ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర పది రోజుల నుంచి ‘ది కశ్మీర్ ఫైల్స్’ ఎలాంటి సంచలననాలు రేపుతోందో తెలిసిందే. బాలీవుడ్లో మామూలుగా ఎక్కువ మంది ఫిలిం మేకర్స్ ముస్లిం సానుభూతి పరులుగా ఉంటారని, వారికి అనుకూలంగానే సినిమాలు తీస్తుంటారనే అభిప్రాయం ఉంది. హిందువులను, హిందూ దేవుళ్లను కించపరిచేలా సినిమాలు తీస్తుంటారంటూ నార్త్ ఇండియన్సే బాలీవుడ్ మీద విరుచుకుపడుతుంటారు.
సౌత్ సినిమాల్లో హిందూ సంస్కృతిని, దేవుళ్లను గొప్పగా చూపించే వైనాన్ని కొనియాడుతుంటారు. ఐతే ఇప్పుడు ‘ది కశ్మీర్ ఫైల్స్’ దీనికి భిన్నంగా కశ్మీర్లో హిందూ పండిట్ల మీద ఇస్లాం ఛాందసవాదులు జరిపిన అఘాయిత్యాల మీద హార్డ్ హిట్టింగ్ కథాకథనాలతో తెరకెక్కి అందరినీ ఆకట్టుకుంటోంది. ఐతే ఈ సినిమా మీద బాలీవుడ్ నటీనటులు, ఫిలిం మేకర్స్ ఆచితూచి స్పందిస్తున్నారు. చాలామంది వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. దీని మీద కామెంట్ చేయడానికి ఇష్టపడట్లేదు.ఇలాంటి తరుణంలో ఆమిర్ ఖాన్ ‘ది కశ్మీర్ ఫైల్స్’ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఢిల్లీలో జరిగిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషనల్ ఈవెంట్కు హాజరైన సందర్భంగా ‘కశ్మీర్ ఫైల్స్’ బాక్సాఫీస్ సంచలనాల గురించి మీడియా వాళ్లు అతడి వద్ద ప్రస్తావిస్తూ.. ఈ సినిమా చూశారా అని అడిగారు. దానికి బదులిస్తూ.. ‘‘పనిలో బిజీగా ఉండటం వల్ల నేనా సినిమా ఇంకా చూడలేదు. తప్పకుండా చూస్తారు. ప్రతి భారతీయుడూ ఇలాంటి సినిమాలు చూడాలి. కశ్మీర్ ఫైల్స్ మన చరిత్రకు నిదర్శనం.
ఒకానొక సమయంలో కశ్మీర్ పండిట్లకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు విచారకరం. మానవత్వాన్ని నమ్మే ప్రతి ఒక్కరినీ ఈ చిత్రం భావోద్వేగానికి గురి చేసింది. ఈ సినిమా విజయవంతం అయినందుకు సంతోషిస్తున్నా’’ అని ఆమిర్ అన్నాడు. గతంలో మోడీ సర్కారు వ్యతిరేకంగా మాట్లాడుతూ.. దేశంలో అసహనం పెరిగిపోతోందంటూ ఒక కామెంట్ చేసి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నాడు ఆమిర్. ఈ నేపథ్యంలో ఇప్పుడు భాజపా వాళ్లు భుజానికి ఎత్తుకున్న, ఇస్లాం ఛాందసవాదానికి వ్యతిరేకంగా తెరకెక్కిన సినిమా గురించి ఆమిర్ ఇలా మాట్లాడటం ప్రాధాన్యం సంతరించుకుంది.
This post was last modified on March 22, 2022 9:27 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…