మరో సినిమా నేరుగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్లో రిలీజైంది. ఫలితంలో ఏ మార్పూ లేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న కీర్తి సురేష్ సినిమా ‘పెంగ్విన్’ తీవ్ర నిరాశకు గురి చేసింది. ఆహా ఓహో అన్నట్లు ట్రైలర్ కట్ చేసి జనాల్లో ఆసక్తి పెంచిన చిత్ర బృందం.. సినిమాను తేల్చి పడేసింది. ఇలాంటి సీరియల్ కిల్లర్ కథలు బోలెడు చూశాం.
ఇక సినిమా చివర్లో ట్విస్టు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. కాస్తో కూస్తో సినిమాపై ఉన్న మంచి ఇంప్రెషన్ను అది ఇంకా తగ్గించేసింది. సినిమా చూసిన వాళ్లు రెండు గంటలు టైం వేస్ట్ అని తిట్టి పోస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ లాంటి దర్శకుడు ఈ సినిమాను ఎలా సమర్పించాడు.. కీర్తి సురేష్ ఈ చిత్రాన్ని ఎలా ఒప్పుకుంది అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అసలే ఓటీటీల్లో రిలీజవుతున్న సినిమాలు వరుసగా ఫెయిలవుతుండటంతో వాటి పట్ల ఒక నెగెటివ్ ఫీలింగ్ పడిపోయింది.
ఇప్పుడు ‘పెంగ్విన్’ లాంటి పేరున్న సినిమా కూడా వాటి కోవలోకే చేరడంతో ఈ విషయంలో నెగెటివిటీ మరింత పెరిగిపోయేలా కనిపిస్తోంది. బడ్జెట్ మీద లాభానికి రేటు ఇచ్చి సినిమాలు కొని నేరుగా రిలీజ్ చేస్తున్న ఓటీటీ సంస్థలు పునరాలోచనలో పడేలా చేస్తున్నాయి ఈ చిత్రాలు. చూస్తుంటే.. బాక్సాఫీస్ రిజల్ట్ మీద భరోసా లేని నిర్మాతలే ఇలా ఓటీటీల్లో తమ సినిమాల్ని రిలీజ్ చేసి చేతులు దులుపుకుంటున్నారా అన్న సందేహాలు కలుగుతున్నాయి.
నిజంగా సినిమా థియేటర్లలో బాగా ఆడుతుంది, బాగా డబ్బులు తెచ్చిపెడుతుంది అన్న నమ్మకం ఉంటే అంత సులువుగా ఓటీటీ రిలీజ్కు నిర్మాతలు ఒప్పుకోరు. రెడ్, వి లాంటి సినిమాలకు మంచి ఆఫర్లు వచ్చినా ఆయా నిర్మాతలు ఓటీటీ రిలీజ్కు ఒప్పుకోలేదు. వీటిని పక్కన పెడితే భాషతో సంబంధం లేకుండా ఓటీటీల్లో రిలీజవుతున్న సినిమాలన్నీ తుస్సుమంటుండటంతో వాటి పట్ల ప్రేక్షకుల్లో నెగెటివ్ ఫీలింగ్ పడుతోంది. ఇలాంటి సినిమాలు రిలీజ్ చేయడం వల్ల తమకేంటి ప్రయోజనం అని ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పునరాలోచనలో పడుతున్నాయి. మరి ఈ ఒరవడికి బ్రేక్ వేసే సినిమా ఏదో చూడాలి.
This post was last modified on June 20, 2020 3:54 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…
ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…
ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…