లక్ష్యం.. గోపీచంద్ కెరీర్లో ఒకప్పుడు బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన సినిమా. దర్శకుడు శ్రీవాస్కు ఇదే తొలి సినిమా కావడం విశేషం. గోపీచంద్, జగపతిబాబు, అనుష్క ముఖ్య పాత్రల్లో రసవత్తరంగా ఈ యాక్షన్ ఎంటర్టైనర్ను తీర్చిదిద్ది ప్రేక్షకుల మనసులు గెలిచాడు శ్రీవాస్. ఆ తర్వాత అతడి కెరీర్లో మళ్లీ గోపీచంద్తోనే తీసిన లౌక్యం మినహా సక్సెస్ లేదు.
చివరగా సాక్ష్యం సినిమాతో ఎదురు దెబ్బ తిన్న శ్రీవాస్.. చాలా గ్యాప్ తీసుకుని మళ్లీ తనకు అచ్చొచ్చిన గోపీచంద్తోనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బేనర్ మీద టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ఈ చిత్రానికి టైటిల్ ఖరారైనట్లు సమాచారం.
తమ కలయికలో వచ్చిన తొలి సినిమా పేరు కలిసొచ్చేలా లక్ష్యం-2 అనే పేరును ఈ చిత్రానికి ఖరారు చేశారట గోపీ, శ్రీవాస్. ఇప్పటిదాకా అయితే ఈ సినిమా లక్ష్యంకు సీక్వెల్ అన్న హింట్లేమీ రాలేదు. మరి ఊరికే పేరు కలిసొస్తుందని లక్ష్యం-2 అని పెట్టారా లేక ఆ కథనే కొనసాగిస్తున్నారా అన్నది తెలియదు.
గోపీచంద్ నటిస్తున్న 30వ సినిమా ఇది కావడం, అతడితో పాటు శ్రీవాస్కూ ఈ సినిమా సక్సెస్ కావడం చాలా అవసరం కావడంతో బాగా కసరత్తు చేసే రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. క్లాస్ సినిమాలకు పెట్టింది పేరైన మిక్కీ జే మేయర్ ఈ మాస్ చిత్రానికి సంగీతం అందిస్తుండటం విశేషం. ఇటీవలే ఖిలాడి సినిమాలో తన గ్లామర్తో అందరి దృష్టినీ ఆకర్షించిన తెలుగమ్మాయి డింపుల్ హయతి ఈ చిత్రంలో ఓ కథానాయికగా నటిస్తోంది. ఇందులో మరో కథానాయికకీ చోటున్నట్లు సమాచారం.
This post was last modified on March 20, 2022 1:21 pm
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా రూపొందుతున్న 'ఆదర్శ కుటుంబం' షూటింగ్ మంచి స్వింగ్ లో ఉంది. ముందుగా తీసుకున్న…
మరీ డెడ్ డ్రైగా మారిపోయిన తెలుగు రాష్ట్రాల థియేటర్లు పెద్ద సినిమాలు లేక అల్లాడిపోతున్నాయి. రెండు మూడు రోజులు ప్రమోషన్లతో…
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించుకునేందుకు కొనసాగిన ఉద్యమం కొత్త పుంతలు తొక్కింది. యావత్తు తెలంగాణ వేదికగా సాగిన ఈ ఉద్యమంలో…
``రాజకీయ నేతలు.. ప్రజల కోసం పనిచేసేది తక్కువ.. సెక్స్ వీడియోలు చూసేది ఎక్కువ. కావాలంటే.. నా ఫోన్ సహా.. రాష్ట్రంలోని…
బద్రి లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు పూరి జగన్నాథ్. అరంగేట్రంలోనే అలాంటి హిట్ పడిందంటే ఇక…
తెలంగాణ ప్రభుత్వం ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డైరెక్టర్ జనరల్స్(డీజీ)గా పదోన్నతి కల్పించింది. వీరిలో మహేశ్ భగవత్, స్వాతి లక్రా,…