ఆర్ఆర్ఆర్ కోసం మూడున్నరేళ్లకు పైగా సమయాన్ని వెచ్చించాడు జూనియర్ ఎన్టీఆర్. రాజమౌళితో సినిమా అంటే ఆలస్యం మామూలే కానీ.. తారక్ మరీ ఇంత సమయం పెడతాడని అభిమానులు ఊహించలేదు. చరణ్ కూడా ఈ సినిమా కోసం తన కెరీర్లో విలువైన సమయాన్ని వెచ్చించాడు కానీ.. తారక్తో పోలిస్తే అతను నయం. ‘ఆర్ఆర్ఆర్’ మొదలవుతున్న టైంలోనే ‘వినయ విధేయ రామ’తో పలకరించాడు.
మధ్యలో ‘ఆచార్య’ సినిమాలో కీలక పాత్ర చేశాడు. ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ పూర్తవగానే ఆలస్యం చేయకుండా శంకర్ సినిమాను మొదలుపెట్టేశాడు. కానీ తారక్ మాత్రం గత మూడున్నరేళ్లలో వేరే సినిమా పని ఏదీ చేయలేదు. ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ పూర్తయి ఆరు నెలలు గడుస్తున్నప్పటికీ కొరటాలతో అనుకున్న కొత్త చిత్రాన్ని ఇప్పటిదాకా మొదలుపెట్టలేదు.
ఇదిగో అదిగో అనుకుంటూనే నెలలకు నెలలు గడిచిపోయాయి. తారక్-కొరటాల సినిమా ఎంతకీ పట్టాలెక్కకపోవడం అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు డెడ్ లైన్లు మారుతుండటంతో ఏదీ నమ్మే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఐతే ఎట్టకేలకు తారక్ స్వయంగా ఈ విషయంలో అభిమానులకు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.
కొరటాలతో తన కొత్త చిత్రం జూన్లో సెట్స్ మీదికి వెళ్తుందని తారక్ ప్రకటించాడు. ఈ సినిమా కోసం తాను సన్నాహాలు మొదలుపెట్టినట్లు కూడా వెల్లడించాడు. ‘ఆర్ఆర్ఆర్’తో పోలిస్తే ఇందులో తారక్ లుక్ పూర్తి భిన్నంగా, ఆధునికంగా ఉండబోతోంది. ఇదొక రివెంజ్ డ్రామా అని, ఎన్టీఆర్ లుక్ పరంగా సర్ప్రైజ్ ఉంటుందని అంటున్నారు. ఏప్రిల్ 29న ‘ఆచార్య’ రిలీజవుతుండటంతో ఆ తర్వాత ఇంకో వారానికి కొరటాల పూర్తిగా ఫ్రీ అయిపోతాడు. ఇప్పటికే తారక్ సినిమా ప్రి ప్రొడక్షన్ పనులను అతను పర్యవేక్షిస్తున్నాడు. స్క్రిప్టు ముందే పూర్తయింది. ఈ చిత్రాన్ని కొరటాల మిత్రుడైన మిక్కిలినేని సుధాకర్, తారక్ అన్నయ్య కళ్యాణ్ రామ్ కలిసి నిర్మించనున్న సంగతి తెలిసిందే. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తాడని సమాచారం.
కెరీర్ తొలి నాళ్లలో పెద్దగా అవకాశాలు లేనపుడు దక్షిణాదిన వచ్చే ప్రతి ఛాన్సునూ మహా ప్రసాదం అనుకుంటారు. స్టార్ ఇమేజ్…
మెగా హీరోల సినిమాలకు సంబంధించి ఏ ఈవెంట్ అయినా.. అందులో ఎక్కడో ఒక చోట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన పెద్ది సక్సెస్ మీట్ కోసం వేలాది అభిమానులు తరలివచ్చారు. ఈ సినిమాకు సంబంధించి ఇదే…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ విపక్ష వైసీపీ ఇటీవల డోస్ పెంచిన…
ప్రతి సంవత్సరం విజయ్కి స్పెషల్ పిక్తో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే త్రిష.. ఈసారి చెప్పలేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆయన్ని…
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…