ఆంధ్రప్రదేశ్లో మామూలుగానే పెద్ద సినిమాలు రిలీజైనపుడు బ్లాక్ టికెట్ల దందా బాగా నడుస్తుంటుంది. ఇక ఆర్ఆర్ఆర్ లాంటి భారీ చిత్రం రిలీజవుతుంటే ఇక చెప్పేదేముంది? మామూలుగా అయితే థియేటర్ల వాళ్లు కొన్ని టికెట్లు బ్లాక్ చేసి పెట్టి.. వాటిని థియేటర్ సిబ్బందితోనే బయట ఎక్కువ రేటుకు అమ్మించడం జరుగుతుంటుంది. పోలీసులు చూసీ చూడనట్లు ఉంటుంటారు.
ఈ వ్యవహారమంతా కాస్త చాటుగానే ఉండేలా చూసుకుంటుంటారు. కానీ ఈ మధ్య ఏపీలో వ్యవహారం మారిపోయింది. టికెట్ల రేట్లు తగ్గించాక ఆన్ లైన్ అమ్మకాలు తగ్గించేసి కౌంటర్లోనే ఎక్కువ రేటు పెట్టి అమ్మడం జరుగుతోంది. థియేటర్ల వాళ్లు స్థానిక అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కై ఎక్కువ రేటుకు టికెట్లను అమ్ముకుంటున్నారు. కొన్ని చోట్ల డిస్ట్రిబ్యూటర్లు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నారు.
పుష్ప సినిమాకు చాలా చోట్ల ప్రభుత్వం నిర్దేశించిన రేట్లను పక్కన పెట్టి ఫ్లాట్ రేటు 200-250 పెట్టి అమ్మకాలు సాగించడం గమనార్హం. ఇప్పుడిక ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చింది. దీనికున్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. టికెట్ల కోసం డిమాండ్ కూడా మామూలుగా లేదు. ఈ సినిమాకు టికెట్ల ధరలు పెంచుకునే అవకాశం కల్పించింది ప్రభుత్వం. అయినా సరే.. చాలా థియేటర్లు ఆన్ లైన్కు రాలేదు. కౌంటర్ బుకింగ్స్కే పరిమితం అయ్యాయి.
ఆన్ లైన్లో టికెట్లు పెట్టినా అందుబాటులో ఉన్నవి తక్కువే. చాలా వరకు బ్లాక్ చేసేస్తున్నారు. చాలా థియేటర్లలో కౌంటర్ దగ్గరే రూ.300-400 మధ్య ఫ్లాట్ రేట్ పెట్టి అమ్మేస్తుండటం గమనార్హం. దీనికి తోడు బ్లాక్ టికెటింగ్ దందా వేరుగా నడుస్తోంది. డిమాండును బట్టి షోలు మొదలవడానికి ముందు 500-1000 మధ్య రేటుతో టికెట్లు అమ్మడం ఖాయంగా కనిపిస్తోంది. దీని గురించి ప్రశ్నించేవాళ్లు, ప్రశ్నించినా పట్టించుకునేవాళ్లు లేకపోవడంతో ప్రేక్షకుల జేబులకు భారీగా చిల్లు పడుతోంది. పేదల కోసం చౌకగా సినీ వినోదం అనే జగన్ సర్కారు మాటకు అసలు విలువే లేదన్నది గ్రౌండ్ రిపోర్ట్.
This post was last modified on March 24, 2022 11:31 am
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…