ప్రపంచ సినిమాలో హాలీవుడ్కు ఉన్న ప్రాధాన్యం వేరు. ఆ సినిమాల బడ్జెట్లు, వాటి వసూళ్లతో అసలు పోలికే ఉండదు. ఏ సినిమా అయినా వందల కోట్ల బడ్జెట్లోనే తెరకెక్కుతుంది. వేల కోట్ల వసూళ్లు అలవోకగా సాధించేస్తుంటుంది. అయితే ఇదంతా అక్కడి దర్శకులు, నటీనటుల గొప్పదనమేమీ కాదని అంటున్నాడు టాలీవుడ్ యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ. ఈ ఘనతంగా ఇంగ్లిష్ భాషకే చెందుతుందని అతను అభిప్రాయపడ్డాడు.
తన కొత్త చిత్రం జనగణమన ప్రారంభోత్సవం సందర్భంగా ముంబయిలో మీడియాతో మాట్లాడిన అతను.. ఈ వ్యాఖ్యలు చేశాడు. బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్ లాంటి ప్రాంతీయ చిత్రాలు పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటడం గురించి ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు విజయ్ తనదైన శైలిలో సమాధానం చెప్పాడు. అసలు ఈ చిత్రాలను పాన్ ఇండియా సినిమాలు అనకూడదని.. ఇవి ఇండియన్ సినిమాను రిప్రజెంట్ చేస్తున్నాయని విజయ్ వ్యాఖ్యానించాడు.
బాహుబలి సినిమా ప్రాంతీయ చిత్రాలకు ఉన్న పరిధులను దాటి దేశవ్యాప్తంగా అద్భుత విజయం సాధించిందని, అంతకుముందు కూడా పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కినప్పటికీ.. తనకు తెలిసినంత వరకు ఇది హద్దులన్నీ చెరిపేసిందని, ఎవరైనా ఇలాంటి సినిమాలు తీయొచ్చని, కాబట్టే తాను పాన్ఇండియా సినిమాలు చేస్తూ, ఈ రోజు ముంబయిలో కూర్చుని మాట్లాడుతున్నానని విజయ్ అన్నాడు. ఇక హాలీవుడ్ సినిమాల గురించి మాట్లాడుతూ.. అక్కడి ఆర్టిస్టులు, టెక్నీషియన్లు మన వాళ్ల కంటే గొప్పవాళ్లేమీ కాదని.. ఐతే ప్రపంచంలో ఎక్కువమంది ఇంగ్లిష్ మాట్లాడటం వల్ల ఇంగ్లిష్ సినిమాలు కూడా ఎక్కువగా చూస్తారని.. కాబట్టే అక్కడ ఎక్కువ బడ్జెట్లలో సినిమాలు తెరకెక్కడమే కాక ఎక్కువ వసూళ్లు కూడా రాబడతాయని అంతకుమించి తేడా ఏమీ లేదని విజయ్ అభిప్రాయపడ్డాడు.
చైనా జనాభా ఎక్కువ కావడంతో ఇప్పుడు హాలీవుడ్ వాళ్లు ఆ దేశ ఫిలిం మేకర్స్తో భాగస్వాములవుతున్నారని.. ఇండియన్ సినిమా ఇలాగే సత్తా చాటుతూ పోతే రేప్పొద్దున మనతోనూ వాళ్లు భాగస్వాములవుతారని విజయ్ అన్నాడు. విజయ్ చెప్పిన లాజిక్ భలేగా అనిపించడమే కాక.. కరెక్టే కదా అన్న ఫీలింగ్ కలిగిస్తోంది జనాలకి.
This post was last modified on March 30, 2022 9:49 am
శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…
ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో జరుగుతున్న చర్చ ఎల్లుండి నుంచి ఇరుముడికి కేటాయించిన చాలా థియేటర్లు టాక్సిక్ కు…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ప్రమాదానికి గురయ్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్.. కొద్ద దూరం పైకి వెళ్లి…
కుళ్లిపోయిన చికెన్ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో…
బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…
మహారాష్ట్రలో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండగా, నిమిషాల వ్యవధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇప్పుడు సోషల్…