సినిమాలో నీకు ఒక పెద్ద రోల్ ఇస్తానంటూ చెప్పి, ఆ తరువాత ఆ రోల్ ను కుదించేస్తే.. బాలీవుడ్ బ్యూటి ఆలియా భట్ అలిగినా కూడా ఒక అర్ధం ఉంది. కాని అన్నీ తెలిశాక కూడా అడిగి మరీ రోల్ చేస్తానంటూ ముందుకొచ్చిన భామ అలిగితే మీనింగ్ ఉందా? సరిగ్గా ఇప్పుడు మన గంగూబాయ్ విషయంలో ఇదే టాక్ వినిపిస్తోంది. మరీ వింతగా ప్రవర్తించడం అనేది కాస్త వింతగానే ఉంది.
నిజానికి ఆర్.ఆర్.ఆర్ సినిమా కోసం ఒక హీరోయిన్ ను వెతుకుతున్న వేళ.. రాజమౌళికి ఎయిర్ పోర్టులో కనిపించిన ఆలియా.. తనకు ఏదన్నా అవకాశం ఇవ్వాల్సిందిగా కోరిందట. తన తదుపరి సినిమాలో ఓ చిన్న రోల్ ఉందని చెబితే, చిన్నదైనా పర్లేదు చేసేస్తా అంటూ రంగంలోకి దూకేసింది. ఫుల్ సినిమాకు తీసుకునే పారితోషకమే పుచ్చుకుని, ఇప్పుడు మాత్రం ఫుల్ లెంగ్త్ రోల్ ఇవ్వలేదని అలిగింది.
అంతే కాదు, కనీసం రిలీజ్ నుండి ఒక్కసారి కూడా సినిమాను ప్రమోట్ చేసిందేలేదు. బాలీవుడ్ జనాలందరూ వావ్ వండర్ఫుల్ అంటున్నా కూడా, ఆలియా మాత్రం నోరు మెదపట్లేదు. చివరకు ఇనస్టా స్టోరీలో తూతూమంత్రంగా ఆర్.ఆర్.ఆర్. అంటూ ఒక పోస్టర్ షేర్ చేసింది. అది కూడా సినిమా రిలీజైన మూడు రోజుల తరువాత. అసలు ఏరి కోరి ఈ రోల్ తీసుకున్నాక ఈ అలకెందుకు ఆలియా?
ఇక్కడ మ్యాటర్ ఏంటంటే.. ఆలియా చేస్తున్న బ్రహ్మాస్త్ర సినిమాకు రాజమౌళి ప్రెజంటర్ గా వ్యవహరిస్తున్నాడు. పైగా ఈ సినిమా లోగో లాంచ్ సమయంలో ఆలియా త్వరలో పెళ్ళి చేసుకోబోయో హీరో రణబీర్ కపూర్ ఏకంగా ఆయన కాళ్ళకు మొక్కేశాడు. మరి రేపొద్దున్న బ్రహ్మాస్త్ర సినిమా ప్రమోషన్లో రాజమౌళి ఫేస్ చూసి ఏం సమాధానం చెబుతుందో ఈ హాట్ హీరోయిన్. అప్పుడు మీడియావాళ్ళు ఈ అలక మ్యాటర్ ను అడగరా? ఖచ్చితంగా అడుగుతారు. స్టార్ హీరోయిన్ గా ఎదిగాక కూడా ఇలా చిన్నపిల్లల్లా బిహేవ్ చేయడమంటే.. ఆలియాకు చెల్లుతోంది మరి.
This post was last modified on March 30, 2022 8:56 am
స్కూల్లో పాఠాలు నేర్చుకోవాల్సిన, పరీక్షలు రాయాల్సిన వయసులో ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ అనే కుర్రాడు ఎలా చెలరేగిపోతున్నాడో చూస్తున్నాం. సినీ…
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…