గాన గంధర్వరుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయి ఏడాదిన్నర కావస్తోంది. బాలును అమితంగా ఇష్టపడే అభిమానులు ఆయన లేని విషయాన్ని జీర్ణించుకుని ముందుకు సాగడానికి చాలా సమయమే పట్టింది. కానీ ఇప్పుడు కూడా బాలును తలుచుకుంటే ఒక రకమైన బాధ అభిమానులను వెంటాడుతుంది.
అభిమానులకు. ఆయన పాట విన్నా.. మాట విన్నా.. ఆయన గురించి ఎవరైనా మాట్లాడింది విన్నా.. భావోద్వేగం కట్టలు తెంచుకుంటుంది. బాలు లాంటి గాయకుడు మరొకరు లేరు అనడానికి ఎన్నో రుజువులున్నాయి. అలాంటిదే సంగీత దర్శకుడు కీరవాణి ఇప్పుడో విషయాన్ని పంచుకున్నారు. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లలో భాగంగా హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్లతో కలిసి ఒక చిట్ చాట్ కార్యక్రమంలో పాల్గొన్న కీరవాణి.. మధ్యలో బాలు ప్రస్తావన వచ్చినపుడు ఆయన గొప్పదనాన్ని చాటే ఓ సీక్రెట్ను బయటపెట్టారు.
రామ్ చరణ్ నటించిన మగధీర చిత్రంలో ఒకప్పటి చిరు సినిమా ఘరానా మొగుడులోని బంగారు కోడి పెట్ట పాటను రీమిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ పాట ఆరంభంలో అప్ అప్ హ్యాండ్సప్ అనే పంక్తులు వస్తాయన్న సంగతి తెలిసిందే. బాలు ఫుల్ ఎనర్జీతో, హై పిచ్లో పాడారు ఆ లైన్లను. ఐతే ఈ పాటను రీమిక్స్ చేయాలనుకున్నపుడు ఈ పాట పాడిన సింగర్తో ఆ లైన్లు పాడించాలని చూస్తే తన వల్ల కాలేదట.
ఆ లైన్ల వరకు వేరే సింగర్లను కూడా ప్రయత్నించగా.. ఎవరూ బాలును మ్యాచ్ చేసే స్థాయిలో ఆ లైన్లను అందుకోలేకపోయారట. దీంతో ఇక లాభం లేదని ఒరిజినల్ పాటలోని బాలు పాడిన ట్రాక్నే తీసుకుని ఆ లైన్ల వరకు కొత్త పాటలో కలిపేసినట్లు కీరవాణి వెల్లడించారు. తర్వాత ఈ పాట విని.. ఇదేంటి తన గొంతు లాగే ఉందని బాలు కీరవాణితో అన్నారట. అవును.. మీ గొంతేనని.. మీకు చెప్పకుండా అలాగే పెట్టేశాం అని వివరణ ఇచ్చుకున్నట్లు కీరవాణి వెల్లడించారు. ఈ వీడియో చూసి అభిమానులు బాలుకు బాలునే సాటి అంటూ ఎమోషనల్ అవుతున్నారు.
This post was last modified on March 21, 2022 9:47 am
మనసుంటే మార్గాలు ఉంటాయని మంత్రి నారా లోకేష్ నిరూపించారు. ఒక పారిశ్రామికవేత్త ట్విట్టర్లో పెట్టిన మెసేజ్ కు నిముషాల్లో స్పందించారు.…
నేచురల్ స్టార్ నాని కెరీర్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం.. ది ప్యారడైజ్. ఇంతకుముందు నానికి ‘దసరా’ రూపంలో కెరీర్…
టాక్సిక్ గురించి సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన నడుస్తున్న వేళ ఒక అవసరం లేని టాపిక్ సామజిక మాధ్యమాల్లో ట్రెండ్…
యుఎస్లో పెద్ద పెద్ద స్టార్లను మించి మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో.. నాని. హీరోగా తొలి అడుగులు వేస్తున్న రోజుల్లోనే…
కాంగ్రెస్పార్టీ మాజీ అధ్యక్షురాలు, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ..పుస్తకం ముద్రణ వ్యవహారం వివాదంగా మారింది.…
ఆగస్ట్ అయిపోతోంది. ఎన్ని సినిమాలు రిలీజైనా ఇరుముడినే క్లియర్ విన్నర్ గా నిలిచి రికార్డుల భరతం పట్టేసింది. విశ్వనాథ్ అండ్…