ఆర్ఆర్ఆర్ కోసం మూడున్నరేళ్లకు పైగా సమయాన్ని వెచ్చించాడు జూనియర్ ఎన్టీఆర్. రాజమౌళితో సినిమా అంటే ఆలస్యం మామూలే కానీ.. తారక్ మరీ ఇంత సమయం పెడతాడని అభిమానులు ఊహించలేదు. చరణ్ కూడా ఈ సినిమా కోసం తన కెరీర్లో విలువైన సమయాన్ని వెచ్చించాడు కానీ.. తారక్తో పోలిస్తే అతను నయం. ‘ఆర్ఆర్ఆర్’ మొదలవుతున్న టైంలోనే ‘వినయ విధేయ రామ’తో పలకరించాడు.
మధ్యలో ‘ఆచార్య’ సినిమాలో కీలక పాత్ర చేశాడు. ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ పూర్తవగానే ఆలస్యం చేయకుండా శంకర్ సినిమాను మొదలుపెట్టేశాడు. కానీ తారక్ మాత్రం గత మూడున్నరేళ్లలో వేరే సినిమా పని ఏదీ చేయలేదు. ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ పూర్తయి ఆరు నెలలు గడుస్తున్నప్పటికీ కొరటాలతో అనుకున్న కొత్త చిత్రాన్ని ఇప్పటిదాకా మొదలుపెట్టలేదు.
ఇదిగో అదిగో అనుకుంటూనే నెలలకు నెలలు గడిచిపోయాయి. తారక్-కొరటాల సినిమా ఎంతకీ పట్టాలెక్కకపోవడం అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు డెడ్ లైన్లు మారుతుండటంతో ఏదీ నమ్మే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఐతే ఎట్టకేలకు తారక్ స్వయంగా ఈ విషయంలో అభిమానులకు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.
కొరటాలతో తన కొత్త చిత్రం జూన్లో సెట్స్ మీదికి వెళ్తుందని తారక్ ప్రకటించాడు. ఈ సినిమా కోసం తాను సన్నాహాలు మొదలుపెట్టినట్లు కూడా వెల్లడించాడు. ‘ఆర్ఆర్ఆర్’తో పోలిస్తే ఇందులో తారక్ లుక్ పూర్తి భిన్నంగా, ఆధునికంగా ఉండబోతోంది. ఇదొక రివెంజ్ డ్రామా అని, ఎన్టీఆర్ లుక్ పరంగా సర్ప్రైజ్ ఉంటుందని అంటున్నారు. ఏప్రిల్ 29న ‘ఆచార్య’ రిలీజవుతుండటంతో ఆ తర్వాత ఇంకో వారానికి కొరటాల పూర్తిగా ఫ్రీ అయిపోతాడు. ఇప్పటికే తారక్ సినిమా ప్రి ప్రొడక్షన్ పనులను అతను పర్యవేక్షిస్తున్నాడు. స్క్రిప్టు ముందే పూర్తయింది. ఈ చిత్రాన్ని కొరటాల మిత్రుడైన మిక్కిలినేని సుధాకర్, తారక్ అన్నయ్య కళ్యాణ్ రామ్ కలిసి నిర్మించనున్న సంగతి తెలిసిందే. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తాడని సమాచారం.
పెద్దిని ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చేసే ఉద్దేశంతో భోపాల్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్, ముంబైలో ట్రైలర్…
జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. హైదరాబాద్ లోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా…
తెలంగాణలో జనసేన అస్థిత్వంపై అనేక విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే. అనేక ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించడం..ఆ తర్వాత…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై భూకబ్జా ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలోని శంకర్పల్లి…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉండే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. గతంలో…
సల్మాన్ ఖాన్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని కేసు బ్లాక్ బక్ పౌచింగ్. 1998లో హం సాత్ సాత్ హై షూటింగ్…