ట్రిపుల్ ఆర్ సినిమా విడుదయి మంచి టాక్ తెచ్చుకుంది కొన్ని చోట్ల.. కొన్ని చోట్ల మిశ్రమ స్పందన కూడా తెచ్చుకుంది. సినిమా అన్నది హిట్టా ఫట్టా అన్న చర్చలకు కూడా ఇప్పుడిప్పుడే సోషల్ మీడియా ఆస్కారం ఇస్తూ వస్తోంది. తప్పు రాజమౌళిది అని కొందరు.. కథలోనే సత్తా లేదని ఇంకొందరు సినిమాపై పడి ఏడ్వకండి అని ఇంకొందరు తమ తమ వ్యాఖ్యలు జోడిస్తూ మాట్లాడుతూ వస్తున్నారు. అసలు బాహుబలి టీంలో ఎవ్వరూ కూడా పెద్దగా సినిమాకు సపోర్ట్ ఇవ్వలేదు. రానా మినహా ఎవ్వరూ అంతగా రియాక్ట్ కాలేదు. ముంబయి దారుల్లో రానా మాత్రం తన ఇంటికి ట్రిపుల్ ఆర్ టీం ను పిలిచి ఆతిథ్యం ఇచ్చారు.
ఆర్ విత్ ఆర్ఆర్ఆర్ అనే ప్రొగ్రాంను కండక్ట్ చేశారు. ఇది మినహా ప్రభాస్ కానీ అనుష్క కానీ ఇంకా వేరెవ్వరు కూడా ఈ సినిమా మాట్లాడలేదు. బాహుబలి నిర్మాత శోభు మాట్లాడినా కూడా అది కూడా వివాదమే అయింది. కాస్త రిలీఫ్ ఏంటంటే ఆయన మాటల్లో అర్థాలు విపరీతంగా ఉన్నా కూడా ఫ్యాన్స్ వాటిని పెద్దగా పట్టించుకోలేదు. ఇకపై నాన్ ఆర్ఆర్ఆర్ పేరిట రికార్డులు నమోదు అవుతూ ఉంటాయని ఒకసారి, మరోసారి నాన్ ఎస్ఎస్ఆర్ పేరిట రికార్డులు నమోదు అవుతూ ఉంటాయని చెబుతూ శోభు చెప్పిన మాటలు కొన్ని క్షణాలు ట్విటర్ వాల్ ను షేక్ చేశాయి. తరువాత ఎందుకనో నెటిజన్లు సైలెంట్ అయిపోయారు.
ఇక తాజా వివాదంలో తారక్ ఇరుక్కున్నారు. ఈ సినిమాలో తారక్ కు పెద్దగా ప్రాధాన్యం లేదని ఫ్యాన్స్ గగ్గోలు పెడుతున్నారు. కానీ సినిమా సినిమాగానే చూడాలి అని ఇంకొందరు అంటున్నారు. మేకింగ్ పరంగా సినిమా బాగున్నా, మూడేళ్ల పాటు ఓ పెద్ద హీరో కాల్షీట్లు ఉంచేయడం బాలేదని కూడా తారక్ విషయమై రాజమౌళి చేసిన తప్పులను వెలుగులోకి తెస్తున్నారు. దీంతో రాజమౌళి వీటిపై స్పందించినా స్పందించకపోయినా వివాదం అయితే నడుస్తోంది.
మరో ఉపశమనం ఏంటంటే వీటిని పట్టించుకునే స్థితిలో తారక్ కానీ చరణ్ కానీ రాజమౌళి కానీ లేకపోవడం. ఇక సంవాదం ఏంటంటే లోకేశ్ ఈ సినిమా విషయమై నిన్నటి వేళ సానుకూల దృక్పథంతో ట్వీట్లు చేశారు. ఇవన్నీ టీడీపీ అభిమానులను ఆనందింపజేస్తున్నాయి. భీమ్లా నాయక్ విషయమై కూడా ఆయన ఈ విధంగా ట్వీట్లు చేశారు. ఆ రోజు చెప్పిన విధంగా తనకు సినిమా నచ్చితే ఆ సినిమా పై ఆసక్తి ఉంటే తప్పక మాట్లాడతానని అన్నారు. దీంతో చినబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని తారక్ ఫ్యాన్స్ ఆనందిస్తున్నారు.
This post was last modified on March 26, 2022 3:25 pm
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…
జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…
బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ తాండవం 2 మొదటి మూడు రోజులు మంచి వసూళ్లే రాబట్టినా,…
డిసెంబరు బాక్సాఫీస్కు వాయిదా నెలగా మారిపోయింది. ఈ నెలకు వివిధ భాషల్లో షెడ్యూల్ అయిన సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడడం…
‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది పంజాబీ భామ మెహ్రీన్ పిర్జాదా. ఆ తర్వాత ఆమెకు మంచి మంచి…