బాలీవుడ్ వెళ్లి అక్కడే పెద్ద హిట్టు కొట్ట అక్కడే స్థిరపడాలని చాలామంది నార్త్ భామలు కలలుగంటూనే ఉంటారు. తెలుగులో మంచి స్టార్డమ్ వచ్చినా కూడా, ముంబాయ్ లో పెద్ద హీరోయిన్లు అయిపోవాలని వీరు ఆలోచిస్తుంటారు.
ఇలియానా, తమన్నా, కాజల్.. ఇలా అందరూ ఇక్కడ పెద్ద స్టార్లు అయ్యాక ముంబాయ్ లో తిరిఇ అడుగుపెట్టారు. కాకపోతే వర్కవుట్ కావట్లేదని తెలుసుకుని కాజల్, తమన్నా మళ్ళీ తెలుగుకు తిరిగొస్తే.. ఇలియానా మాత్రం అక్కడే ఉండిపోయింది. ఫ్లాపైనా కూడా ఇటైతే తిరిగి రావాలని అనుకోలేదు. కొన్న సంవత్సరాల తరువాత వచ్చిన పెద్దగా వర్కవుట్ కాలేదులే. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఇదే మీటర్లో ఉంది.
తెలుగులో వరుసపెట్టి పెద్ద పెద్ద సినిమాలు పడుతున్నప్పుడు.. ఇక్కడే ఉండి సూపర్ స్టార్డమ్ తెచ్చుకుంటుందేమో అనుకుంటే, రకల్ మాత్రం బొంబాయ్ ఫ్లయిట్ ఎక్కేసింది. ఇప్పటివరకు అక్కడ ఒక్క హిట్టు కూడా కొట్టకపోయినా కూడా ఒక అరడజను సినిమాలు చేసింది. హిట్టయిన అజయ్ దేవగన్ ‘దే దే ప్యార్ దే’ సినిమాలో అమ్మడికి సెక్సీగా కనిపించే ఒక్క సాంగ్ తప్పించి కనీసం టాలెంట్ చూపించే సరైన్ సీన్ ఒక్కటీ లేదు. ఇంకో నాలుగైదు చేతిలో ఉన్నాయ్ కూడా. ఇకపోతే అమ్మడు మరో వారంలో ‘ఎటాక్’ సినిమాతో ఎటాక్ ఇస్తోంది.
మార్చి 25న రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ వస్తోందని తెలిసినా కూడా, బాలీవుడ్ సినిమా ‘ఎటాక్’ మాత్రం ఏప్రియల్ 1న రావడానికే డిసైడైపోయింది. ఈ సినిమాలో జాన్ అబ్రహాం ఒక సోల్జర్ పాత్రలో నటిస్తుంటే, జాక్వెలైన్ ఫెర్నాండెజ్ మరియు రకుల ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కంటెంట్ పరంగా ట్రైలర్ చూస్తే బాగానే ఉందిలే కాని, ఇలాంటి సైన్స్ ఫిక్షన్ మిలటీరి సినిమాలో ఎంతవరకు క్లిక్ అవుతాయనేది మాత్రం చెప్పలేం. ఒకవేళ సినిమా హిట్టయినా, ఆర్ఆర్ఆర్ వేవ్ లో నిలబడినా కూడా.. రకుల్ కు ఎంతవరకు ఈ సినిమా వలన ప్లస్సవుతుందో చూడాలి. ఆల్రెడీ పాటలూ అవీ చూస్తుంటే జాక్వెలైన్ రోల్ బాగున్నట్లు అనిపిస్తోంది.
This post was last modified on March 26, 2022 5:11 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…