ఆర్ఆర్ఆర్ కోసం మూడున్నరేళ్లకు పైగా సమయాన్ని వెచ్చించాడు జూనియర్ ఎన్టీఆర్. రాజమౌళితో సినిమా అంటే ఆలస్యం మామూలే కానీ.. తారక్ మరీ ఇంత సమయం పెడతాడని అభిమానులు ఊహించలేదు. చరణ్ కూడా ఈ సినిమా కోసం తన కెరీర్లో విలువైన సమయాన్ని వెచ్చించాడు కానీ.. తారక్తో పోలిస్తే అతను నయం. ‘ఆర్ఆర్ఆర్’ మొదలవుతున్న టైంలోనే ‘వినయ విధేయ రామ’తో పలకరించాడు.
మధ్యలో ‘ఆచార్య’ సినిమాలో కీలక పాత్ర చేశాడు. ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ పూర్తవగానే ఆలస్యం చేయకుండా శంకర్ సినిమాను మొదలుపెట్టేశాడు. కానీ తారక్ మాత్రం గత మూడున్నరేళ్లలో వేరే సినిమా పని ఏదీ చేయలేదు. ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ పూర్తయి ఆరు నెలలు గడుస్తున్నప్పటికీ కొరటాలతో అనుకున్న కొత్త చిత్రాన్ని ఇప్పటిదాకా మొదలుపెట్టలేదు.
ఇదిగో అదిగో అనుకుంటూనే నెలలకు నెలలు గడిచిపోయాయి. తారక్-కొరటాల సినిమా ఎంతకీ పట్టాలెక్కకపోవడం అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు డెడ్ లైన్లు మారుతుండటంతో ఏదీ నమ్మే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఐతే ఎట్టకేలకు తారక్ స్వయంగా ఈ విషయంలో అభిమానులకు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.
కొరటాలతో తన కొత్త చిత్రం జూన్లో సెట్స్ మీదికి వెళ్తుందని తారక్ ప్రకటించాడు. ఈ సినిమా కోసం తాను సన్నాహాలు మొదలుపెట్టినట్లు కూడా వెల్లడించాడు. ‘ఆర్ఆర్ఆర్’తో పోలిస్తే ఇందులో తారక్ లుక్ పూర్తి భిన్నంగా, ఆధునికంగా ఉండబోతోంది. ఇదొక రివెంజ్ డ్రామా అని, ఎన్టీఆర్ లుక్ పరంగా సర్ప్రైజ్ ఉంటుందని అంటున్నారు. ఏప్రిల్ 29న ‘ఆచార్య’ రిలీజవుతుండటంతో ఆ తర్వాత ఇంకో వారానికి కొరటాల పూర్తిగా ఫ్రీ అయిపోతాడు. ఇప్పటికే తారక్ సినిమా ప్రి ప్రొడక్షన్ పనులను అతను పర్యవేక్షిస్తున్నాడు. స్క్రిప్టు ముందే పూర్తయింది. ఈ చిత్రాన్ని కొరటాల మిత్రుడైన మిక్కిలినేని సుధాకర్, తారక్ అన్నయ్య కళ్యాణ్ రామ్ కలిసి నిర్మించనున్న సంగతి తెలిసిందే. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తాడని సమాచారం.
This post was last modified on March 29, 2022 8:58 pm
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…