ఇంకో ఐదు రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు వస్తోంది ‘ఆర్ఆర్ఆర్’ మూవీ. ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. ‘బాహుబలి’ తరహాలోనే ఇది కూడా బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేస్తుందనే నమ్మకంతో ఉన్నారు అటు మేకర్స్, ఇటు ప్రేక్షకులు. ఈ సినిమాపై ఇప్పటికే ఉన్న హైప్ను ఇంకా పెంచడానికి గట్టిగా ప్రమోషన్లు చేస్తోంది రాజమౌళి అండ్ టీం.
ఐతే ప్రమోషన్లలో ఈ సినిమా గురించి ఇస్తున్న ఎలివేషన్ అంతా బాగానే ఉంది కానీ.. ఈ క్రమంలో రాజమౌళి చేసిన బాక్సాఫీస్ అద్భుతం ‘బాహుబలి’ని తగ్గించేస్తున్నారన్న అభిప్రాయం ప్రేక్షకుల నుంచి వ్యక్తమవుతోంది. ‘ఆర్ఆర్ఆర్’ మీద ఫోకస్ ఉండాలనో ఏమో.. స్వయంగా రాజమౌళే ‘బాహుబలి’ గురించి మాట్లాడాల్సి వచ్చినపుడు ఉద్దేశపూర్వకంగా మాట దాటవేస్తున్నాడు. చిత్ర బృందంలో కూడా ఎవ్వరూ ‘బాహుబలి’ గురించి మాట్లాడకుండా ఆయన జాగ్రత్త పడుతున్నట్లు కనిపిస్తోంది.
పైగా ‘ఆర్ఆర్ఆర్’.. ‘బాహుబలి’ని మించిన సినిమా అంటున్నాడు. నిన్న ప్రి రిలీజ్ ఈవెంట్లో ఎక్కడా ఎవ్వరూ ‘బాహుబలి’ ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడ్డారు. తారక్ అయితే ‘ఆర్ఆర్ఆర్’ ప్రాంతీయ అడ్డుగోడల్ని బద్దలు కొడుతుందని, భారతీయ సినిమా సత్తాను ప్రపంచానికి చాటుతుందని అన్నాడు. కానీ ఈ పని ‘బాహుబలి’ ఎప్పుడో చేసిందన్న విషయం మరిచిపోకూడదు. అసలు రాజమౌళి అనే పేరు ప్రపంచానికి బాగా తెలిసింది, ఆయన ఇండియాలో నంబర్ వన్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నది ‘బాహుబలి’ సినిమాతోనే.
ఆ చిత్రం ప్రేక్షకులకు ఒక ఎమోషన్. తెలుగు రాష్ట్రాల అవతల కూడా ప్రేక్షకులను మన ఆడియన్స్ స్థాయిలోనే ఉద్రేకానికి, ఉద్వేగానికి గురి చేసి వాళ్లను ఉర్రూతలూగించిన సినిమా అది. ఐతే ‘బాహుబలి’ కేవలం ప్రమోషన్లతో జనాలకు చేరువ కాలేదు. నాన్ తెలుగు ఆడియన్స్ ఓపెన్ మైండ్తో ఈ సినిమా చూసి ఫిదా అయిపోయారు. ఆ సినిమాను అమితంగా ప్రేమించారు. ‘ది బిగినింగ్’ తర్వాత ‘ది కంక్లూజన్’ కోసం విపరీతమైన ఆసక్తితో ఎదురు చూశారు. ఆ యుఫోరియా అన్నది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఇంకే సినిమాకు కూడా పునరావృతం కాకపోవచ్చు. ‘ఆర్ఆర్ఆర్’ కూడా అందుకు మినహాయింపు కాదనే చెప్పాలి. జనాలు ‘బాహుబలి’తో పోల్చుకోకూడదని జక్కన్న భావిస్తున్నాడో ఏమో కానీ.. తాను సృష్టించిన అద్భుతాన్ని తానే తగ్గించే ప్రయత్నం చేస్తుండటం ఆ సినిమాను అపూర్వంగా ఆదరించిన ప్రేక్షకులకు మింగుడు పడటం లేదు.
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…