గాన గంధర్వరుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయి ఏడాదిన్నర కావస్తోంది. బాలును అమితంగా ఇష్టపడే అభిమానులు ఆయన లేని విషయాన్ని జీర్ణించుకుని ముందుకు సాగడానికి చాలా సమయమే పట్టింది. కానీ ఇప్పుడు కూడా బాలును తలుచుకుంటే ఒక రకమైన బాధ అభిమానులను వెంటాడుతుంది.
అభిమానులకు. ఆయన పాట విన్నా.. మాట విన్నా.. ఆయన గురించి ఎవరైనా మాట్లాడింది విన్నా.. భావోద్వేగం కట్టలు తెంచుకుంటుంది. బాలు లాంటి గాయకుడు మరొకరు లేరు అనడానికి ఎన్నో రుజువులున్నాయి. అలాంటిదే సంగీత దర్శకుడు కీరవాణి ఇప్పుడో విషయాన్ని పంచుకున్నారు. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లలో భాగంగా హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్లతో కలిసి ఒక చిట్ చాట్ కార్యక్రమంలో పాల్గొన్న కీరవాణి.. మధ్యలో బాలు ప్రస్తావన వచ్చినపుడు ఆయన గొప్పదనాన్ని చాటే ఓ సీక్రెట్ను బయటపెట్టారు.
రామ్ చరణ్ నటించిన మగధీర చిత్రంలో ఒకప్పటి చిరు సినిమా ఘరానా మొగుడులోని బంగారు కోడి పెట్ట పాటను రీమిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ పాట ఆరంభంలో అప్ అప్ హ్యాండ్సప్ అనే పంక్తులు వస్తాయన్న సంగతి తెలిసిందే. బాలు ఫుల్ ఎనర్జీతో, హై పిచ్లో పాడారు ఆ లైన్లను. ఐతే ఈ పాటను రీమిక్స్ చేయాలనుకున్నపుడు ఈ పాట పాడిన సింగర్తో ఆ లైన్లు పాడించాలని చూస్తే తన వల్ల కాలేదట.
ఆ లైన్ల వరకు వేరే సింగర్లను కూడా ప్రయత్నించగా.. ఎవరూ బాలును మ్యాచ్ చేసే స్థాయిలో ఆ లైన్లను అందుకోలేకపోయారట. దీంతో ఇక లాభం లేదని ఒరిజినల్ పాటలోని బాలు పాడిన ట్రాక్నే తీసుకుని ఆ లైన్ల వరకు కొత్త పాటలో కలిపేసినట్లు కీరవాణి వెల్లడించారు. తర్వాత ఈ పాట విని.. ఇదేంటి తన గొంతు లాగే ఉందని బాలు కీరవాణితో అన్నారట. అవును.. మీ గొంతేనని.. మీకు చెప్పకుండా అలాగే పెట్టేశాం అని వివరణ ఇచ్చుకున్నట్లు కీరవాణి వెల్లడించారు. ఈ వీడియో చూసి అభిమానులు బాలుకు బాలునే సాటి అంటూ ఎమోషనల్ అవుతున్నారు.
This post was last modified on March 21, 2022 9:47 am
కాలం కలిసి వచ్చి.. గాలి వాటంగా వీసే వేళలో.. తమకు మించిన తోపులు మరెవరు ఉండరన్నట్లుగా మాటలు మాట్లాడే గులాబీ…
ట్రాఫిక్ ఉల్లంఘనలకు చలానాలు విధిస్తూ ఉంటారు ట్రాఫిక్ పోలీసులు. ఇంతవరకు ఓకే. హైదరాబాద్ మహానగరంలో అయితే.. ట్రాఫిక్ నియంత్రణ వదిలేసి…
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కేజ్రీవాల్ జోరుకు బ్రేకులు వేయాలని బీజేపీ భావిస్తోంది.…
వైసీపీ నేతలు, కార్యకర్తల వెంట్రుక కూడా పీకలేరు అంటూ మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా…
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…