Movie News

‘అల్లు’ వారి చేతికి ఏపీ సినిమా టికెట్లు

ఆంధ్రప్రదేశ్‌లో గత ఏడాది హఠాత్తుగా సినిమా టికెట్ల ధరలు తగ్గించేయడంతో పాటు టికెట్ల అమ్మకాలకు కొత్తగా ప్రభుత్వం తరఫున ఆన్ లైన్ టికెటింగ్ యాప్ తీసుకురాబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై సుదీర్ఘ కసరత్తు జరిగాక.. ఇటీవలే టికెట్ల ధరలను ఓ మోస్తరుగా పెంచింది ప్రభుత్వం. అలాగే ఆన్ లైన్ టికెటింగ్ కోసం యాప్ కూడా రెడీ అయినట్లే.

కాకపోతే ముందు అన్నట్లు ప్రభుత్వం తరఫున కొత్త యాప్ సిద్ధం కావట్లేదు. ఓ ప్రైవేటు ఏజెన్సీకే ఈ బాధ్యతను కట్టబెట్టినట్లు తెలుస్తోంది. టెండర్ ప్రక్రియ ద్వారానే ఈ సంస్థను ఎంపిక చేశారు. ఇప్పటికే పాపులర్ అయిన జస్ట్ టికెట్స్ సంస్థ ఇకపై ఏపీలో టికెట్ల అమ్మకాలు చేపట్టనుంది. అక్కడ బుక్ మై షో సహా వేరే యాప్స్ ఏమీ ఉండవు. పూర్తిగా ఈ ఒక్క యాప్ నుంచే టికెట్ల అమ్మకాలు జరుగుతాయి.

కౌంటర్ బుకింగ్ కోసం కొంత శాతం టికెట్లను పక్కన పెడతారా.. లేక పూర్తిగా ఈ యాప్ ద్వారానే అమ్మకాలు జరుగుతాయా అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ చార్జీలను కొంత తగ్గించి తక్కువ కమిషన్‌తో జస్ట్ టికెట్స్ సంస్థ టికెట్ల అమ్మకాలు చేపట్టనుంది. ఈ సంస్థలో అల్లు అరవింద్ పెద్ద కొడుకు అల్లు బాబీ భాగస్వామిగా ఉండటం విశేషం.

గతంలో బాబీ టికెట్ అడ్డా పేరుతో యాప్ నడిపేవాడు. తర్వాత దాన్ని జస్ట్ టికెట్స్ కొనుగోలు చేసింది. దీంతో బాబీ ‘జస్ట్ టికెట్స్’లో భాగస్వామిగా మారాడు. అతడితో పాటు సంస్థలో ఇంకో నలుగురు డైరెక్టర్లు ఉన్నారు. కాబట్టి ఇది ఏపీలో టికెట్ల అమ్మకాలు పూర్తిగా అల్లు బాబీ చేతుల్లోకి వచ్చేశాయని, దీని వెనుక మెగాస్టార్ చిరంజీవి ఉన్నాడని.. అందుకోసం ఆయన లాబీయింగ్ చేశాడని అనుకోవడానికి వీల్లేదు. కానీ ఇప్పటికే ఈ రకమైన ప్రచారం మొదలైపోయింది సోషల్ మీడియాలో. టికెట్ల ధరలు, ఇతర సమస్యలపై చిరు రాజీ లేకుండా, అలుపెరగకుండా చేసిన పోరాటాన్ని కూడా ఇప్పుడు తగ్గించే ప్రయత్నం జరగొచ్చు. కానీ అది వాస్తవం కాదని సామాన్య జనం అర్థం చేసుకోవాల్సిన అవసరముంది.

Satya

Recent Posts

ఇక కొడాలి నాని వంతు

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ఫైర్‌బ్రాండ్ కొడాలి నానిపై 2021లో న‌మోదైన కేసు విచార‌ణ‌కు తాజాగా ప్రభుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.…

2 hours ago

అత్తెసరు వసూళ్లతో ముంచేసేలా ఉంది

హీరోయిన్ కంగనా రౌనత్ టైం ఏ మాత్రం బాలేదు. పట్టిందల్లా ప్లాస్టిక్ అన్న తరహాలో ఏ జానర్ సినిమా చేసినా…

3 hours ago

‘చంద్రబాబు భరోసానిచ్చారు… మాకు అది చాలు’

ఏపీ సీఎం చంద్రబాబును విజయవాడలోని కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీడియాతో…

5 hours ago

త్రినేత్రుడి కన్నెర్రకు ప్రతిరూపం ‘నాగబంధం’

విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి సినిమాలు తీయడం చాలా రిస్క్. కొన్నిసార్లు ఇవి తీసుకునే సమయం హీరోల కెరీర్ల మీద…

6 hours ago

బాలయ్యతో కాజల్… గ్లామర్ కు దూరంగా పవర్ఫుల్ రోల్

బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…

8 hours ago

ఈ సమయంలో మౌనమేల షర్మిల గారు?

విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…

8 hours ago