మరో సినిమా నేరుగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్లో రిలీజైంది. ఫలితంలో ఏ మార్పూ లేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న కీర్తి సురేష్ సినిమా ‘పెంగ్విన్’ తీవ్ర నిరాశకు గురి చేసింది. ఆహా ఓహో అన్నట్లు ట్రైలర్ కట్ చేసి జనాల్లో ఆసక్తి పెంచిన చిత్ర బృందం.. సినిమాను తేల్చి పడేసింది. ఇలాంటి సీరియల్ కిల్లర్ కథలు బోలెడు చూశాం.
ఇక సినిమా చివర్లో ట్విస్టు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. కాస్తో కూస్తో సినిమాపై ఉన్న మంచి ఇంప్రెషన్ను అది ఇంకా తగ్గించేసింది. సినిమా చూసిన వాళ్లు రెండు గంటలు టైం వేస్ట్ అని తిట్టి పోస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ లాంటి దర్శకుడు ఈ సినిమాను ఎలా సమర్పించాడు.. కీర్తి సురేష్ ఈ చిత్రాన్ని ఎలా ఒప్పుకుంది అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అసలే ఓటీటీల్లో రిలీజవుతున్న సినిమాలు వరుసగా ఫెయిలవుతుండటంతో వాటి పట్ల ఒక నెగెటివ్ ఫీలింగ్ పడిపోయింది.
ఇప్పుడు ‘పెంగ్విన్’ లాంటి పేరున్న సినిమా కూడా వాటి కోవలోకే చేరడంతో ఈ విషయంలో నెగెటివిటీ మరింత పెరిగిపోయేలా కనిపిస్తోంది. బడ్జెట్ మీద లాభానికి రేటు ఇచ్చి సినిమాలు కొని నేరుగా రిలీజ్ చేస్తున్న ఓటీటీ సంస్థలు పునరాలోచనలో పడేలా చేస్తున్నాయి ఈ చిత్రాలు. చూస్తుంటే.. బాక్సాఫీస్ రిజల్ట్ మీద భరోసా లేని నిర్మాతలే ఇలా ఓటీటీల్లో తమ సినిమాల్ని రిలీజ్ చేసి చేతులు దులుపుకుంటున్నారా అన్న సందేహాలు కలుగుతున్నాయి.
నిజంగా సినిమా థియేటర్లలో బాగా ఆడుతుంది, బాగా డబ్బులు తెచ్చిపెడుతుంది అన్న నమ్మకం ఉంటే అంత సులువుగా ఓటీటీ రిలీజ్కు నిర్మాతలు ఒప్పుకోరు. రెడ్, వి లాంటి సినిమాలకు మంచి ఆఫర్లు వచ్చినా ఆయా నిర్మాతలు ఓటీటీ రిలీజ్కు ఒప్పుకోలేదు. వీటిని పక్కన పెడితే భాషతో సంబంధం లేకుండా ఓటీటీల్లో రిలీజవుతున్న సినిమాలన్నీ తుస్సుమంటుండటంతో వాటి పట్ల ప్రేక్షకుల్లో నెగెటివ్ ఫీలింగ్ పడుతోంది. ఇలాంటి సినిమాలు రిలీజ్ చేయడం వల్ల తమకేంటి ప్రయోజనం అని ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పునరాలోచనలో పడుతున్నాయి. మరి ఈ ఒరవడికి బ్రేక్ వేసే సినిమా ఏదో చూడాలి.
This post was last modified on June 20, 2020 3:54 pm
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…
ఈ రోజుల్లో ఒక హీరో సినిమా గురించి తన అభిమానులు చేసే పాజిటివ్ ప్రచారం కంటే.. యాంటీ ఫాన్స్ చేసే…
ఉప్పెనతో టాలీవుడ్ లో సెన్సేషనల్ డెబ్యూ అందుకున్న కృతి శెట్టి ఆ తర్వాత బంగార్రాజు, శ్యామ్ సింగ్ రాయ్ లాంటి…
రాజకీయంగా, వ్యక్తిగతంగా తన ప్రతిష్ఠను చెల్లి దెబ్బతీయాలని ప్రయత్నించిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతీయ కంపెనీ అప్పీలేట్ ట్రిబ్యునల్…