ఈ ప్రపంచంలో అమ్మకాలు కొనుగోళ్లు ఏవైనా సరే.. డిమాండ్ అండ్ సప్లై ఆధారంగానే నడుస్తాయన్నది తెలిసిన విషయమే. కర్ణాటకలో తెలుగు సినిమాలకు ఉన్న డిమాండ్ సంగతి తెలిసిందే. ఏదైనా భారీ తెలుగు చిత్రం రిలీజవుతుంటే.. దానికి పోటీగా కన్నడ సినిమాలను రిలీజ్ చేయడానికి భయపడుతుంటారు. ఈ నేపథ్యంలోనే ఆర్ఆర్ఆర్ లాంటి భారీ చిత్రం రెండు రోజుల కిందటే కన్నడ నాట భారీ స్థాయిలో రిలీజైంది.
ఐతే ఆ టైంలో కన్నడిగులు ఈ సినిమాను బహిష్కరించాలంటూ సోషల్ మీడియాలో ఉద్యమం నడపడం గమనార్హం. ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని కన్నడలో రిలీజ్ చేయకుండా కేవలం తెలుగు వెర్షన్కే బుకింగ్స్ నడిపిస్తున్నారని.. అందుకుని ఈ సినిమాను బాయ్ కాట్ చేయాలని కన్నడిగులకు సోషల్ మీడియా ఉద్యమ కారులు పిలుపునిచ్చారు. ఐతే డిస్ట్రిబ్యూటర్ వెంటనే జోక్యం చేసుకుని ఆర్ఆర్ఆర్ కన్నడ వెర్షన్ కోసం కొన్ని స్క్రీన్లు కేటాయించారు. కానీ ఈ చిత్రాన్ని కన్నడలో అక్కడి వాళ్లు ఎగబడి ఏమీ చూసేయడం లేదు.
కన్నడ వెర్షన్కు డిమాండ్ అనుకున్నంతగా లేదు. ఇదిలా ఉంటే.. ఆర్ఆర్ఆర్ రిలీజ్ కావడానికి ముందు వారం దివంగత పునీత్ రాజ్ కుమార్ చివరి సినిమా జేమ్స్ను భారీ స్థాయిలో విడుదల చేయడం తెలిసిన సంగతే. కర్ణాటకలో ఉన్న దాదాపు అన్ని థియేటర్లలో ఈ సినిమాను రిలీజ్ చేశారు. తొలి వారం అక్కడి ప్రేక్షకులు విరగబడి ఈ సినిమా చూశారు. రికార్డు స్థాయిలో వసూళ్లు వచ్చాయి. ఐతే తర్వాతి వారం ఆర్ఆర్ఆర్ రావడంతో జేమ్స్కు డిమాండ్ లేకపోయింది. చూడాల్సిన వాళ్లంతా చూసేశారు. పైగా ఆర్ఆర్ఆర్ మీద అందరి దృష్టి పడింది.
ఆ సినిమా స్క్రీన్లకు, షోలకు, టికెట్లకు బెంగళూరు సహా ప్రధాన నగరాల్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఐతే ఆల్రెడీ కర్ణాటకలో పర భాషా చిత్రాల ఆధిపత్యం పట్ల కన్నడిగులు అసంతప్తితో ఉండటంతో తమకు అత్యంత ప్రియమైన పునీత్ సినిమాను తీసేసి ఆర్ఆర్ఆర్ను వేస్తే ఎక్కడ వారి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందో అని వసూళ్లు గొప్పగా లేకపోయినా ఆ సినిమాకు పెద్ద సంఖ్యలో థియేటర్లను కొనసాగిస్తున్నారు. ఓవైపు వీకెండ్లో ఆర్ఆర్ఆర్కు మరింతగా స్క్రీన్లు, వసూళ్లు పెంచుకునే అవకాశం ఉన్నా.. జేమ్స్ కారణంగా దీనికి స్కోప్ లేకపోయింది. బాహుబలి-2 కర్ణాటక వసూళ్లను తొలి రోజు ఆర్ఆర్ఆర్ కొట్టలేకపోవడానికి కూడా ఇదే కారణం.
This post was last modified on March 27, 2022 1:06 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…