గాన గంధర్వరుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయి ఏడాదిన్నర కావస్తోంది. బాలును అమితంగా ఇష్టపడే అభిమానులు ఆయన లేని విషయాన్ని జీర్ణించుకుని ముందుకు సాగడానికి చాలా సమయమే పట్టింది. కానీ ఇప్పుడు కూడా బాలును తలుచుకుంటే ఒక రకమైన బాధ అభిమానులను వెంటాడుతుంది.
అభిమానులకు. ఆయన పాట విన్నా.. మాట విన్నా.. ఆయన గురించి ఎవరైనా మాట్లాడింది విన్నా.. భావోద్వేగం కట్టలు తెంచుకుంటుంది. బాలు లాంటి గాయకుడు మరొకరు లేరు అనడానికి ఎన్నో రుజువులున్నాయి. అలాంటిదే సంగీత దర్శకుడు కీరవాణి ఇప్పుడో విషయాన్ని పంచుకున్నారు. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లలో భాగంగా హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్లతో కలిసి ఒక చిట్ చాట్ కార్యక్రమంలో పాల్గొన్న కీరవాణి.. మధ్యలో బాలు ప్రస్తావన వచ్చినపుడు ఆయన గొప్పదనాన్ని చాటే ఓ సీక్రెట్ను బయటపెట్టారు.
రామ్ చరణ్ నటించిన మగధీర చిత్రంలో ఒకప్పటి చిరు సినిమా ఘరానా మొగుడులోని బంగారు కోడి పెట్ట పాటను రీమిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ పాట ఆరంభంలో అప్ అప్ హ్యాండ్సప్ అనే పంక్తులు వస్తాయన్న సంగతి తెలిసిందే. బాలు ఫుల్ ఎనర్జీతో, హై పిచ్లో పాడారు ఆ లైన్లను. ఐతే ఈ పాటను రీమిక్స్ చేయాలనుకున్నపుడు ఈ పాట పాడిన సింగర్తో ఆ లైన్లు పాడించాలని చూస్తే తన వల్ల కాలేదట.
ఆ లైన్ల వరకు వేరే సింగర్లను కూడా ప్రయత్నించగా.. ఎవరూ బాలును మ్యాచ్ చేసే స్థాయిలో ఆ లైన్లను అందుకోలేకపోయారట. దీంతో ఇక లాభం లేదని ఒరిజినల్ పాటలోని బాలు పాడిన ట్రాక్నే తీసుకుని ఆ లైన్ల వరకు కొత్త పాటలో కలిపేసినట్లు కీరవాణి వెల్లడించారు. తర్వాత ఈ పాట విని.. ఇదేంటి తన గొంతు లాగే ఉందని బాలు కీరవాణితో అన్నారట. అవును.. మీ గొంతేనని.. మీకు చెప్పకుండా అలాగే పెట్టేశాం అని వివరణ ఇచ్చుకున్నట్లు కీరవాణి వెల్లడించారు. ఈ వీడియో చూసి అభిమానులు బాలుకు బాలునే సాటి అంటూ ఎమోషనల్ అవుతున్నారు.
This post was last modified on March 21, 2022 9:47 am
బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీమంత్రి కేటీఆర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం ఒకరిద్దరి చేతుల్లో ఉంటే.. ఇలాంటి…
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…