ప్రపంచ సినిమాలో హాలీవుడ్కు ఉన్న ప్రాధాన్యం వేరు. ఆ సినిమాల బడ్జెట్లు, వాటి వసూళ్లతో అసలు పోలికే ఉండదు. ఏ సినిమా అయినా వందల కోట్ల బడ్జెట్లోనే తెరకెక్కుతుంది. వేల కోట్ల వసూళ్లు అలవోకగా సాధించేస్తుంటుంది. అయితే ఇదంతా అక్కడి దర్శకులు, నటీనటుల గొప్పదనమేమీ కాదని అంటున్నాడు టాలీవుడ్ యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ. ఈ ఘనతంగా ఇంగ్లిష్ భాషకే చెందుతుందని అతను అభిప్రాయపడ్డాడు.
తన కొత్త చిత్రం జనగణమన ప్రారంభోత్సవం సందర్భంగా ముంబయిలో మీడియాతో మాట్లాడిన అతను.. ఈ వ్యాఖ్యలు చేశాడు. బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్ లాంటి ప్రాంతీయ చిత్రాలు పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటడం గురించి ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు విజయ్ తనదైన శైలిలో సమాధానం చెప్పాడు. అసలు ఈ చిత్రాలను పాన్ ఇండియా సినిమాలు అనకూడదని.. ఇవి ఇండియన్ సినిమాను రిప్రజెంట్ చేస్తున్నాయని విజయ్ వ్యాఖ్యానించాడు.
బాహుబలి సినిమా ప్రాంతీయ చిత్రాలకు ఉన్న పరిధులను దాటి దేశవ్యాప్తంగా అద్భుత విజయం సాధించిందని, అంతకుముందు కూడా పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కినప్పటికీ.. తనకు తెలిసినంత వరకు ఇది హద్దులన్నీ చెరిపేసిందని, ఎవరైనా ఇలాంటి సినిమాలు తీయొచ్చని, కాబట్టే తాను పాన్ఇండియా సినిమాలు చేస్తూ, ఈ రోజు ముంబయిలో కూర్చుని మాట్లాడుతున్నానని విజయ్ అన్నాడు. ఇక హాలీవుడ్ సినిమాల గురించి మాట్లాడుతూ.. అక్కడి ఆర్టిస్టులు, టెక్నీషియన్లు మన వాళ్ల కంటే గొప్పవాళ్లేమీ కాదని.. ఐతే ప్రపంచంలో ఎక్కువమంది ఇంగ్లిష్ మాట్లాడటం వల్ల ఇంగ్లిష్ సినిమాలు కూడా ఎక్కువగా చూస్తారని.. కాబట్టే అక్కడ ఎక్కువ బడ్జెట్లలో సినిమాలు తెరకెక్కడమే కాక ఎక్కువ వసూళ్లు కూడా రాబడతాయని అంతకుమించి తేడా ఏమీ లేదని విజయ్ అభిప్రాయపడ్డాడు.
చైనా జనాభా ఎక్కువ కావడంతో ఇప్పుడు హాలీవుడ్ వాళ్లు ఆ దేశ ఫిలిం మేకర్స్తో భాగస్వాములవుతున్నారని.. ఇండియన్ సినిమా ఇలాగే సత్తా చాటుతూ పోతే రేప్పొద్దున మనతోనూ వాళ్లు భాగస్వాములవుతారని విజయ్ అన్నాడు. విజయ్ చెప్పిన లాజిక్ భలేగా అనిపించడమే కాక.. కరెక్టే కదా అన్న ఫీలింగ్ కలిగిస్తోంది జనాలకి.
This post was last modified on March 30, 2022 9:49 am
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…