ఆర్ఆర్ఆర్ కోసం మూడున్నరేళ్లకు పైగా సమయాన్ని వెచ్చించాడు జూనియర్ ఎన్టీఆర్. రాజమౌళితో సినిమా అంటే ఆలస్యం మామూలే కానీ.. తారక్ మరీ ఇంత సమయం పెడతాడని అభిమానులు ఊహించలేదు. చరణ్ కూడా ఈ సినిమా కోసం తన కెరీర్లో విలువైన సమయాన్ని వెచ్చించాడు కానీ.. తారక్తో పోలిస్తే అతను నయం. ‘ఆర్ఆర్ఆర్’ మొదలవుతున్న టైంలోనే ‘వినయ విధేయ రామ’తో పలకరించాడు.
మధ్యలో ‘ఆచార్య’ సినిమాలో కీలక పాత్ర చేశాడు. ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ పూర్తవగానే ఆలస్యం చేయకుండా శంకర్ సినిమాను మొదలుపెట్టేశాడు. కానీ తారక్ మాత్రం గత మూడున్నరేళ్లలో వేరే సినిమా పని ఏదీ చేయలేదు. ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ పూర్తయి ఆరు నెలలు గడుస్తున్నప్పటికీ కొరటాలతో అనుకున్న కొత్త చిత్రాన్ని ఇప్పటిదాకా మొదలుపెట్టలేదు.
ఇదిగో అదిగో అనుకుంటూనే నెలలకు నెలలు గడిచిపోయాయి. తారక్-కొరటాల సినిమా ఎంతకీ పట్టాలెక్కకపోవడం అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు డెడ్ లైన్లు మారుతుండటంతో ఏదీ నమ్మే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఐతే ఎట్టకేలకు తారక్ స్వయంగా ఈ విషయంలో అభిమానులకు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.
కొరటాలతో తన కొత్త చిత్రం జూన్లో సెట్స్ మీదికి వెళ్తుందని తారక్ ప్రకటించాడు. ఈ సినిమా కోసం తాను సన్నాహాలు మొదలుపెట్టినట్లు కూడా వెల్లడించాడు. ‘ఆర్ఆర్ఆర్’తో పోలిస్తే ఇందులో తారక్ లుక్ పూర్తి భిన్నంగా, ఆధునికంగా ఉండబోతోంది. ఇదొక రివెంజ్ డ్రామా అని, ఎన్టీఆర్ లుక్ పరంగా సర్ప్రైజ్ ఉంటుందని అంటున్నారు. ఏప్రిల్ 29న ‘ఆచార్య’ రిలీజవుతుండటంతో ఆ తర్వాత ఇంకో వారానికి కొరటాల పూర్తిగా ఫ్రీ అయిపోతాడు. ఇప్పటికే తారక్ సినిమా ప్రి ప్రొడక్షన్ పనులను అతను పర్యవేక్షిస్తున్నాడు. స్క్రిప్టు ముందే పూర్తయింది. ఈ చిత్రాన్ని కొరటాల మిత్రుడైన మిక్కిలినేని సుధాకర్, తారక్ అన్నయ్య కళ్యాణ్ రామ్ కలిసి నిర్మించనున్న సంగతి తెలిసిందే. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తాడని సమాచారం.
This post was last modified on March 29, 2022 8:58 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…