచే ఉన్నాయి.
ఇప్పుడు ఆ అనుమానాలే నిజం అయ్యాయి. జులై 1న మాధవన్ బహు భాషా చిత్రం రాకెట్రీ-ది నంబి ఎఫెక్ట్ కూడా రిలీజవుతున్న సంగతి తెలిసిందే. పక్కా కమర్షియల్ మూవీలో గోపీ లాయర్ పాత్రలో నటించాడు. అతడికి జోడీగా రాశి ఖన్నా కనిపించనుంది. యువి క్రియేషన్స్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది.
This post was last modified on March 31, 2022 7:41 am
వైసీపీకి డేంజర్ బెల్స్ మోగుతున్నాయా.. ఉత్తరాంధ్రలో తాజాగా చోటు చేసుకున్న చిన్న శ్రీను వ్యవహారంతో పాటు.. పార్టీలో మరింత మంది…
జాంబీ సినిమాలో వైరస్ లాగా ఏఐ వాడకం క్రమంగా టెకీస్ నుంచి సామాన్యుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. ఒకరేమో వారణాసిలో మహేష్…
లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…
ఎన్నికల సమయంలో ఉచిత పథకాలు ప్రకటించే దేశం ఏది అని అడిగితే.. ఠక్కున చెప్పే పేరు భారత్. రాష్ట్రాల అసెంబ్లీల…
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…
మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…