ఆంధ్రప్రదేశ్లో మామూలుగానే పెద్ద సినిమాలు రిలీజైనపుడు బ్లాక్ టికెట్ల దందా బాగా నడుస్తుంటుంది. ఇక ఆర్ఆర్ఆర్ లాంటి భారీ చిత్రం రిలీజవుతుంటే ఇక చెప్పేదేముంది? మామూలుగా అయితే థియేటర్ల వాళ్లు కొన్ని టికెట్లు బ్లాక్ చేసి పెట్టి.. వాటిని థియేటర్ సిబ్బందితోనే బయట ఎక్కువ రేటుకు అమ్మించడం జరుగుతుంటుంది. పోలీసులు చూసీ చూడనట్లు ఉంటుంటారు.
ఈ వ్యవహారమంతా కాస్త చాటుగానే ఉండేలా చూసుకుంటుంటారు. కానీ ఈ మధ్య ఏపీలో వ్యవహారం మారిపోయింది. టికెట్ల రేట్లు తగ్గించాక ఆన్ లైన్ అమ్మకాలు తగ్గించేసి కౌంటర్లోనే ఎక్కువ రేటు పెట్టి అమ్మడం జరుగుతోంది. థియేటర్ల వాళ్లు స్థానిక అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కై ఎక్కువ రేటుకు టికెట్లను అమ్ముకుంటున్నారు. కొన్ని చోట్ల డిస్ట్రిబ్యూటర్లు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నారు.
పుష్ప సినిమాకు చాలా చోట్ల ప్రభుత్వం నిర్దేశించిన రేట్లను పక్కన పెట్టి ఫ్లాట్ రేటు 200-250 పెట్టి అమ్మకాలు సాగించడం గమనార్హం. ఇప్పుడిక ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చింది. దీనికున్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. టికెట్ల కోసం డిమాండ్ కూడా మామూలుగా లేదు. ఈ సినిమాకు టికెట్ల ధరలు పెంచుకునే అవకాశం కల్పించింది ప్రభుత్వం. అయినా సరే.. చాలా థియేటర్లు ఆన్ లైన్కు రాలేదు. కౌంటర్ బుకింగ్స్కే పరిమితం అయ్యాయి.
ఆన్ లైన్లో టికెట్లు పెట్టినా అందుబాటులో ఉన్నవి తక్కువే. చాలా వరకు బ్లాక్ చేసేస్తున్నారు. చాలా థియేటర్లలో కౌంటర్ దగ్గరే రూ.300-400 మధ్య ఫ్లాట్ రేట్ పెట్టి అమ్మేస్తుండటం గమనార్హం. దీనికి తోడు బ్లాక్ టికెటింగ్ దందా వేరుగా నడుస్తోంది. డిమాండును బట్టి షోలు మొదలవడానికి ముందు 500-1000 మధ్య రేటుతో టికెట్లు అమ్మడం ఖాయంగా కనిపిస్తోంది. దీని గురించి ప్రశ్నించేవాళ్లు, ప్రశ్నించినా పట్టించుకునేవాళ్లు లేకపోవడంతో ప్రేక్షకుల జేబులకు భారీగా చిల్లు పడుతోంది. పేదల కోసం చౌకగా సినీ వినోదం అనే జగన్ సర్కారు మాటకు అసలు విలువే లేదన్నది గ్రౌండ్ రిపోర్ట్.
This post was last modified on March 24, 2022 11:31 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…