గత వారం భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాధేశ్యామ్ మిశ్రమ స్పందన తెచ్చుకున్న సంగతి తెలిసిందే. డివైడ్ టాక్ను తట్టుకుని తొలి వారాంతం వరకు, అది కూడా తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లే రాబట్టిన ఈ చిత్రం.. ఆ తర్వాత నిలబడలేకపోయింది.
వీకెండ్ తర్వాత వసూళ్లు ఒక్కసారిగా పడిపోయాయి. రెండో వీకెండ్లో స్పందన అంతంతమాత్రంగానే ఉంది. తెలుగు రాష్ట్రాల అవతల సినిమా రన్ ఆల్రెడీ ముగిసినట్లే కనిపిస్తోంది. దర్శకుడిగా ఒక్క సినిమా అనుభవమే ఉన్నప్పటికీ ప్రభాస్ లాంటి పెద్ద స్టార్తో సినిమా చేసే అవకాశం దక్కితే దాన్ని ఉపయోగించుకోలేకపోయాడని రాధాకృష్ణ కుమార్ మీద విమర్శలు వస్తున్నాయి. ఐతే రాధాకృష్ణ మాత్రం తాను మంచి సినిమానే తీశానని, సినిమాను అర్థం చేసుకున్న ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నారని అంటున్నాడు.
అదే సమయంలో తన చిత్రానికి విమర్శలు కూడా తక్కువగా ఏమీ రాలేదని అతనన్నాడు. రాధేశ్యామ్ విడుదల తర్వాత ప్రభాస్ స్పందనను సైతం అతను పంచుకున్నాడు. రాధేశ్యామ్ రిలీజ్ తర్వాత ప్రభాస్ను నేరుగా కలిసే అవకాశం లేకపోయిందని, అతను విదేశాలకు వెళ్లాడని, ఐతే ఫోన్లో మెసేజ్ల ద్వారా తామిద్దరం టచ్లో ఉన్నామని రాధాకృష్ణ వెల్లడించాడు.
సినిమాకు వస్తున్న మిశ్రమ స్పందన గురించి స్పందిస్తూ.. రిలీజ్ తర్వాత తొలి మూడు రోజులు తన ఇమేజ్.. సినిమాను డామినేట్ చేస్తుందని ప్రభాస్ వ్యాఖ్యానించినట్లు రాధాకృష్ణ తెలిపాడు.
ప్రేక్షకుల్లో కొందరు తమ సినిమాపై ప్రశంసలు కురిపిస్తుంటే.. అదే సమయంలో విమర్శలు కూడా వస్తున్న మాట నిజమే అని.. ఐతే ఈ నెగెటివిటీ ఎందుకు వచ్చిందో అర్థం కాలేదని, కానీ రోజులు గడిచేకొద్దీ సినిమాకు జనాలు బాగా కనెక్ట్ అవుతున్నారని.. చాలా ఎమోషనల్గా మెసేజ్లు పెడుతున్నారని రాధాకృష్ణ తెలిపాడు. తన భార్య ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలకు కన్నీళ్లు పెట్టుకుని ఎమోషనల్గా స్పందించిందని, సినిమాకు అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్స్ తన నుంచే అని రాధాకృష్ణ చెప్పాడు.
This post was last modified on March 20, 2022 8:22 am
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని…
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు రేణుకా చౌదరి.. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే…
మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…
ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…