ఈ హెడ్డింగ్ చూసి.. మళ్లీ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్లతో రాజమౌళి ఇంకో సినిమా తీయబోతున్నాడా.. లేక ఆర్ఆర్ఆర్కు సీక్వెల్ చేయబోతున్నాడా అన్న సందేహాలు కలగొచ్చు. కానీ అసలు సంగతి వేరు. ఈ నెల 25న ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజయ్యాక.. ఇంకొన్ని రోజులకు ఇంకో ఆర్ఆర్ఆర్ మూవీని రిలీజ్ చేయబోతున్నాడట జక్కన్న.
అది వేరే కథ కాదు. ఇంకో సినిమా కాదు. మనం ఈ వారం వెండితెరపై చూడబోతున్న ఆర్ఆర్ఆర్ సినిమానే.. కొన్ని రోజులకు వేరే నటీనటులతో బుల్లితెరపై చూపిస్తాడట జక్కన్న. ఇదేం చిత్రం అనిపిస్తోందా? ఇది ఆర్ఆర్ఆర్ కోసం పని చేసిన రాజమౌళి అసిస్టెంట్లు చేయబోతున్న మాయ.
ఆర్ఆర్ఆర్ ప్రి రిలీజ్ ఈవెంట్లో దీని గురించి వెల్లడించాడు రాజమౌళి. తాను ఏ సినిమా చేసినా.. అసలు నటీనటులు చేయడానికి ముందు ప్రతి సన్నివేశాన్నీ అసిస్టెంట్ డైరెక్టర్లతో రిహార్సల్స్ చేయడం అలవాటు అని.. అలా ప్రతి సన్నివేశాన్నీ ముందే ట్రయల్ షూట్ చేస్తామని.. ఆర్ఆర్ఆర్ విషయంలోనూ ఇదే జరిగిందని.. తన అసిస్టెంట్లు ప్రతి సన్నివేశాన్నీ నటించి చూపించారని అన్నారు.
ఇక అదంతా షూట్ చేశామని, అంతే కాక ఎడిటింగ్ కూడా చేసి పెట్టామని.. మొత్తం ఆర్ఆర్ఆర్ సినిమా అంతా తన అసిస్టెంట్ల వెర్షన్లో చూడొచ్చని.. అసలు సినిమా రిలీజయ్యాక కొన్ని రోజులకు ఈ వెర్షన్ను కూడా అందరు ప్రేక్షకులకూ చూపిస్తామని.. ఇది ఒక నవ్వుల విందు అవుతుందని జక్కన్న చెప్పాడు. ఎప్పుడూ తన సినిమాల వేడుకల్లో అసిస్టెంట్ల గురించి చెప్పడానికి అవకాశం రాదని, టైమైపోతోందని వారి గురించి చెప్పనని.. కానీ ఈ రోజు మాత్రం వాళ్లందరి గురించి చెప్పాల్సిందే, మీరు భరించాల్సిందే అంటూ జక్కన్న తన 10 మంది అసిస్టెంట్ల గురించి ఆర్ఆర్ఆర్ ప్రి రిలీజ్ ఈవెంట్లో చెప్పుకొచ్చాడు.
This post was last modified on March 20, 2022 10:12 am
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…