ఆర్ఆర్ఆర్ తర్వాత ఈ ఏడాది అత్యధిక అంచనాలతో వస్తున్న సినిమా కేజీఎఫ్-2నే. మూడేళ్ల కిందట కేజీఎఫ్-1 సృష్టించిన సంచలనాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఓ కన్నడ సినిమా కర్ణాటక అవతల రిలీజ్ కావడమే గగనం అంటే.. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లో భారీ వసూళ్లు రాబట్టి పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ అయింది.
ఇక అప్పట్నుంచి చాప్టర్-2 కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. అసలే సినిమాపై అంచనాలు భారీగా ఉండగా.. గత ఏడాది రిలీజ్ చేసిన టీజర్ చూశాక అవి ఇంకా పెరిగిపోయాయి. ముఖ్యంగా టీజర్ చివర్లో రాకీ భారీ తుపాకీతో విధ్వంసం సృష్టించి దాన్నుంచే సిగరెట్ ముట్టించుకునే షాట్ పూనకాలు తెప్పించేసింది మాస్ ప్రేక్షకులకు. అప్పట్నుంచి టీజరే ఇలా ఉంటే.. ట్రైలర్ ఇంకెలా ఉంటుందో అన్న ఉత్కంఠ మొదలైంది. ట్రైలర్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూశారు.
ఐతే ఎట్టకేలకు నిరీక్షణకు తెరదించుతూ ఆదివారం కేజీఎఫ్-2 ట్రైలర్ లాంచ్ చేశారు. అందులో విజువల్స్ మైండ్ బ్లోయింగ్ అనే అనిపించినా.. ఓవరాల్గా ట్రైలర్ అంచనాలకు తగ్గట్లు లేదనే అభిప్రాయం మెజారిటీ ప్రేక్షకుల్లో వ్యక్తమవుతోంది. సోషల్ మీడియా పోల్స్ అన్నింట్లోనూ ట్రైలర్ గురించి నెగెటివ్గానే స్పందిస్తున్నారు. ముఖ్యంగా రాకీ-అధీర మధ్య ఫేసాఫ్ షాట్లేవీ లేకపోవడం.. టీజర్లో మాదిరి మైండ్ బ్లోయింగ్ మాస్ మూమెంట్ మిస్ అవడం ట్రైలర్కు నెగెటివ్ ఫీడ్ బ్యాక్ రావడానికి కారణమయ్యాయి. ఐతే దర్శకుడు ప్రశాంత్ నీల్కు ట్రైలర్ కట్ చేసేటపుడు ఈమాత్రం ఐడియా ఉండి ఉండదా.. సినిమా నుంచి అలాంటి షాట్లు పెట్టలేకపోయాడా అన్న చర్చ నడుస్తోందిప్పుడు.
ట్రైలర్లో అన్నీ చూపించేస్తే హైప్ ఇంకా పెరిగిపోతుందని.. రేప్పొద్దున సినిమా చూసినపుడు ఏమైనా తగ్గితే, కొత్త మెరుపులేమీ లేకుంటే, సర్ప్రైజ్లు తగ్గితే ప్రేక్షకులు డిజప్పాయింట్ కావచ్చొని.. అందుకే సినిమా కోసం చాలా దాచి ఉంటాడని, ఓవర్ హైప్ కూడా మంచిది కాదేమో అన్న ఉద్దేశంతో ఇలా చేసి ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చూద్దాం మరి సినిమాతో అతనెంత సర్ప్రైజ్ చేస్తాడో?
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…
తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…
మా ఇంటి బంగారం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఒక హీరోయిన్ ఫిమేల్…
ఏపీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎంపీ.. ప్రస్తుత ఉండి శాసనసభ్యుడు రఘురామకృష్ణరాజును కస్టడీలో టార్చర్ చేసిన కేసులో హైకోర్టు సంచలన…